Air India: ఆంగ్లేయ అడ్డుపుల్లలు.. ఐనా ఎగిరిన టాటా!
భారత్ను అన్నింటా అణగదొక్కాలని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం 1932లోనే టాటాలను ఎలా ఎగరనిచ్చింది? నిజానికి అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ఆంగ్లేయుల ఎన్నో అడ్డుపుల్లల్ని ఛేదించుకుంటూ... పట్టుబట్టి మరీ టాటాలు ఎయిర్లైన్స్కు అనుమతి పొందారు. ఆంగ్లేయులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
భారత్ను అన్నింటా అణగదొక్కాలని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం 1932లోనే టాటాలను ఎలా ఎగరనిచ్చింది? నిజానికి అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ఆంగ్లేయుల ఎన్నో అడ్డుపుల్లల్ని ఛేదించుకుంటూ... పట్టుబట్టి మరీ టాటాలు ఎయిర్లైన్స్కు అనుమతి పొందారు. ఆంగ్లేయులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.
భారత్లో గగనయానం తొలిసారిగా 1911లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఫ్రెంచ్ పైలెట్ హెన్రీ పీక్యూ ఇనుప వైర్లు కట్టిన చెక్క ఫ్రేమ్తో కూడిన హంబర్ బైప్లేన్ను అలహాబాద్లోని పోలో గ్రౌండ్ నుంచి నైని జంక్షన్ దాకా ఎగిరించారు. 6500 ఉత్తరాలను ఈ విమానం మోసుకొని వచ్చింది. 10 కిలోమీటర్ల ఈ దూరాన్ని చేరటానికి 13 నిమిషాలు పట్టింది.
ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఇలా ఉత్తరాల విమానాలు అడపాదడపా నడిచాయి. 1929లో బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఇంపీరియల్ ఎయిర్వేస్ భారత్కు సేవలను మొదలెట్టింది. లండన్ నుంచి కరాచీకి తొలి విమానం 20 చోట్ల ఆగుతూ 6-7 రోజుల్లో చేరుకుంది.
అదే ఏడాది... భారత తొలి ఫ్లయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా-బర్మా ఆరంభమైంది. ఈ క్లబ్ ద్వారా... టాటా యువ వారసుడు జేఆర్డీ టాటా పైలెట్ లైసెన్స్ పొందారు. విదేశాల్లో విమాన పోటీల్లో పాల్గొని ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆయనకు బ్రిటిష్ విమానయాన నిపుణుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున యుద్ధ విమానాలు నడిపిన నెవిల్ విన్సెంట్ పరిచయమయ్యారు. భారత్లో విమానయానానికి మంచి భవిష్యత్ ఉందని ఊహించిన విన్సెంట్ తొలుత భారత్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ హోమీ మెహతాను కలిశారు. కానీ ఆయన తిరస్కరించారు. దీంతో... టాటాలను సంప్రదించారు. యువకుడే కాకుండా పైలెట్ లైసెన్స్తో ఉరకలెత్తుతున్న జేఆర్డీ తమ సంస్థ ఛైర్మన్ సర్ దొరాబ్జి టాటా వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లారు. తొలుత అంతగా ఆసక్తి చూపని ఆయన... చివరకు విన్సెంట్ మాటలకు అంగీకరించారు. రూ.2లక్షల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.
వెంటనే దేశంలో ఎయిర్లైన్స్ ఆరంభించటానికి అనుమతులు కోరుతూ టాటాలు బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ తమ ఇంపీరియల్ ఎయిర్లైన్స్ సేవల్నే విస్తరించాలనుకున్న ఆంగ్లేయులు అనుమతులివ్వకుండా నాన్చసాగారు. మూడేళ్లపాటు కొర్రీలు పెడుతూ వచ్చారు. విన్సెంట్ మళ్ళీ రంగంలోకి దిగారు. బ్రిటిష్ బ్యూరోక్రసీని దాటి... ఏకంగా వైస్రాయ్తో తేల్చుకోవటానికి సిద్ధపడ్డారు. సిమ్లా విడిదిలో ఉన్న లార్డ్ విలింగ్టన్ దగ్గరకు స్వయంగా వెళ్లారు. దొరాబ్జిని ఒప్పించినట్లే... వైస్రాయ్నూ ఒప్పించారు. 1932 ఏప్రిల్ 24న పదేళ్ల ఒప్పందంతో అనుమతులు లభించాయి. టాటా ఎయిర్మెయిల్ ఆవిర్భవించింది. 1932 అక్టోబరు 15న కరాచీ నుంచి ముంబయికి తొలి టాటా విమానం గాల్లోకి ఎగిరింది. దాని సగటు వేగం గంటకు 80 కి.మీ. జేఆర్డీ టాటా తానే స్వయంగా పైలెట్గా వ్యవహరించారు. ఆ కాలంలో కరాచీ నుంచి ముంబయికి రైల్లో 45 గంటల సమయం పట్టేది. టాటా విమానం 8గంటల్లోపే చేరుకుంది. అహ్మదాబాద్లో ఆగినప్పుడు బర్మా షెల్ పెట్రోల్ డబ్బాలను ఎద్దుల బండిపై రన్వే వద్దకు తీసుకొచ్చి విమానంలోకి నింపారు. తర్వాత ముంబయి నుంచి బళ్లారి మీదుగా మద్రాసుకు బయల్దేరింది. అలా... వారానికోసారి కరాచీ నుంచి మద్రాసుకు టాటా ఎయిర్ మెయిల్ కొనసాగింది.
అలా తొలుత ఉత్తరాలకు పరిమితమైన విమానంలో తర్వాత ప్రయాణికులను కూడా కూర్చోబెట్టడం మొదలెట్టారు. ఉత్తరాల బ్యాగులపైనే కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చేది. రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1939లో భారత్లో పౌరవిమానాలను రద్దు చేశారు. వీటన్నింటినీ బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యుద్ధ అవసరాలకు వాడుకుంది. ఈ సమయంలోనే భారత్లో ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఆరంభించాలని టాటాలు యోచించారు. విన్సెంట్ మళ్లీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ యుద్ధసమయంలో (1942) ఆయన ప్రయాణిస్తున్న బాంబర్ విమానం మార్గమధ్యలోనే మాయమైంది. ఫ్రాన్స్ సమీపంలో విన్సెంట్ విమానాన్ని కూల్చేశారని తర్వాత తేలింది. టాటాలు తమ ప్రియ మిత్రుడికి బరువైన గుండెలతో వీడ్కోలు పలికి... ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లటంలో మునిగిపోయారు. భారత కీర్తి పతాకను గగనంలో ఎగరేశారు.
శభాష్ టాటా
విన్సెంట్ నైపుణ్యం... టాటాల క్రమశిక్షణ కారణంగా... తొలి ఏడాదిలోనే సమయపాలనలో నూటికి నూరుశాతం విజయం సాధించటం టాటా ఎయిర్మెయిల్ ఘనత. ‘‘ఎయిర్మెయిల్ సర్వీస్ను ఎలా నడపాలనే దానికి టాటాలు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్రిటిష్ ఇంపీరియల్ ఎయిర్వేస్ సిబ్బందిని టాటాల వద్దకు కొద్దికాలం పంపించి శిక్షణ ఇప్పించాలి’’ అని 1933-34లో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన నివేదికలో కితాబిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం