UPSC: 1,261 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలివే..!

పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్‌ ఇచ్చింది. మెడికల్ సర్వీసెస్‌కు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలివే..

Published : 20 Apr 2023 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్‌ ఆఫీసర్ల నియామకానికి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1,261 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  యూపీఎస్సీ(UPSC) కంబైన్డ్‌ మెడిక్‌ సర్వీసెస్‌ పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి.  ఏప్రిల్‌ 19న ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ మే 9న సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ అదికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. UPSC CMS పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.

యూపీఎస్సీ మెడికల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • మొత్తంగా 1261 పోస్టులు ఉండగా.. వీటిలో కేటగిరీ-1లో మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్) 584 పోస్టులు ఉన్నాయి. అలాగే, కేటగిరి-2లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే) పోస్టులు 300;  జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌) పోస్టులు ఒకటి చొప్పున భర్తీ చేయనున్నారు. దీంతో పాటు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌)లో 376 పోస్టులు ఉన్నాయి.
  • ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 32కు మించరాదు. అభ్యర్థులు ఎంబీబీఎస్‌ పాసై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తులకు అర్హులే.
  • దరఖాస్తు రుసుం రూ.200. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తొలుత ఓటీఆర్‌ చేసుకొని ఆ తర్వాత దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుంను నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
  • ఈ-అడ్మిట్‌కార్డులు జూన్‌లో; ఫలితాలను ఆగస్టు 23న విడుదల చేస్తారు.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ (100 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ 
  • ఆబ్జెక్టివ్‌ రూపంలో జరిగే ఈ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని