ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంస పాలనకు నాంది
ప్రజావేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలో జగన్ విధ్వంస పాలన ప్రారంభమైందంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేసి మూడేళ్లయిన సందర్భంగా అక్కడికి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆ ఘటనకు మూడేళ్లవడంతో నిరసనకు తెదేపా యత్నం
దారులన్నీ మూసేసి.. అడుగడుగునా పోలీసుల నిర్బంధం
తెదేపా నాయకుల తోసివేత.. బలవంతంగా అదుపులోకి
ఈనాడు, ఈనాడు డిజిటల్ - అమరావతి, న్యూస్టుడే- తాడేపల్లి: ప్రజావేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలో జగన్ విధ్వంస పాలన ప్రారంభమైందంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేసి మూడేళ్లయిన సందర్భంగా అక్కడికి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రజావేదిక పక్కనున్న తెదేపా అధినేత చంద్రబాబు నివాసం సమీపంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెదేపా శ్రేణులను పోలీసులు రెండు కిలోమీటర్ల ముందే అడ్డుకున్నారు. ప్రజావేదిక వైపు వెళ్లే మార్గాలన్నీ మూసేశారు. దారిపొడవునా బారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టారు. మీడియానూ అనుమతించలేదు. నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్లేందుకు యత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగు యువత ప్రతినిధుల్ని పోలీసులు తోసేయడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పోలీసులు తెదేపా నాయకుల్ని ఎత్తుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. కొంతమందిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
భారీగా పోలీసుల మోహరింపు
ప్రజావేదిక వద్దకు తెదేపా శ్రేణులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచే భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. విజయవాడ, గుంటూరు, సచివాలయం వైపు నుంచి వచ్చేవారిని అడ్డుకునేందుకు సీతానగరం డెల్టా రెగ్యులేటర్ వద్ద, ఉండవల్లి గుహల సమీపంలోని కొండవీటి వాగు వంతెన వద్ద, ఉండవల్లి ర్యాంప్ చెక్పోస్టు వద్ద ఇలా అన్ని మార్గాల్లోనూ బారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టారు. తెలుగు యువత నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, రవినాయుడు తదితరులు కొండవీటివాగు వంతెన వద్దకు ప్రదర్శనగా చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు వారిని తోసేయడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దశలవారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజావేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్సీలు అశోక్బాబు, మంతెన సత్యనారాయణరాజు, తెదేపా నాయకులు మన్నవ మోహనకృష్ణ, పిల్లి మాణిక్యాలరావు, బుచ్చిరామప్రసాద్ తదితరులు ప్రజావేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. తెలుగు యువత నాయకుడు రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో కొంతమంది మాత్రం నిర్బంధాల్ని దాటుకుని ప్రజావేదిక వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. కరకట్టపై బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని వాహనాల్లో ఎక్కించి తరలించారు.
ఏటా ప్రజావేదిక స్మారక దినం
ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా విధ్వంసక పాలన మొదలైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఇకపై ఈ రోజును ఏటా ప్రజావేదిక స్మారక దినంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకోవటం తగదన్నారు.
కూల్చివేతల ప్రభుత్వమని మూడేళ్ల కిందటే చాటారు: చంద్రబాబు
జగన్రెడ్డి సీఎం కాగానే మొట్టమొదట చేసిన పని ప్రజావేదికను కూల్చివేయడమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు వివరించడానికి రూ.కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారని శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘తన విధ్వంసకర ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వివరించి నేటికి మూడేళ్లు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్, మూడేళ్లలో కట్టింది శూన్యం. జగన్కు కూల్చివేతలు తప్ప నిర్మించడం చేతగాదు. ఏపీలో అభివృద్ధిని, ఆర్థిక స్థాయిని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, దళితుల గూడును, యువత భవితను, ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను ఇలా అన్నింటినీ కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లో కూర్చుని పాలన సాగిస్తూ తన వల్ల ఏమీ కాదని, తనకేమీ రాదని ఆయన తేల్చి చెప్పేశారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
30 మంది తెదేపా నాయకులపై కేసు
పోలీసు నిబంధనలను ఉల్లంఘించి ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేసిన ప్రదేశం వద్దకు వెళుతున్న 30 మంది తెదేపా నాయకులపై తాడేపల్లి స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదయింది. తెదేపా నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, మానికొండ శివప్రసాద్, గొల్లా ప్రభాకర్, మరో 27 మందిని ఉండవల్లి చెక్పోస్టు వద్ద అదుపులోకి తీసుకుని, కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?