New District:ఉగాది నాటికి కొత్త జిల్లాలు
రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత
ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ఫిట్మెంట్
2023 నాటికి పోలవరం పూర్తి
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటవుతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. ఇందులో రెండు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని వివరించారు. సుపరిపాలన, పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి పెరుగుతుందని గవర్నర్ వివరించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు.
ఉద్యోగులకు మంచి పీఆర్సీ
‘రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటు, కొవిడ్ కారణంగా సొంత వనరులు తగ్గినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పీఆర్సీని ప్రకటించింది. 23% ఫిట్మెంట్ ప్రయోజనం కల్పించడంతోపాటు ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు, గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 27% ఐఆర్ మంజూరు చేసింది. ఆర్థిక సమస్యలున్నా 11వ వేతన సవరణ కమిషన్ను అమలు చేస్తున్నాం. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.10,247 కోట్ల ఆర్థిక భారం పడనుంది’ అని గవర్నర్ పేర్కొన్నారు.
32 నెలల్లో ప్రజలకు రూ.1,67,798 కోట్లు పంపిణీ
‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ), ప్రత్యక్షేతర ప్రయోజన బదిలీ విధానంలో 32 నెలల్లో రికార్డు స్థాయిలో 9,29,15,170 మంది లబ్ధిదారులకు రూ.1,67,798 కోట్లు పంపిణీ చేశాం’ అని అన్నారు.
‘వివిధ సంక్షేమ పథకాల కింద రైతులకు ఇప్పటి వరకు రూ.86,313 కోట్ల సాయం అందించాం. అమూల్ భాగస్వామ్యంతో రైతుకు లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 అదనపు ఆదాయం వస్తోంది’ అని గవర్నర్ వివరించారు.
పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ‘నాడు- నేడు’
‘విద్య పథకాల కింద ఇప్పటి వరకు 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్ల లబ్ధి చేకూర్చాం. మన బడి నాడు-నేడు పథకంలో రూ.16,025 కోట్లు వెచ్చించి పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాం. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద ఇప్పటివరకు రూ.45,837 కోట్లు సమకూర్చాం. విడతల వారీగా పెంచుతూ నెలకు రూ.3 వేల పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హరిచందన్ అన్నారు.
కొప్పర్తిలో మెగా పారిశ్రామిక హబ్
‘రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి సమీపంలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేయబోతున్నాం. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం వద్ద మూడు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 వేల కోట్లు వ్యయం చేయాలని భావిస్తోంది’ అని గవర్నర్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది పోలవరం పూర్తి!
‘పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. వెలిగొండ టన్నెల్-1ను 2022 ఖరీఫ్కు ప్రారంభిస్తాం. ప్రభుత్వం తాగు, సాగునీటి కోసం రూ.74,920 కోట్లతో ప్రాధాన్యక్రమంలో 54 ప్రాజెక్టులను చేపడుతోంది’ అని గవర్నర్ వెల్లడించారు.
ప్రజలే ప్రభుత్వం.. అదే రాజ్యాంగ సిద్ధాంతం
ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, అమరావతి: ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు.. ఈ సిద్ధాంతంపైనే భారత రాజ్యాంగం రూపుదిద్దుకుని ప్రజాస్వామ్యాన్ని మనకు అందించింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. ఈ మహోన్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన దార్శనికులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ, ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
* సచివాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సచివాలయ ప్రధాన భద్రతాధికారి కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్