Andhra News: కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయవాడలో ఫ్లెక్సీ

భీమ్లానాయక్‌ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్‌కల్యాణ్‌ అభిమానులు

Updated : 26 Feb 2022 09:29 IST

విజయవాడ (కృష్ణలంక), న్యూస్‌టుడే: భీమ్లానాయక్‌ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్‌కల్యాణ్‌ అభిమానులు ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌ ఫొటోలు ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీపై మరోవైపు వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ చిత్రాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని