3 అంశాలు పరిష్కరిస్తేనే చర్చలకు..
పీఆర్సీపై ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల/రద్దు చేయాలని, అశుతోష్మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు
మంత్రుల కమిటీకి స్పష్టం చేసిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల/రద్దు చేయాలని, అశుతోష్మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటేనే చర్చలకు సానుకూల వాతావరణం నెలకొంటుందని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఒకసారి ఉత్తర్వులిచ్చాక వాటిని నిలిపేయడం సరికాదని పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ వారికి వివరించింది. ఉద్యోగ సంఘాల ముఖ్యనేతలతో కలిసి ఈ నెల 27న చర్చలకు రావాలని ఆహ్వానించింది. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ ఆహ్వానం మేరకు.. మంగళవారం ఆస్కార్రావు, వైవీరావు తదితర తొమ్మిది మందితో కూడిన స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయానికి వచ్చింది. తాము ప్రతిపాదించిన అంశాలపై లేఖ అందించింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్తో సుమారు గంటకుపైగా వారు సమావేశమయ్యారు. అనంతరం సజ్జల తదితరులు విలేకరులతో మాట్లాడారు.
ఉద్యోగుల జీతాల్లో రూపాయి తగ్గనీయం
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి.. రూపాయి తగ్గకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఫిట్మెంట్కు సంబంధించిన అంశం పరిష్కారమైందని, మిగిలినవేవైనా ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తాము ప్రతిపాదించిన 3అంశాలను పరిష్కరిస్తేనే ముఖ్య నేతలు చర్చలకు వస్తారని స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు చెప్పారు. ఈ రకమైన వాతావరణం సరికాదు. ఉద్యోగులంతా ఆలోచించుకోవాలి. సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడకపోతే ఆందోళన చెందాలి. వారి సంక్షేమాన్ని ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే కోరకముందే ఐఆర్ ఇచ్చారు. ముఖ్య నేతలు, జిల్లా నాయకులు, ఉద్యోగులకు మళ్లీ చెబుతున్నాం. ఇది ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వం. వారు అడిగినా అడక్కపోయినా చేయగలిగనంతా చేస్తుంది. భయాలు తొలగించడానికి, నష్టాన్ని సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.
మేం వ్యతిరేకం కాదు
ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు, చర్చల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం 127 జీవోనిచ్చి మమ్మల్ని ఆహ్వానించింది. మేము చర్చలకు రాలేదు. అందుకు వ్యతిరేకమూ కాదు. ఆ మూడు అంశాలపై నిర్ణయం తీసుకుంటేనే వస్తామని చెప్పాం. మళ్లీ సమావేశం తేదీనాటికి వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఛైర్మన్ల స్థాయిలో అంతా కలిసి చర్చలకు వస్తాం.
- ఆస్కార్రావు, స్టీరింగ్ కమిటీ ప్రతినిధి
సానుకూల నిర్ణయంపై ఆశాభావం
మూడు అంశాలను పరిష్కరిస్తే చర్చలు కొనసాగించుకుంటూ మాట్లాడుకోవచ్చనే విషయాన్ని మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తాం. వీటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రితో మాట్లాడాల్సి ఉందని వారన్నారు. 27న సమావేశమవుదామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం ఉంది. అప్పుడే మావైపు నుంచి అందుకనుగుణంగా అడుగులుంటాయి.
- వైవీరావు, స్టీరింగ్ కమిటీ ప్రతినిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.