జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం
రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమననీతిని దిల్లీ వేదికగా ఎండగట్టాలని రాజధాని రైతులు నిర్ణయించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాల్సిన ఆవశ్యకతను దిల్లీ వీధుల్లో ఎలుగెత్తి చాటనున్నారు.
17, 18వ తేదీల్లో జంతర్మంతర్ వద్ద నిరసన
ప్రత్యేక రైల్లో దిల్లీ వెళ్లనున్న 2 వేల మంది రైతులు, రైతు కూలీలు
తుళ్లూరు గ్రామీణం, న్యూస్టుడే: రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వ దమననీతిని దిల్లీ వేదికగా ఎండగట్టాలని రాజధాని రైతులు నిర్ణయించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాల్సిన ఆవశ్యకతను దిల్లీ వీధుల్లో ఎలుగెత్తి చాటనున్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై మూడేళ్లవుతున్న సందర్భంగా డిసెంబరు 17, 18 తేదీల్లో దేశ రాజధానిలోని జంతర్మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబరు 7 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నందున... మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం అమరావతి విధ్వంసానికి తెగబడిన తీరును యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు నిర్ణయించారు. రెండు రోజులపాటు జరిగే నిరసన కార్యక్రమానికి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకుల్ని ఆహ్వానించనున్నారు. సుమారు 2వేల మంది రైతులు, రైతు కూలీలు ప్రత్యేక రైల్లో దిల్లీ వెళ్లనున్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం తుళ్లూరులో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల సంయుక్త సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రైతు నాయకులు ధనేకుల రామారావు, బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
15న దిల్లీ పయనం
డిసెంబరు 15న విజయవాడ నుంచి 22 బోగీలున్న ప్రత్యేక రైలులో రైతులు, రైతు కూలీలు దిల్లీ బయల్దేరతారు. 17, 18 తేదీల్లో జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. 19న భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై దిల్లీలో నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి దిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాం
‘దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అమరావతి పరిరక్షణ కోసం మూడేళ్లుగా పోరాడుతున్నాం. పోలీసుల ఆంక్షలవల్ల పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చాం. అమరావతిని కాపాడుకునేందుకు రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతాం. ప్రజల మద్దతుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తాం. అమరావతిపై ప్రభుత్వ దమనకాండను దిల్లీలో చాటిచెబుతాం. మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం తెలుపుతాయని భావిస్తున్నాం’ అని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో చేసిన ఉద్యమాన్ని అమరావతి ఉద్యమకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని బెల్లకొండ నరసింహారావు సూచించారు. అమరావతి ఏ ఒక్క కులానికో, మతానికో చెందింది కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించే నగరమని శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. రాజకీయ నాయకులంతా పార్టీలకు అతీతంగా అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం