చిట్టా తయారవుతోంది.. ఖబడ్దార్‌: అచ్చెన్నాయుడు

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. మహానాడుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులను అడ్డుకోవడం ఎవరితరమూ కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Published : 25 May 2022 05:42 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. మహానాడుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులను అడ్డుకోవడం ఎవరితరమూ కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తొలుత ఒంగోలు స్టేడియాన్ని ఇస్తామని కలెక్టర్‌ అంగీకరించి, తర్వాత సీఎంవో నుంచి హెచ్చరికలు వెళ్లడంతో ఇవ్వలేమని చెప్పారని తెలిపారు. మహానాడుకు ఎవరూ వాహనాలు ఇవ్వడానికి వీల్లేదని విద్యాసంస్థల యాజమాన్యాలకు ఫోన్లు చేసి హెచ్చరించడం ఏమిటని ధ్వజమెత్తారు. అద్దె చెల్లిస్తామని చెప్పినా ఆర్టీసీ బస్సులు ఇవ్వడంలేదని, ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలను సైతం బెదిరించారని మండిపడ్డారు. నిబంధనలు పాటించని అధికారులను గుర్తుపెట్టుకుంటామని, వారి చిట్టా తయారుచేస్తున్నామని, ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. మహానాడు జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిఒక్కరి భరతం పడతామన్నారు. ప్రభుత్వం ఎంతగా ఇటువంటి అరాచకాలు చేస్తే, మహానాడు అంతగా విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని