AP news: ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కలకలం
అది బాగా పేరొందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి... గురువారం దాని సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రశాంతంగా ఉండే ఆ ఆసుపత్రి ప్రాంగణంలోకి ఒక్కసారిగా పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించి, కార్యాలయంలో సోదాలు చేసి..
నలుగురు ఉద్యోగుల అరెస్టు
సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకే...
డైరెక్టర్ డాక్టర్ బుచ్చయ్య ఆరోపణ
ఈనాడు- అమరావతి, మంగళగిరి-న్యూస్టుడే: అది బాగా పేరొందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి... గురువారం దాని సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రశాంతంగా ఉండే ఆ ఆసుపత్రి ప్రాంగణంలోకి ఒక్కసారిగా పదుల సంఖ్యలో పోలీసులు ప్రవేశించి, కార్యాలయంలో సోదాలు చేసి.. పలువురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవటంతో కలకలం రేగింది. తనిఖీలు ఎందుకో, అదుపులోకి ఎందుకు తీసుకుంటున్నారో కూడా చెప్పకపోవడంతో అక్కడున్న అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని వద్ద ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రి (ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆసుపత్రిని అమ్మేయాలంటూ భయభ్రాంతులకు గురిచేసేందుకే సిబ్బందిని అదుపులోకి తీసుకోవటం, సోదాలు, రికార్డుల స్వాధీనం వంటివి చేసుకున్నారని, గురువారం సర్వసభ్య సమావేశం నేపథ్యంలో డైరెక్టర్లను భయపెట్టేందుకే.. బుధవారం ఈ చర్యలు చేపట్టారని ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బుచ్చయ్య మీడియాకు వెల్లడించటంతో తాజా ఘటన చర్చనీయాంశమైంది. ‘అమ్మకానికి అంగీకరిస్తూ సంతకం పెడతారా? చస్తారా? అని బెదిరించి సంతకాలు చేసి వెళ్లిపోమంటే మాకు తప్పదు కదా!’ అంటూ ఆయన వ్యాఖ్యానించటం సంచలనమైంది.
స్పష్టతివ్వని పోలీసులు...
ఈ అకాడమీ నిధుల్ని కొందరు పక్కదారి పట్టించారని, వారి వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వినియోగించారన్న ఫిర్యాదుపై ఈ ఏడాది మార్చి 3న మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా... కొవిడ్ రోగుల నుంచి అధిక రుసుములు వసూలు చేశారనే ఫిర్యాదులపై విచారణలో భాగంగా వారిని పోలీసుస్టేషన్కు తరలించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేదు. స్పష్టత కోసం ఉన్నతాధికారుల్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా వారెవరూ అందుబాటులోకి రాలేదు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి క్యాషియర్ నాగేశ్వరరావు, అకౌంటెంట్ శ్రీనివాసరాజు, చీఫ్ కో-ఆర్డినేటర్ ఆఫీసర్ చికాగో శ్రీనివాస్, వల్లూరుపల్లి నళీనిమోహన్లను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అక్కడ వారిని డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో విచారించారు. ఆకాడమీలో పనిచేస్తున్న యుగంధర్, కామేశ్వరరావు అనే ఉద్యోగుల్ని పోలీసుస్టేషన్కు తరలించినా.. వారిని విచారించలేదు. అదుపులో ఉన్నవారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.
గతంలో నమోదైన కేసు ఇది
ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, కోశాధికారి డాక్టర్ అక్కినేని మణి, సీసీవో ఉప్పలాపు శ్రీనివాసరావు, సీఎఫ్వో వల్లూరిపల్లి నళినీమోహన్ నేరచర్యల్లో భాగస్వాములయ్యారని.. సొసైటీ నిధులను వారి వ్యక్తిగత అవసరాల కోసం దారి మళ్లించారని, తద్వారా రూ.5.28 కోట్ల మేర నష్టం వాటిల్లిదంటూ ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి నలుగురిపై ఈ ఏడాది మార్చి 3న ఐపీసీ 420, 406, 120బీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్లో క్రైమ్ నెంబర్ 89/2016 నమోదైంది.
భయభ్రాంతులకు గురిచేసేందుకే: డా. బుచ్చయ్య
ఎన్ఆర్ఐ ఆస్పత్రి విక్రయానికి సంస్థ సభ్యుల్లోని కొందరు చేస్తున్న ప్రయత్నాన్ని తనతో సహా మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని, అందుకే తమను భయపెట్టేందుకు కొందరు సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్లలో ఒకరైన డాక్టర్ బుచ్చయ్య ఆరోపించారు. గురువారం సర్వసభ్య సమావేశం ఉందని, తమను భయపెట్టి.. దాన్ని అడ్డుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారని ధ్వజమెత్తారు. ‘మా సంస్థలో 30 మంది సభ్యులున్నారు. వారిలో 20 మంది ఆస్పత్రి విక్రయ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు’ అని ఆయన బుధవారం మంగళగిరి పోలీసుస్టేషన్ వద్ద విలేకర్లతో వ్యాఖ్యానించారు. ‘మెజార్టీ సభ్యులం ఆసుపత్రి అమ్మకానికి సుముఖంగా లేం. కానీ విక్రయానికి ఆమోదం తెలుపుతారా? లేదా? అని బెదిరిస్తే ఏం చేస్తాం? సంతకాలు చేసి వెళ్లిపోమంటే అలాగే వెళ్లిపోతాం. తప్పదు కదా...! ఈరోజు యుద్ధం చేసే పరిస్థితి లేదు. ప్రజలే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఆసుపత్రిని రూ.650 కోట్లకు అమ్మేశారట కదా..! అమ్మేస్తున్నారట కదా..! అంటూ నాకు రోజూ చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. అప్పారావు ఆసుపత్రిని అమ్మేశారని.. సంతకాలు కూడా అయిపోయాయని.. టేకోవర్ చేయడానికి కొత్త యాజమాన్యం వచ్చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అది అసాధ్యం. మెజార్టీ సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మాకు తెలియకుండా, మా ఆమోదం లేకుండా ఎలా అమ్మేస్తారు? పదిమంది సభ్యులు అమ్మేస్తామంటే అయిపోతుందా? అందుకే ఇప్పుడు వారు కొత్త ఎత్తుగడ వేశారు. సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు’ అన్నారు. ‘రూ.650 కోట్లకు ఆసుపత్రిని కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధపడుతున్నారంటే అతను ఎలాంటి సేవలందిస్తారో అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం మేము ఈ ఆసుపత్రిని పెట్టలేదు. డబ్బులే కావాలనుకుంటే 2003లో మేము స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెడితే.. అందుకు 30 రెట్లు అధికంగా డబ్బు వచ్చేది. మేము ఆసుపత్రిని అమ్మదలుచుకోలేదు. మాకెవరికీ డబ్బు ఇబ్బంది లేదు. భయపెట్టి.. అరెస్టులు చేస్తామనే పరిస్థితి దారుణం. ఇది అన్యాయం. ఆసుపత్రిని కొంటామని మా బృందంలోని 20 మంది సభ్యుల్ని ఎవరూ సంప్రదించలేదు. రేపు సర్వసభ్య సమావేశం వర్చువల్గా ఉంది. దాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ఎన్ఆర్ఐ ఆసుపత్రి నిధుల్ని కొందరు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారని మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. అయితే నాకు అందిన సమాచారం సరికాదని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని పోలీసుల్ని కోరాను. తమపై ఒత్తిళ్లు ఉన్నాయని.. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలని వారు చెప్పారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘నేను పెట్టిన కేసు విషయంలో ఎవరినైనా అరెస్టు చేయాలంటే నెలరోజుల ముందే నోటీసు ఇవ్వాలని న్యాయస్థానం పోలీసులకు చెప్పింది. అయినా వారు పట్టించుకోలేదు’ అని డాక్టర్ బుచ్చయ్య వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం