Dhulipalla: ఏపీలో ఒక్కో రైతుకు రూ.2.74లక్షల అప్పు: ధూళిపాళ్ల నరేంద్ర
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు.
ఒంగోలు: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా మహానాడులో ‘కష్టాల కడలిలో సేద్యం.. దగా పడుతున్న రైతన్న’ తీర్మానాన్ని ధూళిపాళ్ల ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా అప్పుల భారం కలిగిన రైతులు ఏపీలోనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని చెప్పారు.
రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?
ఏపీలో సగటున ఒక్కో రైతుపై రూ.2.74లక్షల అప్పు ఉందని ధూళిపాళ్ల చెప్పారు. వైకాపా ప్రభుత్వం చెప్పిన రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 45లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటే 15లక్షల ఎకరాలకే బీమా ఇచ్చారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పెట్రోల్ ధరల భారం కారణంగా రైతులపై తీవ్రమైన భారం పడుతోందన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే లాభమంటూ మంత్రులు వితండ వాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున మేలు చేస్తుంటే వారి జీవితాలు ఎందుకు బాగుపడలేదని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా హయాంలో రైతులకు ఉన్న పథకాలన్నీ ఆగిపోయాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?