చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర

తెదేపా అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నాగరాజు తన కుమారుడు మంజునాథతో కలిసి పాదయాత్ర చేపట్టారు.

Published : 17 Jan 2022 04:25 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నాగరాజు తన కుమారుడు మంజునాథతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఆదివారం శ్రీకాళహస్తికి చేరిన సందర్భంగా వీరికి తెదేపా నేతలు విత్తనాభివృద్ధి సంస్థ కూడలి వద్ద స్వాగతం పలికారు. చంద్రబాబు అలిపిరి ఘటనలో గాయపడటాన్ని చూసి చలించిపోయిన నాగరాజు అప్పటి నుంచి 114 సార్లు మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. తాజాగా 115వ సారి కుమారుడితో కలిసి తిరుమలతో పాటు శ్రీకాళహస్తికి నడిచివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని