తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చట్ట సవరణ
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్ణయం తీసుకున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిర్ణయం తీసుకున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరింది. ఈ వాదనపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్చంద్ర, బాలాజీ వడేరా అభ్యంతరం తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి ఇప్పటికే జీవోలిచ్చి ఇప్పుడు చట్ట సవరణ చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. దేవాదాయ చట్టంలో ‘ప్రత్యేక ఆహ్వానితుల’ ప్రస్తావనే లేదని తెలిపారు. ఇప్పటికే తితిదే బోర్డు సభ్యులుగా 29 మంది ఉన్నారని, సవరణ చేయడం చట్ట విరుద్ధమేనని అన్నారు. మరోవైపు గతంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో తనపై ప్రభావం పడినందున తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్ను కోర్టు అంగీకరించింది. నాలుగో ప్రతివాదిగా చేర్చింది. స్టే ఎత్తివేయాలన్న ఎమ్మెల్యే అనుబంధ పిటిషన్పై కౌంటర్లు వేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యంలోనూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, తితిదేను ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశించింది. తితిదేకు 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోలను నిలిపివేస్తూ గత సెప్టెంబరు 22న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. నచ్చిన వాళ్లను ఆహ్వానితులుగా నియమించుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర వాదించారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని తితిదే తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ కోరారు. న్యాయవాది ఉమేశ్చంద్ర వాదనలు కొనసాగిస్తుండటంతో ధర్మాసనం స్పందిస్తూ.. కౌంటర్ వేసేందుకు సమయం కోరినప్పుడు వాదనలు ఎందుకని ప్రశ్నించింది. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!