Chandrababu: గొడ్డలి పోటునే గుండెపోటన్నారు.. సారా మరణాలో లెక్కా?
మరణాలను సహజ మరణాలుగా చూపించడం ఓ లెక్కా? కల్తీ సారా తాగి 26 మంది చనిపోతే వారివి సహజ మరణాలంటారా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంగారెడ్డిగూడెం వచ్చి, నిజాలేంటో తేల్చాలి. ఈ ప్రభుత్వం మరో పాతికేళ్లు ప్రజలతో కోటా పెట్టి మరీ నిర్బంధంగా మద్యం తాగిస్తుంది.
తెదేపా అధినేత చంద్రబాబు విమర్శ
జంగారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాలకు పరామర్శ
గొడ్డలి పోటునే గుండెపోటుగా చిత్రీకరించిన వారికి సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం ఓ లెక్కా?కల్తీ సారా తాగి 26 మంది చనిపోతే వారివి సహజ మరణాలంటారా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జంగారెడ్డిగూడెం వచ్చి, నిజాలేంటో తేల్చాలి. ఈ ప్రభుత్వం మరో పాతికేళ్లు ప్రజలతో కోటా పెట్టి మరీ నిర్బంధంగా మద్యం తాగిస్తుంది. ఎందుకంటే మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించే రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చింది. మరో రూ.25వేల కోట్ల రుణాలకు వెళ్తోంది.
- జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, ఏలూరు - న్యూస్టుడే, జంగారెడ్డిగూడెం: ‘బాబాయి చనిపోయినప్పుడు ఏమన్నారు? ‘నారాసుర రక్త చరిత్ర’ అని వార్తలు రాయించారు. తర్వాత సీబీఐ విచారణ కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ అక్కర్లేదన్నారు. జగన్ సోదరి సునీత ఇప్పటికీ తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆమెకున్న ధైర్యం మనకు లేదా? గొడ్డలి పోటునే గుండెపోటుగా చిత్రీకరించిన వారికి సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం ఓ లెక్కా? కల్తీ సారాతో 26 మంది చనిపోతే సహజ మరణాలంటారా? వీరు మనుషులేనా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మరణాలపై విచారణ జరిగి, బాధ్యులకు శిక్ష పడే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని అందరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. తనవి ప్రజా రాజకీయాలని, జగన్ చేసేవే శవ రాజకీయాలని మండిపడ్డారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన చంద్రబాబు.. కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం బుట్టాయిగూడెం రోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్కు చెందిన మృతులు మడిచర్ల అప్పారావు, దేవరశెట్టి చక్రపాణి, బండారు శ్రీనివాసరావు, షేక్ సుబానీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమకు ఆదరువు పోయిందని, కల్తీ సారా వల్లే అయిన వారిని కోల్పోయి రోడ్డునపడ్డామని వారంతా వాపోయారు. న్యాయం చేయాలంటూ వినతిపత్రాలిచ్చారు. తమ ప్రభుత్వం వస్తే అప్పారావు కుమారుడు ప్రకాశ్కు ఉద్యోగమిస్తానని చంద్రబాబు చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపొద్దని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.
ఇక్కడికి రాకుంటే.. పది లక్షలిస్తారా?
చంద్రబాబు సమావేశానికి వెళ్లకుంటే పది లక్షలు ఇస్తామని అధికారులు మృతుల కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ‘తాడోపేడో తేల్చుకోవడానికొచ్చా. చెప్పిన అబద్ధాలను, తిన్న డబ్బులను కక్కిస్తా. ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగి, ఇలా పేదల జీవితాలతో ఆడుకుంటారా? ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారు. సీఎం అయ్యాక రేట్లు పెంచేసి జగన్ బ్రాండ్లు తెచ్చారు. ఇదేమంటే మద్యపానాన్ని నియంత్రించేందుకన్నారు. అయినా తాగేవాళ్లు తగ్గలేదు. నాటుసారా తాగి చనిపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా వ్యాపారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు వాటా ఉంది. వారి ధనదాహానికి మనుషుల ప్రాణాలు పోవాలా? వారు నర హంతకులు’ అని దుయ్యబట్టారు. ‘బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రారా? మీ కుటుంబంలో ఇలాగే జరిగితే ఊరుకుంటారా? ఫుడ్ పాయిజన్ అయిందని, అనారోగ్యంతో మరణించారని అంటున్నారు. వీటితో పురుషులే చనిపోతారా? మహిళలు చనిపోరా?’ అని ప్రశ్నించారు.
‘చిల్లర దుకాణాల్లోనూ అంగీకరించే యూపీఐ పేమెంట్లను మద్యం దుకాణాల్లో ఎందుకు అంగీకరించట్లేదు? బిల్లులెందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే.. జగన్కు వాటాలు వెళ్లాలి. నాసిరకం బ్రాండ్లన్నీ ఇక్కడ ఉంచి.. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాతో మద్యం తెచ్చి వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. సారా వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను హరించి, ఆడవాళ్ల తాళిబొట్లు తెంచే అధికారం మీకెవరిచ్చారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పెంపుడు కుక్కలు తనపై చేసే విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘తెదేపా లేకుంటే ఈ దొంగలు సారా బాధితుల్ని పట్టించుకునేవారా? ఇంకో పది మందిని చంపేసి సహజ మరణాలనేవారు. నేనిక్కడికి దృఢ సంకల్పంతో వచ్చా. కల్తీ సారా పోయేవరకు వదలిపెట్టను’ అని తేల్చి చెప్పారు. ఒకరి చెప్పుచేతల్లో ఉంటూ పనిచేయడానికి మీకు బాధగా లేదా? అని పోలీసులను ప్రశ్నించారు.
రూ.లక్ష చొప్పున పరిహారం
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అనే ప్రైవేటు సంస్థలో ప్రమాదం జరిగి చనిపోతే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వమే చేసిన హత్యలకు ఎంత ఇస్తుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ‘బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.26 లక్షలు తెదేపా తరఫున ఇస్తాం. విరాళాలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు తరఫున చదివిస్తాం. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే మేం వచ్చాక రూ.25 లక్షల చొప్పున ఇస్తాం’ అని మాటిచ్చారు. చంద్రబాబు ప్రకటనకు స్పందించి పలువురు అక్కడే విరాళాలు ఇవ్వగా సుమారు రూ.15 లక్షలు పోగయ్యాయి. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన నలుగురు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించలేదని చంద్రబాబు విమర్శించారు. మృతులు మింటే మధు, జగతా శ్రీను, పేరుబోయిన రామాంజనేయులుతోపాటు మరో కుటుంబానికి రూ.50వేల చొప్పున అందజేశారు.
బీమా, పింఛను తొలగిస్తామన్నారు: వెంకటలక్ష్మి దుర్గ
‘నా భర్త పోశయ్య కల్తీ సారావల్లే చనిపోయారు. కూలికి వెళ్తేనే మాకు పూట గడిచేది. నాకు ఇద్దరు పిల్లలు. వారినెలా పెంచాలో అర్థం కావట్లేదు. గతంలో బ్రాందీ తాగే ఆయన ధరలు పెంచడంతో సారాకు అలవాటుపడ్డారు. ప్రభుత్వం తరఫున మమ్మల్ని పలకరించిన వాళ్లులేరు. మట్టి ఖర్చులు తెదేపానే అందించింది. ఆదివారం రాత్రి మమ్మల్ని బెదిరించారు. సోమవారం తెల్లవారుజామున నాలుగింటి నుంచి ఇంటి దగ్గరే కాపలా కాశారు. ‘చంద్రబాబు నాలుగు మాటలు చెప్పి వెళ్తారు. అంతకుమించి ఏమీ చేయరు. చేయాల్సింది ప్రభుత్వమే. చూసి మాట్లాడండి. లేకుంటే పింఛను రాదు. రేషన్ కట్ చేస్తాం. బీమా రాదు’ అని భయపెడుతున్నారు. మాకు భయంగా ఉంది. రక్షణ కల్పించండి.’
నిజం చెబితే పింఛను తీసేస్తామంటారా?
మనిషి చనిపోయిన బాధలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ‘నిజం చెబితే పింఛను ఆపేస్తాం’ అని ప్రభుత్వం బెదిరించడం సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. ‘సారాయే తమ వాళ్లను చంపేసిందని మహిళలు చెబుతుంటే బాధేసింది. భర్తను కోల్పోయిన మహిళకు, కుమారుడిని కోల్పోయిన తల్లికి, తండ్రిని కోల్పోయిన బిడ్డకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు?’ అని సోమవారం ట్విటర్లో ప్రశ్నించారు.
రూ.100కే రెండు ప్యాకెట్లు: వెంపల లావణ్య
‘అంతకు ముందు బ్రాందీ, విస్కీ తాగే మా ఆయన అనిల్.. రేట్లు పెంచేయడంతో రూ.100కే రెండు ప్యాకెట్లు దొరికే నాటుసారాకు అలవాటుపడ్డారు. కల్తీ సారా తాగి చనిపోతే.. పది రోజులపాటు అన్నం తిననందుకే చనిపోయాడంటూ ఆసుపత్రిలో అబద్ధం చెబుతున్నారు. ఆయనకు అన్నం పెట్టేది నేనే. నాకు తెలీదా ఆయన తిన్నదీ లేనిదీ? ఇప్పుడు మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తప్పుడు నివేదికతో మాకు అన్యాయం చేశారు.’
నాటుసారా వల్లే చనిపోయాడు: పితాని లక్ష్మి
నాటుసారా వల్లే నా కుమారుడు రమణ చనిపోయారు. తండ్రిగా, తోబుట్టువుగా రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్ నా కోడలి తాడు తెంపారు. ఆయన కేసులు రద్దు చేయించుకొని సుఖంగా ఇంట్లో ఉన్నారు. వాళ్ల కుటుంబంలో జరిగితే ఇలాగే ఉంటారా? 28, 29 వార్డుల్లోని నాయకులు ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఇంటికొచ్చి బెదిరించారు. మా కోడలిని ఉదయం ఏలూరు తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.