Smart meter: సర్కారు వారి స్మార్ట్ భారం!
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ‘స్మార్ట్’ షాక్ ఇవ్వబోతోంది. స్మార్ట్మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట పదేళ్లలో రూ.36వేల కోట్ల భారం వేయనుంది.
మీటర్ల ఏర్పాటు.. నిర్వహణకు రూ.36వేల కోట్లు?
ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఇళ్లకు మీటర్లు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ‘స్మార్ట్’ షాక్ ఇవ్వబోతోంది. స్మార్ట్మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట పదేళ్లలో రూ.36వేల కోట్ల భారం వేయనుంది. పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం-ఆర్డీఎస్ఎస్) కింద మూడు డిస్కంల పరిధిలోని 1.50 కోట్ల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు 2025 డిసెంబరు నాటికి దశలవారీగా స్మార్ట్మీటర్లను ఏర్పాటుచేయనుంది. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారిని పథకం నుంచి మినహాయించింది. ఈ పథకం అమలు అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాల డిస్కంలకు కట్టబెట్టింది. తప్పనిసరి చేయలేదు. కానీ, రాష్ట్రప్రభుత్వం మాత్రం వీటిని ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఇంత మొత్తాన్ని వెచ్చించే ముందు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలపై ఇంధనశాఖ చేసిన అధ్యయనం ఏంటి.. వీటివల్ల విద్యుత్ సంస్థలకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ, కేంద్రప్రభుత్వం తరఫున పీఎఫ్సీ (విద్యుత్ ఆర్థికసంస్థ) 2022 మార్చి 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం కోసం 2022 మే 12న ప్రభుత్వం పంపింది. మీటర్ల ఏర్పాటు, నిర్వహణ టెండరు ప్రతిపాదనలను డిస్కంలు న్యాయసమీక్షకు పంపాయి.
‘స్మార్ట్’ లక్ష్యం మనకెందుకు?
ఆర్డీఎస్ఎస్ పథకం అమలుతో కేంద్రం కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. స్థూల సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 15% కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పథకాన్ని అమలుచేయాలని నిర్దేశించింది. స్మార్ట్ మీటర్లు, ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ లైన్ల ఏర్పాటు ద్వారా 2024-25 నాటికి ఈ నష్టాలను 12-15 శాతానికి తగ్గించాలన్నదే లక్ష్యం. అయితే, రాష్ట్రంలో 2021-22 నాటికే మూడు డిస్కంల సగటు నష్టాలు 11.21%. అయినా పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? దీనివల్ల పరోక్షంగా మీటర్ల తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.
మీటర్ల కొనుగోలు.. నిర్వహణకే రూ.36 వేల కోట్లు
రాష్ట్రంలో సుమారు కోటిన్నర స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మీటరు ధర రూ.6వేలుగా కేంద్రం నిర్దేశించింది. ఇందులో కేంద్రం రూ.900 గ్రాంటుగా ఇస్తుంది. అయినా మిగిలిన భారాన్ని ప్రజలు మోయక తప్పదు. మహారాష్ట్రలో స్మార్ట్మీటరు ఏర్పాటు, ఏడున్నరేళ్ల నిర్వహణకు ఒక్కో కనెక్షన్కు నెలకు రూ.200.96 ధరను అక్కడి డిస్కంలు ఖరారుచేశాయని ఇంధనశాఖ చెబుతోంది. ఈ లెక్కన ఏడున్నరేళ్లలో రూ.18,086.40 వంతున చెల్లిస్తారు. ఇందులో స్మార్ట్మీటర్ ధర రూ.6వేలు మినహాయిస్తే.. నిర్వహణ ఛార్జీలు రూ.12,086.40 అవుతాయి. అంటే నెలకు రూ.134.29 వంతున చెల్లించాలి. ఈ రేట్ల ప్రకారమే లెక్కిస్తే.. రాష్ట్రంలో మొదటి విడత ప్రతిపాదించిన 50.69 లక్షల కనెక్షన్లకు మీటర్ల కొనుగోలు, నిర్వహణకు నెలకు రూ.101.87 కోట్లు వెచ్చించాలి. ఏడాదికి రూ.1,222.40 కోట్ల వంతున.. పదేళ్లలో రూ.12,224 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో కనెక్షన్కు (మీటర్ కొనుగోలుకు రూ.6,896.65, నిర్వహణ ఖర్చు రూ.17,250.13 కలిపి) రూ.24,146.78 వెచ్చిస్తున్నట్లు. దీని ప్రకారం 1.50 కోట్ల విద్యుత్ కనెక్షన్లకు పదేళ్లలో వెచ్చించే మొత్తం రూ.36,220.17 కోట్లు. స్మార్ట్మీటర్ల కొనుగోలు, నిర్వహణ ఖర్చువల్ల ప్రజలపై భారం మోపడం తప్ప అదనపు ప్రయోజనం లేదని నిపుణులు అంటున్నారు. ‘రాష్ట్రంలో ప్రతి ఫీడర్కూ ప్రత్యేక మీటర్ ఉంది. దాన్నుంచి సరఫరా అయ్యే విద్యుత్ను ప్రతి గంటకూ నమోదు చేస్తున్నారు. ఇప్పుడు పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు ఏర్పాటుచేస్తే.. విద్యుత్ పంపిణీ లెక్కలు పక్కాగా వస్తాయి. ఏ ఫీడర్లో విద్యుత్ చౌర్యం జరుగుతుందో తెలుస్తుంది. నియంత్రణ చర్యలు చేపట్టవచ్చు’ అని నిపుణులు చెబుతున్నారు.
అదనపు భారాన్ని భర్తీచేయడం సాధ్యమేనా?
ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్మీటర్లు ఏర్పాటుచేస్తే ప్రతినెలా రీడింగ్ నమోదుచేయాల్సిన అవసరం ఉండదని, దీనికోసం వెచ్చించే మొత్తం మిగులుతుందని డిస్కంలు చెబుతున్నాయి. మీటర్ రీడింగ్ నమోదుకు ఒక్కో కనెక్షన్కు సగటున రూ.10 వంతున ఖర్చుచేసినట్లు భావిస్తున్నా.. రాష్ట్రంలోని సుమారు 1.50 కోట్ల విద్యుత్ కనెక్షన్లకు ప్రతి నెలా రూ.15 కోట్లు ఖర్చవుతుంది. ఏడాదికి రూ.180 కోట్ల వంతున.. పదేళ్లలో రూ.1,800 కోట్లు. దీనిపై డిస్కంల దగ్గర ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. ఇప్పటికే ఆర్డీఎస్ఎస్ కింద కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను దాదాపు డిస్కంలు చేరుకున్నాయి. అధికారులు చెబుతున్నట్లు రూ.36 వేల కోట్లు ఆదా చేయడం సాధ్యమేనా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు