3 అంశాలు పరిష్కరిస్తేనే చర్చలకు..
పీఆర్సీపై ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల/రద్దు చేయాలని, అశుతోష్మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు
మంత్రుల కమిటీకి స్పష్టం చేసిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల/రద్దు చేయాలని, అశుతోష్మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటేనే చర్చలకు సానుకూల వాతావరణం నెలకొంటుందని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఒకసారి ఉత్తర్వులిచ్చాక వాటిని నిలిపేయడం సరికాదని పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ వారికి వివరించింది. ఉద్యోగ సంఘాల ముఖ్యనేతలతో కలిసి ఈ నెల 27న చర్చలకు రావాలని ఆహ్వానించింది. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ ఆహ్వానం మేరకు.. మంగళవారం ఆస్కార్రావు, వైవీరావు తదితర తొమ్మిది మందితో కూడిన స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయానికి వచ్చింది. తాము ప్రతిపాదించిన అంశాలపై లేఖ అందించింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్తో సుమారు గంటకుపైగా వారు సమావేశమయ్యారు. అనంతరం సజ్జల తదితరులు విలేకరులతో మాట్లాడారు.
ఉద్యోగుల జీతాల్లో రూపాయి తగ్గనీయం
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి.. రూపాయి తగ్గకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఫిట్మెంట్కు సంబంధించిన అంశం పరిష్కారమైందని, మిగిలినవేవైనా ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తాము ప్రతిపాదించిన 3అంశాలను పరిష్కరిస్తేనే ముఖ్య నేతలు చర్చలకు వస్తారని స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు చెప్పారు. ఈ రకమైన వాతావరణం సరికాదు. ఉద్యోగులంతా ఆలోచించుకోవాలి. సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడకపోతే ఆందోళన చెందాలి. వారి సంక్షేమాన్ని ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే కోరకముందే ఐఆర్ ఇచ్చారు. ముఖ్య నేతలు, జిల్లా నాయకులు, ఉద్యోగులకు మళ్లీ చెబుతున్నాం. ఇది ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వం. వారు అడిగినా అడక్కపోయినా చేయగలిగనంతా చేస్తుంది. భయాలు తొలగించడానికి, నష్టాన్ని సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.
మేం వ్యతిరేకం కాదు
ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు, చర్చల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం 127 జీవోనిచ్చి మమ్మల్ని ఆహ్వానించింది. మేము చర్చలకు రాలేదు. అందుకు వ్యతిరేకమూ కాదు. ఆ మూడు అంశాలపై నిర్ణయం తీసుకుంటేనే వస్తామని చెప్పాం. మళ్లీ సమావేశం తేదీనాటికి వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఛైర్మన్ల స్థాయిలో అంతా కలిసి చర్చలకు వస్తాం.
- ఆస్కార్రావు, స్టీరింగ్ కమిటీ ప్రతినిధి
సానుకూల నిర్ణయంపై ఆశాభావం
మూడు అంశాలను పరిష్కరిస్తే చర్చలు కొనసాగించుకుంటూ మాట్లాడుకోవచ్చనే విషయాన్ని మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తాం. వీటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రితో మాట్లాడాల్సి ఉందని వారన్నారు. 27న సమావేశమవుదామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం ఉంది. అప్పుడే మావైపు నుంచి అందుకనుగుణంగా అడుగులుంటాయి.
- వైవీరావు, స్టీరింగ్ కమిటీ ప్రతినిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.