PRC:పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే చర్చలు
పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ చేసిన
సంప్రదింపులకు ఆహ్వానించిన ప్రభుత్వం
నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేడు సమ్మె నోటీసు
జిల్లాలతో ఉద్యమ కార్యాచరణకు పర్యవేక్షణ సెల్ ఏర్పాటు
పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం
ఈనాడు - అమరావతి
పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ తేల్చిచెప్పింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ చేసిన ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అశుతోష్ మిశ్ర నివేదికను ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. అంతకుముందు.. ఉద్యోగ సంఘాల నాయకులను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా మంత్రుల కమిటీ ఆహ్వానించింది. సంప్రదింపుల కోసం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటుచేశారు.
విజయవాడలోని రెవెన్యూ కార్యాలయంలో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ఆదివారం దాదాపు 5 గంటలకు పైగా సమావేశమై చర్చించింది. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానాన్ని చూడలేదంది. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త జీతాలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తేవొద్దని సూచించింది. జిల్లాలతో ఉద్యమ కార్యాచరణ సమన్వయం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై సమాధానాలు ఇచ్చేందుకు 8 మంది సభ్యులతో పర్యవేక్షణ సెల్ను ఏర్పాటు చేసింది. స్టీరింగ్ కమిటీలో సభ్యులను 20కి పెంచారు. సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు ప్రకటించాయి.
ఇంత పెద్ద ఉద్యమం చరిత్రలోనే లేదు: బండి శ్రీనివాసరావు
ఇంత పెద్ద ఉద్యోగుల ఉద్యమం చరిత్రలో ఎప్పుడూ లేదని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ‘స్టీరింగ్ కమిటీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. సీఎస్కు సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సమ్మె నోటీసు ఇస్తాం. ఈ ఉద్యమానికి కారణం ప్రభుత్వమే. పీఆర్సీ అంటే జీతాలు పెరగడమే చూశాం. కానీ, ఇప్పుడు జీతాల రికవరీ చూస్తున్నాం. పాత జీతాలే ఇవ్వాలని సీఎస్కు విన్నవించాం. ప్రభుత్వం మాత్రం కొత్త జీతాలు ఇవ్వాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి తెస్తోంది. స్టీరింగ్ కమిటీ సభ్యుల సంఖ్యను 12 నుంచి 20 మందికి పెంచాం. జిల్లాలతో సమన్వయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు.
ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచిది కాదని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హితవు పలికారు. ‘ఎప్పుడూ చరిత్రలో చూడని విధంగా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రభుత్వం, వైకాపా ఉద్యోగులపై మాటల యుద్ధం చేయిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నవి అబద్ధాలని, వారిపై మాటల యుద్ధం చేయాలని చెప్పడంపై ఆవేదన చెందుతున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల వాతావరణం కల్పించాలే గానీ, ఘర్షణ వాతావరణం సృష్టించకూడదు. ఉద్యమ సమయంలో ఆవేదన, ఆవేశంతో మాట్లాడిన వాటిపైనా కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఉద్యోగులకు వ్యతిరేకంగా కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. చర్చలకు రమ్మంటారు.. వారు చెప్పినదానిపైనే ఉంటారు. మేము ఏ పార్టీనీ ఉద్యమంలోకి రానివ్వడం లేదు. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఉద్యోగులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తోంది. పీఆర్సీ నివేదికపై చర్చించకుండానే నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం పట్ల నిరసన తెలుపుతున్నాం. ఉద్యోగులందరూ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎవరూ రాజకీయ, వ్యక్తిగత దూషణలు చేయొద్దు. ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు. మెరుగైన పీఆర్సీ, సీఎం హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలి’ అని సూచించారు.
ఉత్తర్వులు రద్దుచేసే వరకూ చర్చలు ఉండవు: సూర్యనారాయణ
పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం, అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను ఇస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ‘ఉద్యమ కార్యాచరణపై సమావేశమయ్యాం. ప్రభుత్వంతో చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైనా చర్చించాం. మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారన్నది మీడియాలో చూశాం. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు అధికారంగా కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఫోన్ చేసి, సోమవారం చర్చలకు రావాలని పిలిచారు. కమిటీ పరిధి ఏంటో తెలియడం లేదు. కొత్త పీఆర్సీని బలవంతంగా అమలుచేయడం నిలిపివేయాలి. జనవరికి పాత వేతనాలే ఇవ్వాలి. ఉద్యోగులు ఎవరికి వారు ఉద్యమ కార్యాచరణపై ఉండాలి. రాజకీయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి’ అని సూచించారు.
పీఆర్సీ ఉత్తర్వులతో తీవ్ర నష్టం: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే సమయంలో అన్నీ సమన్వయం చేసుకోకపోవడంతోనే నష్టం జరిగిందని భావించాం. అందుకే కలిసి పోరాడాలని నిర్ణయించాం. ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. అశుతోష్ మిశ్ర నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై చర్చలు పునఃప్రారంభించాలి. మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి. ఉద్యోగసంఘాల్లో వచ్చిన ఐక్యత చూసి, ఇతర సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఉద్యోగులకు నమ్మకం కలగడంతో ప్రతిపాదనలు ఇస్తున్నారు. పీఆర్సీ, సీఎం ప్రకటించిన అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిపైనా చర్చిస్తాం. ఉద్యమ ఫలితాలు ఉద్యోగులకు దక్కేలా చూస్తాం. సచివాలయ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నాం. ఉద్యోగుల అభిప్రాయం తీసుకుంటాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM