నిల్వ లేదు.. ‘నీడా లేదు..!’
వరద పరిస్థితులను పరిశీలించేందుకు ఏలూరు జిల్లాలోని పోలవరం ముంపు మండలం వేలేరుపాడుకు బుధవారం రాత్రి కేంద్ర బృందం వచ్చింది. తహశీల్దార్ కార్యాలయంలో వారు స్థానికులతో మాట్లాడారు.
మూడొంతుల గ్రామాలు గోదావరి ముంపులోనే
తొలి దశ నిర్వాసితుల తరలింపే పూర్తి కాలేదు
రెండో దశపై తానేం చేయలేనంటూ చేతులెత్తేసిన సీఎం
మొన్నటి వరదల అనుభవం భయానకం
పోలవరంలో నీరు నిలబెట్టకముందే బతుకు దుర్భరం
ఈనాడు, అమరావతి
వరద పరిస్థితులను పరిశీలించేందుకు ఏలూరు జిల్లాలోని పోలవరం ముంపు మండలం వేలేరుపాడుకు బుధవారం రాత్రి కేంద్ర బృందం వచ్చింది. తహశీల్దార్ కార్యాలయంలో వారు స్థానికులతో మాట్లాడారు. అక్కడున్న జిల్లా కలెక్టర్ గడ్డాలు, కాళ్లు పట్టుకుని మాకు ఇళ్లు కట్టి ఇచ్చెయ్యండి.. ఊరు వదిలిపోతాం.. ఈ కష్టాలు భరించలేమని ఎర్రబోరు గ్రామవాసులు బతిమిలాడారు. కేంద్ర బృందానికి అలాగే విన్నవించారు. మీ సమస్య ప్రభుత్వానికి విన్నవిస్తామని సర్దిచెప్పి వారు వెళ్లిపోయారు. ఇదీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి.
పోలవరం ప్రాజెక్టుకు భూములు, ఊళ్లను త్యాగం చేసిన వేలాది నిర్వాసితులు ఉసూరుమంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవానికి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా గోదావరికి ముంచెత్తిన భారీ వరదలు తేల్చేశాయి. ప్రాజెక్టులో కనీసం నీటిని నిలబెట్టలేదు. స్పిల్వే 48 గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేసినా జలాశయంలో భారీగా నీళ్లు నిలుస్తున్నాయి. జులైలో వచ్చిన భారీ వరదలు పోలవరం తొలి, రెండో దశ, పునరావాసం అన్న తేడా లేకుండా అనేక గ్రామాలను ముంచేశాయి. వేలాది నిర్వాసితులు కట్టుబట్టలతో తరలిపోవాల్సి వచ్చింది. ఇళ్లు కట్టి, పునరావాస ప్యాకేజి ఇచ్చి ఇతరత్రా సాయం అందించి 1,06,006 కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంది. వీరందరికీ పునరావాసం కోసం రూ.20వేల కోట్లు కావాలని, కేంద్రం ఇస్తే తప్ప తానేం చేయలేనని ముఖ్యమంత్రి జగన్ తాజాగా నిస్సహాయత ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఏమిటీ తొలి, మలిదశలు?
ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తున నీరు నిలబెడితే ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయనేది కాంటూరు సర్వేనుబట్టి లెక్కించి ప్రభుత్వం తొలి దశను నిర్ణయించింది. తొలి దశలో 115 ఆవాసాలు (54 రెవెన్యూ గ్రామాలు) 20,946 కుటుంబాలపై ప్రభావం పడుతుందని లెక్కించింది. పూర్తి నిల్వ 45.75 మీటర్లకు నిలబెడితే ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయనేది కూడా తేల్చింది. ఇదీ కలిపితే 222 రెవెన్యూ గ్రామాలు (373 ఆవాసాలు), 1.06 లక్షల కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని లెక్కించింది. ఆ ప్రకారం పునరావాసానికి ప్రయత్నిస్తున్నా.. మూడేళ్లుగా పనులు అంతంతే జరిగాయి.
తాజా గోదావరి వరదల్లో ఏం తేలింది?
గత నెల వానల సమయంలో భద్రాచలం వద్ద రెండో అతిపెద్ద వరద నమోదైంది. పోలవరం స్పిల్వే వద్ద 36.545 మీటర్లు, ఎగువ కాఫర్డ్యాం వద్ద 36.890 మీటర్ల గరిష్ఠ నీటిమట్టాలు రికార్డయ్యాయి. అలాగని పోలవరంలో నీళ్లు నిలబెట్టింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పోలవరం రెండో దశ ముంపు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. తమది రెండో దశ గ్రామాలు కదా.. ముంపు రాదంటూ ధైర్యంగా గ్రామాల్లోనే ఉండి గోదావరి పోటెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్థానికులు పరుగులు పెట్టారు. కూనవరం మండలంలో ఒక్క గ్రామం తప్ప మిగిలిన అన్ని రెండో దశ పునరావాసంలో ఉన్నవే. అలాంటిది ఈ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలు మొన్నటి వరదలకు మూడొంతులకుపైగా మునిగాయి. కూనవరం మండలం అతలాకుతలమైంది. కుక్కునూరు మండలంలో తొలిదశలో 8 గ్రామాలే ముంపులో చిక్కుకోవాలి. మొన్నటి వరదలకు ఏకంగా 84 ఆవాసాలకు 76 మునిగాయి. వేలేరుపాడు మండలంలో తొలిదశలో ఆరు గ్రామాలే ముంపులో చిక్కుకోవాలి. అలాంటిది మరో 14 రెవెన్యూ గ్రామాలు చివురుటాకుల్లా వణికాయి. పోలవరం వద్ద 45.72 మీటర్ల స్థాయికి నీరు నిలబెడితే మునగాల్సిన గ్రామాలు మొన్నటి వరదలకు అసలు పోలవరంలో నీరు నిలబెట్టకపోయినా మునిగాయి. ఎడవల్లి, బోళ్లపల్లి, కాచారం, తాట్కూరుగొమ్ము కాలనీ, ఎర్రబోరు, వసంతవాడ, సుద్దగుంపు, చిటెంరెడ్డిపాలెం, ఎర్రమెట్ట, చింతలపాడు, సిద్దారం, కొత్తూరు, తూర్పుమెట్ట, పడమట్టి మెట్టతోపాటు మరో 9 ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. చింతూరుతో సహా ఈ మండలంలోని అనేక గ్రామాలు రెండో దశలో ఉన్నవి. వరదలకు ఇవి ముంపుబారిన పడ్డాయి. పోలవరంలో నీరు నిలబెట్టకముందే పరిస్థితులిలా ఉన్నాయి.. ఇక తమ జీవితం ఎలా గడపాలి? అని రెండో దశలో ఉన్న వేల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?