భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక..
షరతులతో నేతన్న నేస్తానికి కోత
కూలి కార్మికుల పొట్టకొట్టిన జగన్
మార్కెటింగ్ సహకారానికి తిలోదకాలు
తెదేపా ప్రభుత్వం అమలు చేసిన రాయితీకి ఎగనామం
ముడి సరకు ధరలు రెట్టింపైనా... జీఎస్టీ గుదిబండగా మారినా ఆదుకోని వైకాపా సర్కారు
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. పథకాలను అందని ద్రాక్షల్ని చేసినందుకు... మీకు నీతి లేదని చే‘నేత’లు... చీదరించుకుంటున్నారు జగన్!
‘మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు ప్రోత్సాహకంగా ఇస్తాం’... 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేతలకు జగన్ ఇచ్చిన హామీ ఇది. తీరా అధికారంలోకి వచ్చాక హామీకి ముందు ‘సొంత’ అనే పదాన్ని చేర్చి ‘సొంత మగ్గముంటేనే రూ.24 వేలు ఇస్తా’మని మాట మార్చారు. కూలీ మగ్గాలపై నేసే వారందరి నోట్లో మట్టి కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాల్లో 3.50 లక్షల మంది కార్మికులుంటే నేతన్న నేస్తం కింద జగన్ ఆర్థికసాయం అందించింది 80 వేల మందికే. ఈ ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నానని చెప్పి.. తెదేపా ప్రభుత్వంలో చేనేతలకు అమలైన ఇతర పథకాలన్నీ రద్దు చేశారు. ముడి సరకు రాయితీ ఎత్తేశారు. మార్కెటింగ్కు సహకారం ఇవ్వలేదు. నిల్వలు పేరుకుపోయినా పట్టించుకోలేదు. గుంత మగ్గాల్లో నీరు చేరి అల్లాడినా చెవికి ఎక్కించుకోలేదు. జీఎస్టీ గుదిబండగా మారినా మిన్నకున్నారు. వీటన్నింటికీ తోడు మాస్టర్ వీవర్స్ దగ్గర రోజువారీ కూలీకి వెళ్లే వారికి నేతన్ననేస్తం ఎగ్గొట్టారు. చేనేతలకు 45 ఏళ్లకు పింఛను ఇస్తాననే హామీకి నీళ్లొదిలారు. 90% రాయితీతో కేంద్రం ఇచ్చే ఆధునిక పరికరాలను అందించలేదు. ఇన్నీ దుర్మార్గాలు చేసింది జగనే. బీసీలంటే ఎంత పగ లేకుంటే ఇన్ని దారుణాలకు ఒడిగడతారు?
కూలీ మగ్గాలపై ఎవరు నేస్తున్నారో గుర్తించడం కష్టమట!
చేనేతలందరికీ నేతన్ననేస్తం వర్తింపచేయకుండా జగన్ కుట్ర పన్నారు. లేకపోతే 100 మగ్గాలున్న మాస్టర్ వీవర్కు ఆర్థిక సాయం అందిస్తూ... వాటిపై కూలీలుగా పనిచేసే కార్మికులకు వర్తింప చేయకపోవడం ఏమిటి? ప్రజల సమస్త సమాచారాన్ని చటుక్కున తెలుసుకునే వాలంటీరు, గ్రామ సచివాలయ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి కదా! అలాంటప్పుడు మాస్టర్ వీవర్స్ దగ్గర పనిచేస్తున్న కూలీల వివరాలను తెలుసుకోవడం కష్టమా? నేత పనుల్లో అల్లు పోయడం, రంగులు అద్దడం, వార్పింగ్, జరీపోయడం, వైండింగ్, అచ్చు అతకడం, కండెలు చుట్టడం, డిజైనింగ్ పనులను అనుబంధ రంగాల వారు చేస్తారు. నిజంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలనే తపనే జగన్కు ఉంటే ఎందరు ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారో లెక్క తేల్చలేరా?
- కంచిపట్టు చీరల నేతకు ధర్మవరం ప్రసిద్ధి. ఇక్కడ 33 వేల మంది చేనేత వృత్తిలో ఉండగా... నేతన్ననేస్తం సాయం 10 వేల మందికే అందింది. మిగతా వారిలో 15 వేల మంది కూలీలు మగ్గాలు నేస్తున్నారని, 8 వేల మంది చేనేత ఉపవృత్తులు చేసుకుంటున్నారని సాయం అందించరట. రోజుకు రూ.400 సంపాదించే వీరంతా జగన్ దృష్టిలో ధనవంతులుగా కనిపించడమే ఇక్కడ విషాదం. ఇది ఒక్క ధర్మవరానికే పరిమితం కాదు. రాష్ట్రంలోని చేనేత కార్మికులున్న ప్రతిచోటా ఇలాంటి పరిస్థితే ఉంది.
- మంగళగిరి కార్పొరేషన్లో 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరిలో సొంత మగ్గాలున్న 488 మందికి 5వ విడతలో నేతన్ననేస్తం అందించారు. మాస్టర్ వీవర్స్ వద్ద, సొసైటీల్లో నేసే 700 మందికి, ఇళ్లల్లో అద్దె మగ్గాలపై నేసే మిగతా వారికి పథకం వర్తించలేదు.
- ఎమ్మిగనూరులో గద్వాల పట్టు చీరలు నేసే కార్మికులు 8,200 మంది ఉంటే నేతన్ననేస్తం సాయం అందించింది 1,800 మందికే. మిగతా 6,400 మంది మాస్టర్ వీవర్స్ దగ్గర కూలీ కింద మగ్గాలు నేసేవారే.
- మదనపల్లె పురపాలక సంఘంలో 2,904 మందికి నేతన్ననేస్తం కింద ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక్కడ అద్దె మగ్గాలపై నేసే 1,500 మందికి, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న 3 వేల మందికి మొండిచేయి చూపించారు.
గుంత మగ్గాల్లోకి నీరు చేరినా...
నాలుగు చినుకులు రాలినా... జోరున వర్షం కురిసినా.... వాతావరణంలో తేమ శాతం పెరిగినా... మగ్గంపై పడుగు, పేక ముందుకు కదలదు. తుపాన్లు పోటెత్తితే కార్మికుల ఉపాధిపై పడే ప్రభావం మరింత ఎక్కువే. గుంత మగ్గాలున్న వారి పరిస్థితి మరీ దారుణం. మగ్గంపై ఉన్న చీరలు పాడైపోతాయి. మగ్గాలు, రాట్నాలు దెబ్బతింటాయి. వర్షం ఆగినా నీటి ఊట ఆగదు. మగ్గం ఆడేందుకు సహకరించదు. ఇలా ఒకటి, రెండు రోజులైతే ఫర్వాలేదు. అదే 20-30 రోజులు అయితే? వర్షాకాలం మొత్తం ఇదే పరిస్థితి ఎదురైతే? ఆ పేద చేనేత కుటుంబాలు కడుపు నింపుకొనేది ఎలా? జగన్ ఇవేమీ ఆలోచించలేదు.
- గతేడాది తుపాన్ల సమయంలో వెంకటగిరిలో 800 గుంత మగ్గాల్లో నీరు చేరడంతో కార్మికుల ఉపాధి తీవ్రంగా దెబ్బతింది. మగ్గంపై ఉన్న రూ.20-40 వేల విలువైన చీరలు పాడయ్యాయి. ఒక్కో నేత కార్మికుడికి రూ.15-30 వేల వరకు నష్టం వాటిల్లింది.
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 5వేల వరకు గుంతమగ్గాలున్నాయి. 2022లో కురిసిన భారీ వర్షాలకు గుంతల్లో ఊట నీరు చేరి చీరలు, మగ్గాలు దెబ్బతిన్నాయి.
- అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో 6వేల మగ్గాలున్నాయి. గతేడాది నవంబరు, డిసెంబరులో కురిసిన వర్షంతో నేతన్నలు 25 రోజులపాటు ఉపాధికి దూరమయ్యారు. జగన్ ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు.
చేనేత సంఘాల్ని నిర్వీర్యం చేశారు...
రాష్ట్రంలో 800 పైగా చేనేత సంఘాలున్నాయి. ఇందులో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేశాయి. మూడేళ్ల సరాసరి అమ్మకాలను తీసుకుని దానిపై 10% రాయితీ ఇచ్చేవారు. ఒక్కో సంఘానికి రూ.8 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు లబ్ధి చేకూరేది. జగన్ వచ్చాక దీన్ని పూర్తిగా నిలిపేశారు.
త్రిఫ్ట్ ఫండ్ను తీసేశారు...
సంఘాల్లోని కార్మికుల్లో పొదుపును ప్రోత్సాహించేందుకు అప్పట్లో త్రిఫ్ట్ పథకం అమలైంది. నేత కార్మికుడు నెలవారీ ఆదాయంలో 8% పొదుపు చేసుకుంటే దానికి సమానంగా 8% ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదట్లో ఈ 8%లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4% చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా... అప్పటి తెదేపా ప్రభుత్వం తానే మొత్తం 8% భరిస్తానని హామీ ఇచ్చింది. జగన్ దీన్ని అమలు చేయలేదు.
జీఎస్టీ గుదిబండగా మారినా ఆదుకోలేదు..
చేనేతలపై జీఎస్టీ భారం గుదిబండగా మారింది. నూలుపై 5%, రంగుపై 18%, రసాయనాలపై 18% జీఎస్టీ ఉంది. కరోనాకు ముందు ముడిసరకు రూ.3,200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,500కు చేరింది. నిన్నమొన్నటి దాకా రూ.6,000 వరకు ఉంది. అంటే ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయినా... పట్టించుకోలేదు.
తెదేపా ప్రభుత్వమిచ్చిన పట్టు రాయితీని ఎత్తేశారు...
పట్టుచీరలు నేసే కార్మికులకు ముడిసరకు రాయితీ పథకమనేది అత్యంత కీలకమైనది. దీన్ని నిలిపేసి వారిపై జగన్ కోలుకోలేని దెబ్బకొట్టారు. తెదేపా ప్రభుత్వం మొదట్లో ఒక్కో చేనేత కార్మికుడికి నెలకు ఆరు కిలోలకు కిలోపై రూ.200 చొప్పున రూ.1,200 రాయితీగా అందించింది. అంటే ఏడాదికి రూ.14,400. ఆ తర్వాత ముడి సరకు ధరలు పెరగడంతో 2018-19లో నెలకు ఇచ్చే రాయితీని రూ.2 వేలకు పెంచింది. అంటే నేత కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు రాయితీగా అందినట్టే. దీన్ని మరింత గొప్పగా అమలు చేస్తానని ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చిన జగన్ గెలిచాక మడమ తిప్పేశారు.
చేనేత పింఛన్లకు ఎసరు...
వృత్తి ఆధారంగా ఎప్పటి నుంచో చేనేతలు పింఛన్లు తీసుకుంటున్నారు. కొత్తగా పింఛను మంజూరు చేసేందుకు జగన్ ఎక్కడ లేని నిబంధనలు పెట్టారు. మాస్టర్ వీవర్స్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు.. ఆయన దగ్గర తీసుకునే కూలి డబ్బు రెండేళ్ల నుంచి కార్మికుని బ్యాంకు ఖాతాలో జమైనట్టు ఆధారం చూపించాలట. ఈమేరకు మాస్టర్ వీవర్ సైతం ధ్రువీకరణ అందించాలట. సొంత మగ్గం నేసే వారైతే ముడిసరకు కొనుగోలుకు సంబంధించి రెండేళ్ల జీఎస్టీ చెల్లింపు వివరాలు అందించాలట. ఈ నిబంధనల్ని పెట్టి జనవరికి ముందు కొత్తగా దరఖాస్తు చేసుకున్న చేనేతలెవ్వరికీ పింఛను ఇవ్వలేదు. ప్రస్తుతానికి కొత్త పింఛన్ల వరకే ఈ నిబంధనల్ని పరిమితం చేశారు. మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తే పింఛన్ల పరిస్థితి ఏమవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇదీ స్ట్రాంగ్రూమే!
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
సంక్షిప్త వార్తలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..