‘గడప గడప’లో వాగ్వాదాలు
రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ నిరసనలు, నిలదీతలు, వాగ్వాదాల మధ్య కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను గురువారం ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో
పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేల నిలదీత
న్యూస్టుడే-యంత్రాంగం: రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ నిరసనలు, నిలదీతలు, వాగ్వాదాల మధ్య కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను గురువారం ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన విదేశీ విద్య పథకాన్ని మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆపేశారంటూ విజయవాడ పాతబస్తీలోని కుమ్మరివీధిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఓ యువకుడు, ఆమె తల్లి నిలదీశారు.
ఆ వార్డులు తెదేపావి... వెళ్లొద్దు!
అనకాపల్లి జిల్లా వైకాపా అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కన్నంపేటలో 3, 4 వార్డుల్లో పర్యటించడానికి వెళుతుండగా... ‘ఆ వార్డులు తెదేపావి. అక్కడికి వెళ్తే కావాలనే రచ్చ చేస్తార’ని స్థానిక వైస్ ఎంపీపీ దంట్ల వెంకటరమణ ఎమ్మెల్యే ధర్మశ్రీతో చెప్పి మరో వార్డులోకి తీసుకెళ్లారు. స్థానికులు... తప్పని పరిస్థితిలో సచివాలయం వద్దకు వెళ్లి ఆయనకు సమస్యలను విన్నవించారు. నల్లబెల్లం విక్రయాలపై ఆంక్షలు విధించడాన్ని రైతులు నిలదీశారు.
తాగునీటి బోరును వైకాపా నేత వాడటంపై నిరసన
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఉడమలకుర్తి పంచాయతీ పరిధిలోని చిన్నపల్లి గ్రామస్థులు తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే డాక్టరు పీవీ సిద్ధారెడ్డిని నిలదీశారు. ఓ వైకాపా నాయకుడు ప్రభుత్వ బోరును ఆక్రమించుకొని పంటలకు వాడుకొంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాటేంటి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామస్థులు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రశ్నించారు. పోలీసులు వారిస్తున్నా... సంకమ్మ చెరువు కాలనీకి చెందిన మహిళలు మంత్రి పర్యటనను అడ్డుకున్నారు. దశాబ్దకాలంగా కాలనీకి రహదారి లేదని వాపోయారు. మంత్రి స్వయంగా సమస్యను పరిశీలించి, పది రోజుల్లో రోడ్డు ఏర్పాటు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎస్సీల పథకాలు రద్దు చేస్తే ఏం చేస్తున్నారు?
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరుతపూడిలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు కొందరు ఎస్సీ యువకులు, మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను సీఎం జగన్మోహన్రెడ్డి రద్దు చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పథకాల జాబితాను ఎమ్మెల్యేకు అందజేశారు.
* ‘ఇంటింటింటికి వస్తామన్నారు.. కొన్ని వీధుల్లోకి రావడం లేదు.. అంటే అక్కడ సమస్యలు మీకు పట్టవా’ అంటూ తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం కాట్రపల్లిలో ఎస్సీకాలనీ మహిళలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని నిలదీశారు.
* ‘ ‘తన అనారోగ్య సమస్యపై సీఎం సహాయనిధికి దరఖాస్తు చేస్తే ఆమోదం పొందడానికి వైకాపా నాయకుడు కె.రవికుమార్ రూ.15 వేలు లంచం తీసుకున్నాడ’ని తెదేపా కార్యకర్త బొద్దపు రమణబాబు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజుకు ఫిర్యాదు చేశారు.
మా ఇంటికి రావొద్దు
జగన్ పాదయాత్రలో నడిచిన ఓ ఉపాధ్యాయుడు... నేడు వైకాపా ఎమ్మెల్యే తన ఇంటికి రావద్దని గేటుకు బోర్డు ఏర్పాటు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో 247వ రోజున ఎలమంచిలి నియోజకవర్గంలో సీపీఎస్పై స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మడుతూరుకు చెందిన ఉపాధ్యాయుడు త్రినాథస్వామి ఆయనతో కలిసి నడిచారు. ఉపాధ్యాయులు జగన్ చేయిపట్టుకుని నడవడంతో ఈ చిత్రాన్ని అప్పట్లో వైకాపా నేతలు తమ ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్... సీపీఎస్పై దాటవేత ధోరణిలో మాట్లాడటంతో త్రినాథస్వామి నిరసనకు దిగారు. రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్ రద్దుపై ఇలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం