ప్రజల ఆరోగ్యానికి పెను సవాల్
విచ్చలవిడి యాంటీబయాటిక్స్ వినియోగం ప్రపంచ ఆరోగ్యానికి పెను సవాలు విసురుతోంది. వైద్యుల సలహాలు పాటించకుండానే సొంత వైద్యంతో మందులను అవసరాలకు మించి వాడుతున్నారు.
అతిగా యాంటీబయాటిక్స్ వినియోగమే కారణం
వ్యవసాయ, పశు, మత్స్య రంగాల్లో మితిమీరి వాడకం
కొవిడ్ కంటే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం
వివిధ రంగాల నిపుణుల ఆందోళన
ఈనాడు, అమరావతి: విచ్చలవిడి యాంటీబయాటిక్స్ వినియోగం ప్రపంచ ఆరోగ్యానికి పెను సవాలు విసురుతోంది. వైద్యుల సలహాలు పాటించకుండానే సొంత వైద్యంతో మందులను అవసరాలకు మించి వాడుతున్నారు. జంతువులు, కోళ్లలో వ్యాధుల నివారణకు సప్లిమెంట్లుగానూ వీటిని అధిక మోతాదులో వాడుతున్నారు. వ్యవసాయంలో విరివిగా వాడే కీటక నాశినులు, రసాయన క్రిమిసంహారకాల వాడకంతో పరోక్షంగా నిరోధకత పెంపొందించుకున్న సూక్ష్మక్రిములు ఆయా ఆహార పదార్థాల ద్వారా మనుషుల శరీరంలోకి చేరుతున్నాయి. వీటిని ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’(ఏఎంఆర్)గా పేర్కొంటున్నారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సుమారు 12 లక్షల మరణాలకు యాంటీబయాటిక్స్కు లొంగని సూక్ష్మక్రిములే కారణమని ‘లాన్సెట్’లో వ్యాసం ప్రచురితమైంది. కలరా, టైఫాయిడ్, న్యుమోనియా, క్షయ వంటి వ్యాప్తి అధికంగా ఉండే భారత్లో యాంటీబయాటిక్స్ వినియోగం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఒకప్పుడు ‘మస్కిటో కాయిల్’ పెడితే దోమలు పారిపోయేవి. ప్రస్తుతం ఘాటైన కాయిల్స్, ద్రావణాన్ని వాడుతున్నా అవి వెళ్లిపోవడంలేదు. నిరోధక శక్తిని పెంచుకుంటూ తిరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మనుషులకు వస్తున్న వివిధ వ్యాధుల విషయంలోనూ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏఎంఆర్ నిరోధక చర్యలపై జరిగిన సదస్సుకు హాజరైన వైద్య, ఇతర రంగాల నిపుణులు ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు.
ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్ల కేసులు
-డాక్టర్ రంగారెడ్డి, అధ్యక్షుడు
ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా
ఆసుపత్రుల్లోని వాతావరణంతోనూ ఇన్ఫెక్షన్ల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరిన వారిలో 5% నుంచి 8% మందికి అదనంగా కొత్త రోగాలు తోడవుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో 12% నుంచి 15% వరకు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో ఐసీయూల్లో వంద మంది ఉంటే... 20% నుంచి 30% మందికి అదనంగా కొత్త జబ్బులు వస్తున్నాయి. పరిశుభ్రత లేకపోవడం, రోగులకు ఉపయోగించే సిరంజీలు, సెలైన్లు ఇతర వస్తువుల విషయాల్లో జాగ్రత్తలు పాటించనందున రోగులు కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. దేశంలో రెండు దశాబ్దాలుగా యాంటీబయాటిక్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని తేలికగా తీసుకుంటే కొవిడ్ కంటే చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైద్యుల చీటీ లేకుండా మందులను అమ్మొద్దు. మరోవైపు పూర్తిస్థాయిలో మందులు వాడకుండానే ఆరోగ్యం బాగుందని మధ్యలోనే మందుల వాడకాన్ని నిలిపేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
ఆక్వా, పౌల్ట్రీ రంగాల్లో నియంత్రణ తప్పనిసరి
-డాక్టర్ పి.రెడ్డెన్న, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్నాలజీ అసోసియేషన్
ఆక్వా, పౌల్ట్రీరంగాల్లో అవసరాలకు మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఫలితంగా బ్యాక్టీరియాకు నిరోధక శక్తి పెరిగి, సాధారణ వ్యాధులకు సైతం మందులు పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ఈ రంగాల్లో యాంటీబయాటిక్స్ రహిత దాణాను మాత్రమే వాడాలి. వైద్య, ఆహార, పరిశ్రమ రంగాల్లో వీటి వినియోగంపై నియంత్రణ చర్యల అవసరముంది.
నిరంతర శాస్త్రీయ అధ్యయనం జరగాలి
-ప్రొఫెసర్ ఆనందకుమార్(మైక్రోబయాలజీ), శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం
జంతువుల నుంచి మనుషులు, మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. పశువులు, కోళ్లలో ఉన్న వ్యాధి నిరోధకతను తెలుసుకునేందుకు శాస్త్రీయ అధ్యయనం జరగాలి. ఇందులో భాగంగానే నిరుడు ఈ-కోలిపై పైలెట్ ప్రాజెక్టు చేశాం. కోళ్లు, వాతావరణంలోని ఈ-కోలి నమూనాలను సేకరించాం. పరిశోధనలు సాగుతున్నాయి. వాటి ఫలితాలు వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలుగుతుంది. ఇప్పటికిప్పుడు నూతన యాంటీబయాటిక్స్ తయారు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న వాటినే కాపాడుకోవాలి.
బహుళ వ్యాధుల టీకాలు రావాలి
-ప్రొఫెసర్ పి.వెంకటలక్ష్మి శివప్రసాద్ (స్ట్రక్చరల్ బయోటెక్నాలజీ), కేఎల్యూ
మనుషులు, జంతువులు, కోళ్లకు నాలుగైదు రకాల వ్యాక్సిన్లు కాకుండా బహుళ వ్యాధుల వ్యాక్సిన్లు వస్తే మంచిది. ఒక్కో టీకా ఇచ్చుకుంటూ పోతే... బ్యాక్టీరియాకు నిరోధకత పెరుగుతుంది. యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో వచ్చే దుష్ఫలితాల గురించి పిల్లలకు పాఠశాల విద్య నుంచే బోధించాలి. వీరిలో అవగాహన కలిగిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది.
అవగాహన లోపం
-ప్రొఫెసర్ పి.హరిబాబు(రిటైర్డ్) మత్స్య కళాశాల, నెల్లూరు
ఒకప్పుడు రొయ్యల సాగులో యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంది. ఎగుమతులపై ఆంక్షలు, ఎగుమతుల అవసరాలు, వచ్చిన అవగాహనతో వాటి వినియోగం బాగా తగ్గింది. దేశీయంగా చేపల ఉత్పత్తిలో కొన్నిచోట్ల పరిధి మించి వాడుతున్నారు. ఇది మంచిది కాదు. వ్యాధుల నిర్ధారణలో లోపాలతోనూ దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం