Andhra News: ‘నాపై దాడి చేసింది తెదేపా వారే’: వైకాపా ఎమ్మెల్యే వెంకట్రావు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు.
ఏలూరు: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జి.కొత్తపల్లిలో వైకాపా నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేయలేదని, తెదేపా వారే దాడి చేయించారని ఆరోపించారు. స్థానిక తెదేపా నేతలే వెనక ఉండి దాడి చేయించారన్నారు. జి.కొత్తపల్లిలో వైకాపా నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని, వారి మధ్య వివాదం రాజీ చేసినట్లు చెప్పారు. గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జి.కొత్తపల్లిలో ఇవాళ వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీలోని మరో వర్గం అడ్డుకొని దాడికి దిగింది. ఎమ్మెల్యేను వెంబడించి ఓ ప్రాంతంలో వైకాపా వర్గీయులు చుట్టుముట్టి పిడిగుద్దుల వర్షం కురిపించారు. పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచి అతి కష్టం మీద ఆయనను పక్కకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పాఠశాలలోనే దిగ్బంధించారు. పోలీసులు భారీగా మోహరించి ద్విచక్రవాహనంపై ఎమ్మెల్యేను గ్రామం దాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!