CM Jagan: మాకు.. వాళ్లకు తేడా మీరే చెప్పాలి
దేశ చరిత్రలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఇంత మంచి చేస్తున్న.. ఇంతటి అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వానికి.. గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించాలి’ అని సీఎం జగన్ కోరారు.
మంచి చేశామని చెప్పే ధైర్యం బాబుకు.. దత్తపుత్రుడికి లేదు
35 నెలల్లో బటన్ నొక్కి.. రూ.లక్షా 40 వేల కోట్లు ప్రజలకిచ్చా
మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం
ఈనాడు-కాకినాడ, న్యూస్టుడే-ముమ్మిడివరం, ఐ.పోలవరం : ‘ప్రజల సంక్షేమానికి 32 పథకాలు ప్రవేశపెట్టాం. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లో అన్నివర్గాల పేదలకూ రూ.1.40 లక్షల కోట్లు ఖాతాల్లో వేశాం.
దేశ చరిత్రలో ఇలాంటి సాయం ఎప్పుడూ అందలేదు. ఇంత మంచి చేస్తున్న.. ఇంతటి అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వానికి.. గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించాలి’ అని సీఎం జగన్ కోరారు. ఇంతటి మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు, ఇంతటి మంచి చంద్రబాబు చేశారని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదని విమర్శించారు. ఇలాంటి వక్రబుద్ధి ఉన్న వారి నుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలన్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురముళ్లలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.108.75 కోట్లు మీట నొక్కి ఖాతాల్లోకి వేశారు. కోనసీమలో ఓఎన్జీసీ పైపులైను పనులతో జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల్లో 678 బోట్లకు సంబంధించిన 23,458 కుటుంబాలకు నాలుగు నెలల పరిహారం రూ.107.9 కోట్లు ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
సత్యలింగ నాయకర్ స్ఫూర్తితో...
‘చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.104 కోట్లు భృతి కింద ఇస్తే.. ఈ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం కింద రూ.419 కోట్లు నేరుగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చింది. 180 ఏళ్ల కిందట పుట్టిన మల్లాడి సత్యలింగ నాయకర్ అనే మహానుభావుడు ట్రస్టు పెట్టి.. తన యావదాస్తిని ఈ ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశంతో దానధర్మాలు చేశారు. మల్లాడి దాతృత్వంతో 110 ఏళ్లుగా వేల మంది పేదలకు మేలు కలుగుతోంది. అలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మత్స్యకారులకే కాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని ప్రతి పేదవాడికీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పేదవాళ్లందరినీ నా వాళ్లుగానే భావిస్తున్నాను.
95 శాతం వాగ్దానాలు పూర్తి
మత్స్యకారుల వలసల నిరోధానికి రూ.4 వేల కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 మేజర్ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. వీటిలో నాలుగింటి నిర్మాణం ప్రారంభం కాగా.. మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయి. మత్స్య ఉత్పత్తులకు మంచి ధర రావాలని ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులో తెచ్చేందుకు.. దేశీయ వినియోగం పెంచేందుకు రూ.333 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్లు, వాటికి అనుసంధానంగా 14 వేల రిటైల్ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం. దీంతో 80వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దక్కుతుంది. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు 95 శాతం పూర్తిచేశాం. ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత మాకే ఉంది. మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి.. మీరు గెలిపించిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలను మీ ఇంటికి, మీ గడప గడపకు పంపుతున్నాను.
మీరెక్కడైనా చూశారా?
కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలపై శిక్షణ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? మంత్రిగా పనిచేసి.. మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు. రెండుచోట్లా పోటీచేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు. ప్రజల్ని కాక ఇలాంటి వారిని నమ్ముకుంటున్న చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా..? 27 ఏళ్లుగా పెద్దమనిషి చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన రాలేదు. మూడేళ్ల మా పాలన చూశారో లేదో.. ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్కుమార్, కొండేటి చిట్టిబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రాపాక వరప్రసాద్, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం