ఊరూరా.. ప్రభంజనం
‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని.. ఆంధ్రుల రాజధాని అమరావతి.. జై అమరావతి జైజై అమరావతి’ అని రాజధాని రైతులు నినదించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జనం నీరాజనాలు పలికారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు
ఈనాడు డిజిటల్-ఏలూరు, న్యూస్టుడే- గోపాలపురం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం: ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని.. ఆంధ్రుల రాజధాని అమరావతి.. జై అమరావతి జైజై అమరావతి’ అని రాజధాని రైతులు నినదించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జనం నీరాజనాలు పలికారు. నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి సోమవారం మొదలైన మహాపాదయాత్ర ముసళ్లకుంట, పుల్లలపాడు మీదుగా నల్లజర్ల చేరుకుంది. అక్కడ భోజన విరామ అనంతరం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి వెళ్లింది. యాత్ర ప్రారంభ ప్రాంతంలో ఉన్న దూబచర్ల హైవే సమీపానికి చేరుకోగానే ఫ్లైఓవర్ పైనుంచి స్థానికులు పూలవర్షం కురిపించారు. నల్లజర్ల ప్రారంభంలో రైతుల పాదయాత్ర చిత్రాలతో సుమారు 150 అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. నల్లజర్ల నుంచి రైతులను పూలపై నడిపించారు.
పోటెత్తిన జనం...
దూబచర్ల నుంచి ముసళ్లకుంట చేరుకునేసరికి చుట్టుపక్కల గ్రామాలవారి కలయికతో దాదాపు 4 కి.మీ.పొడవునా పాదయాత్ర కనిపించింది. నల్లజర్ల మండల మహిళలు బతుకమ్మలతో వచ్చి యాత్రలో పాల్గొన్నారు. గ్రామాల్లో రైతులు దాదాపు 120 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన ఏర్పాటుచేశారు. నల్లజర్లలో అంబేడ్కర్ విగ్రహానికి రైతు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదే గ్రామంలో ఉన్న మసీదుకు వెళ్లి రైతులు, నాయకులు ప్రార్థనలు చేశారు. ప్రకాశరావుపాలెం ప్రారంభంలో రహదారిపై పెద్ద సంఖ్యలో భవానీ స్వాములు నిల్చుని స్వాగతం పలికారు. రహదారికి దూరంగా ఉన్న గ్రామాలనుంచి రైతులు, రైతుకూలీలు కాలినడకన వచ్చి యాత్రలో పాల్గొన్నారు. జగన్నాథపురం నుంచి మహిళా కోలాటం బృందం వచ్చి పాదయాత్రలో పాల్గొంది. ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్, జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఘంటా మురళి, చింతమనేని ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.
వైకాపా వాళ్లే మా యాత్రకు మద్దతిస్తున్నారు: అమరావతి ఐకాస నేతలు
‘వైకాపా వారు కూడా మా పాదయాత్రకు మద్దతు ఇస్తున్నారు. జగన్ కళ్లలో ఆనందం చూసేందుకే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి పేర్కొన్నారు. ప్రకాశరావుపాలెంలో అమరావతి ఐకాస నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వం చేసిన మోసాలు చాలు. మీ శకం ముగిసింది. మీకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది’ అని అన్నారు. తమ పాదయాత్రను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరాలను రాష్ట్రంలో ఉన్న రహదారులు చూపించడానికి వాడితే బాగుంటుందని ఐకాస నేత తిరుపతిరావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
TS News: వ్యూహం మార్చి.. దూకుడు పెంచి.. త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి
-
ఇదీ పది పరీక్షల తీరు!
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
-
రుషికొండలో ఏం జరిగింది?!
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం