ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
సాగునీటి ప్రాజెక్టుకు రూ.460 కోట్లు ఇచ్చినట్లు హడావుడి
మూడేళ్లయినా కాగితాలకే పరిమితం
ఈనాడు, అమరావతి: సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్ అధికారంలోకి వచ్చాక నారాయణమూర్తి ఆయన్ను కలిశారు. ఆ ప్రాజెక్టు సాధించడం తన చిరకాల స్వప్నమని వివరించారు. ఆ ప్రాజెక్టుని జగన్ మంజూరు చేశారు. అంతటి ముఖ్యమంత్రే మంజూరు చేశాక ఇంకేముంది.. త్వరలోనే ప్రాజెక్టు పూర్తయిపోతుందనుకున్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కారు. జగన్ దేవుడని, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొనియాడారు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటికీ కాగితాలపైనే ఉంది.
ప్రాజెక్టు సాకారమైతే వేల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువల్ని అనుసంధానిస్తే కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. రెండు జిల్లాల్లోని మెట్టప్రాంతాలైన ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, నాతవరం, కోటఉరట్ల, నర్సీపట్నం మండలాల్లోని వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. తాండవ నదిపై 4.96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గతంలో జలాశయం నిర్మించారు. దాన్నుంచి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని 51,465 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో తాండవ నదిలోకి చాలినంత నీరు రాకపోవడం వల్ల సాగుకి ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఏలేరు జలాశయం కాలువలను, తాండవ కాలువలను అనుసంధానించి నీటిని వినియోగించుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్న ప్రతిపాదనను అధికారులు రూపొందించారు. ఏలేరు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 24.1 టీఎంసీలు. ఏలేరు జలాశయానికి కూడా నీటి లభ్యత తగ్గడంతో.. దానికి పరిష్కారంగా తెదేపా ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుని నిర్మించింది. పోలవరం ఎడమ కాలువలోకి నీటిని మళ్లించి, ఆ కాలువపై మరో ఎత్తిపోతల స్కీం ఏర్పాటు చేసి.. గోదావరి జలాల్ని ఏలేరు జలాశయంలోకి పంపే ఏర్పాటు చేసింది. దాంతో ఏలేరు జలాశయానికి నీటి సమస్య తీరింది. గోదావరి నుంచి ఏలేరు జలాశయంలోకి తగినంత నీరు ఎత్తిపోసుకునే వెలుసుబాటు ఉండటంతో.. ఏలేరు కాలువల్ని, తాండవ కాలువలతో అనుసంధానిస్తే.. అక్కడ కూడా నీటి సమస్య తీరుతుందని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాలువల్ని ఆధునికీకరించడంతో పాటు, మరో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి తాండవ ఆయకట్టు కాలువల్లోకి 250 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలన్నది ఆలోచన.
మూడేళ్లయినా ముందుకి కదల్లేదు
2021లో ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసింది. 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులిచ్చింది. టెండర్లు పిలిచి.. గుత్తేదారుడినీ ఎంపిక చేశారు. ఆ తర్వాత దానికీ రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల గతే పట్టింది. ప్రాజెక్టు మంజూరు చేసి మూడేళ్లవుతున్నా.. అంగుళం కూడా ముందుకి కదల్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు