వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది.
అనంతపురం రేంజి డీఐజీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం
మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలే చట్టమన్నట్లు అమ్మిరెడ్డి విధులు
ఈనాడు-అమరావతి, చిత్తూరు, ఈనాడు డిజిటల్-అనంతపురం: వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. అనంతపురం రేంజి డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిపై విచారించిన ఎన్నికల సంఘం చివరకు ఆయన్ను బదిలీ చేసింది. ఆయన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలుగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లతో సోమవారం రాత్రి 8 గంటల్లోగా ప్యానల్ జాబితాను సమర్పించాలని సీఎస్ జవహర్రెడ్డిని ఆదేశించింది.
వైకాపా నేతలకు జీహుజూర్
అమ్మిరెడ్డి 2023 ఏప్రిల్ 13న అనంతపురం రేంజి డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. వైకాపా నేతలు చెప్పారంటే చాలు.. జీహుజూర్ అంటారన్న విమర్శలున్నాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులిచ్చి పరోక్షంగా సహకరించారు. అనంతపురం సబ్డివిజన్ పరిధిలో సొంత సామాజికవర్గానికి చెందిన సీఐలను నియమించి వైకాపా నాయకులకు అండదండలు అందించారు. డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు. పైగా మరింత ప్రోత్సహించారు. వైకాపా విధేయుడిగా పేరున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావడంలో అమ్మిరెడ్డిదే కీలకపాత్రనే విమర్శలున్నాయి. వీరరాఘవరెడ్డి ఏకపక్ష ధోరణిపై తెదేపా పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం గ్రామీణ సర్కిల్, ఇటుకలపల్లి సర్కిల్ పోలీసులు తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్కు ముందే అనంతపురం గ్రామీణం, ఇటుకలపల్లి సీఐలను బదిలీ చేయాలని ఫిర్యాదులొచ్చినా వారిని ఆ స్థానాల్లోనే కొనసాగించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరవడం వంటివి డీఐజీ పర్యవేక్షణలోనే సాగాయనే విమర్శలున్నాయి.
అంగళ్లు ఘటనలో వైకాపాకు వత్తాసు..
గతేడాది ఆగస్టులో అంగళ్లు వద్ద మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లదాడి సంఘటనలో అధికార పార్టీని సమర్థిస్తూ.. ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఆ సంఘటనలో చంద్రబాబుతోపాటు మరికొందరు తెదేపా నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గనిర్దేశంలో డీఐజీ చేశారని ఆరోపణలొచ్చాయి. అప్పట్లో ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’లో భాగంగా పుంగనూరు మీదుగా చంద్రబాబు పర్యటించేందుకు పోలీసులు అనుమతించలేదు. చంద్రబాబును పుంగనూరు మీదుగా తీసుకెళ్లాలని తెదేపా శ్రేణులు పట్టుదలగా భీమగానిపల్లె కూడలి వద్ద ఉన్నాయి. ఆయన్ను పుంగనూరుకు రానివ్వకూడదని పోలీసులు భీష్మించుకు కూర్చున్నారు. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. రాళ్లు రువ్వారు. గాల్లోకి కాల్పులు జరిపారు. తెదేపా కార్యకర్తలు సైతం ప్రతిస్పందించారు. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం శ్రేణులకు గాయాలయ్యాయి. ఈ ఒక్క సంఘటనపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. దాదాపు 600 మందిని నిందితులుగా చూపారు. 300 మందికిపైగా అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలు, కడప కేంద్ర కారాగారానికి పంపారు. సంఘటన జరిగిననాడు అక్కడ లేనివారినీ అరెస్టు చేశారు. వైకాపా నాయకులు చెప్పినట్టు పుంగనూరు పోలీసులు వినాలని డీఐజీ అప్పట్లో ఆదేశించారనే ఆరోపణలున్నాయి.
మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే విధులు
డీఐజీగా అమ్మిరెడ్డి బాధ్యతలు చేపట్టాక పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీవారు పేట్రేగిపోయారు. తెదేపా శ్రేణులపై దాడులు చేయడం, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసే విషసంస్కృతిని తెచ్చారు. అరాచకాలపై డీఐజీగా చర్యలు తీసుకోవాల్సిన అమ్మిరెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశారు. శాంతిభద్రతలు అదుపు తప్పినా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో రైతుభేరి నిర్వహించాలని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ పలుమార్లు నిర్ణయించారు. అనుమతించాలని హైకోర్టు సైతం ఆదేశించినా డీఐజీ హోదాలో ఆయన స్పందించలేదు. ఈ ఏడాది జనవరి 12న పుంగనూరు మండలం చదళ్ల వద్ద ‘ధర్మపోరాట సభ’ నిర్వహించేందుకు రామచంద్రయాదవ్ అనుచరులు ఏర్పాట్లు చేస్తుండగా అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలను వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. గంగవరం సీఐ కృష్ణమోహన్ ఒక కార్యకర్తను చెప్పుతో కొట్టారు. దీనిపై డీఐజీకి ఫిర్యాదు చేసినా సదరు సీఐపై చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా డీఐజీ అమ్మిరెడ్డి స్వామి భక్తిని వీడలేదు. గత నెలలో సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించినపుడు నిబంధనలు పక్కనపెట్టి సీఎం కాన్వాయ్ ముందు నడుస్తూ భద్రత పర్యవేక్షించారు. అలాగే ఇటీవల సీఎం జగన్ తాడిపత్రి పర్యటనకు వచ్చినప్పుడు అనంతపురంనుంచి తాడిపత్రి వరకు మంత్రి పెద్దిరెడ్డి వెంట వెళ్లారు.
పెద్దిరెడ్డి స్వగ్రామంలో సంఘటనపైనే వేటు!
మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో ఏప్రిల్ 29న రామచంద్ర యాదవ్, ఆయన అనుచరులు ప్రచారానికి వెళ్లారు. మంత్రి ఊళ్లో ఎలా ప్రచారం చేస్తారని వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ప్రచార వాహనాలపై దాడి చేశారు. అక్కడున్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నియంత్రించేందుకు ప్రయత్నించలేదు. అక్కడినుంచి తప్పించుకుని కొంతదూరంలోని గొడ్లవారిపల్లెకు రాగా అక్కడా వైకాపా శ్రేణులు విధ్వంసానికి దిగాయి.
ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీసుస్టేషన్కు వెళ్లగా దాదాపు 200 మంది వైకాపా కార్యకర్తలు స్టేషన్ బయట, ఆవరణలో మోహరించారు. ‘వాడిని మాకు వదిలేయండి.. బుద్ధి చెబుతాం’ అంటూ హెచ్చరించారు. స్టేషన్ ఎదుటే ఉన్న ప్రచార రథానికి నిప్పుపెట్టారు. మరుసటి రోజు డీఐజీ అమ్మిరెడ్డి సదుం పోలీసుస్టేషన్, యర్రాతివారిపల్లెలకు వచ్చి పరిశీలించి వెళ్లారు. బాధ్యులైన వైకాపా నాయకులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మిరెడ్డి, పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రామచంద్రయాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అమ్మిరెడ్డిపై వేటు పడటానికి ప్రధాన కారణం సదుం మండలంలో జరిగిన సంఘటనేనని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు