ఉచిత హామీలు ఆందోళనకరమే!
ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలూ పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన సమస్యే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది.
వాగ్దానాల బడ్జెట్ అసలు బడ్జెట్ను మించిపోతోంది
ఈ అంశంలో పార్టీలను నియంత్రించడం ఎలా?
కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలూ పోటీపడుతూ ఉచిత హామీలు ఇస్తున్నాయి. నిస్సందేహంగా ఇది తీవ్రమైన సమస్యే. అయితే, దీనిని నియంత్రించడం ఎలా? ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంలో న్యాయస్థానం పరిధి పరిమితమే. కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
- జస్టిస్ ఎన్.వి.రమణ
దిల్లీ: ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలుచేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అటువంటి రాజకీయ పక్షాల ఎన్నికల గుర్తును నిలిపివేయాలని, ఆ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ధర్మాసనంలో జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీ సభ్యులుగా ఉన్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్ను మించిపోతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పు తర్వాత ఉచిత హామీల అంశంపై ఎన్నికల సంఘం ఒకే ఒక సమావేశం నిర్వహించిందని, మార్గదర్శకాలు రూపొందించినా వాటిలో పస లేదని పిటిషనర్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ‘అధికారాన్ని నిలుపుకొనేందుకు ఎన్నికల ముందు ప్రజాధనంతో అనుచిత ఉచిత హామీలను అమలుచేసేందుకు యత్నించే పార్టీల గుర్తింపును రద్దు చేయడం, లేదా ఎన్నికల గుర్తులను నిలిపివేయడం, అవసరమైతే ఈ రెండు చర్యలు కలిపి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘కొంత సమయం వేచి చూద్దాం. ప్రస్తుతం ఈ పిటిషన్పై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తున్నాం’ అని తెలిపింది. ఎన్నికల్లో పోటీపడి హామీలిస్తున్న రాజకీయ పార్టీలను కూడా ఈ వ్యాజ్యంలో కక్షిదారులుగా చేర్చాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పార్టీలు నిర్హేతుక ఉచిత హామీలను ఇస్తున్నప్పుడు అఫిడవిట్లో కొన్ని పార్టీలు, కొన్ని రాష్ట్రాల పేర్లను మాత్రమే ప్రస్తావించడంపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే, పిటిషనర్ లేవనెత్తాలనుకున్న విషయం తీవ్రమైనది కాబట్టి కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పిటిషన్లో ఏముంది?
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వేర్వేరు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ భాజపా నేత, న్యాయవాది అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ...18ఏళ్ల వయసు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామంటే.. ప్రతి మహిళకు రూ.2వేలు ఇవ్వనున్నట్లు శిరోమణి అకాలీదళ్ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో గృహిణికి నెలకు రూ.2 వేలు, ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కళాశాలకు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.20 వేలు, 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కోసం ప్రత్యేకంగా.. 12వ తరగతి చదివే అమ్మాయిలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిందని వివరించారు. డబ్బు పంపిణీ, ఉచిత వాగ్దానాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని పిటిషనర్ ఆందోళనవ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత, నిర్హేతుక వాగ్దానాలు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన అని, మితిమీరిన ప్రభావానికి గురి చేయడమేనంటూ ప్రకటించాలని అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కోరారు. ఒక్కో పౌరుడిపై సుమారు రూ.3 లక్షలు రుణ భారం ఉన్నరాష్ట్రాలూ ఉన్నాయని.. అయినప్పటికీ.. ఇంకా ఉచితాలను అందిస్తున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా