Dharmana Prasada Rao: ధర్మం తప్పినా మంత్రి దర్జా
1956 ఆగస్టు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 112 మంది దుర్మరణం పాలయ్యారు. సాంకేతిక తప్పిదం వల్ల జరిగిన ఆ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది సంబంధిత అధికారులు, రైల్వేబోర్డు. కానీ ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్బహదూర్శాస్త్రి ప్రధాని నెహ్రూకు రాజీనామా లేఖ పంపారు.
భూఅక్రమాలు రుజువైనా ధర్మానపై చర్యలేవి?
మంత్రివర్గంలో ఆయన ఎలా ఉంటున్నారు?
ఆధారాలతో సిట్ నిరూపించినా.. సీఎం ఎలా కొనసాగిస్తున్నారు?
ఈనాడు - అమరావతి
1956 ఆగస్టు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 112 మంది దుర్మరణం పాలయ్యారు. సాంకేతిక తప్పిదం వల్ల జరిగిన ఆ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది సంబంధిత అధికారులు, రైల్వేబోర్డు. కానీ ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్బహదూర్శాస్త్రి ప్రధాని నెహ్రూకు రాజీనామా లేఖ పంపారు. నెహ్రూ ఆయనను సముదాయించారు. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించారు. అదే ఏడాది నవంబరులో తమిళనాడులోని అరియలూరు వద్ద మరో రైలు ప్రమాదం జరిగింది. 144 మంది మరణించారు. లాల్బహదూర్శాస్త్రి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈసారి ప్రధాని చెప్పినా వినలేదు. పట్టుబట్టి రాజీనామా ఆమోదింపజేసుకున్నారు.
- ఇది ఆ తరం నాయకుల నిబద్ధత. తరాలు మారుతున్నా, నాయకుల నిబద్ధత గురించి చెప్పాల్సి వస్తే ఈ ఘటననే గుర్తు చేసుకుంటాం.
కానీ..
రూ.వందల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడ్డారని, మంత్రి పదవి ద్వారా సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విలువైన భూముల్ని కొట్టేశారని దర్యాప్తు బృందం నిగ్గు తేల్చినా నిస్సిగ్గుగా పదవిని పట్టుకుని వేళ్లాడుతున్న నాయకుల గురించి భవిష్యత్ తరాలకు ఉదాహరణగా చెప్పాల్సి వస్తే.. కచ్చితంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావునే గుర్తు చేసుకోవాలేమో!
భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆధారాలతో సిట్ నిరూపించినా.. ఇప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా పదవిలో కొనసాగుతున్న ధర్మానను, ఆయనను మంత్రివర్గంలో కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్నూ ఏమనాలి? ధర్మాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉండగా, విశాఖలో 71.29 ఎకరాల భూకుంభకోణానికి పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి స్వాత్రంత్య్ర సమరయోధులకు కేటాయించిన డీ ఫాం పట్టా భూములకు ఎన్వోసీలు ఇప్పించి, వాటిని ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు కట్టబెట్టారని సిట్ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నా ధర్మానపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆయనను మంత్రివర్గం నుంచి ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు? ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి హోదాలో ఉండి... కంచే చేను మేసినట్టు ధర్మాన అక్రమ మార్గాల్లో భూములు కొట్టేశారని రుజువైనా ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆధారాలతో కుంభకోణం బయటపడ్డా.. ఆయన నిర్వాకాన్ని సిట్ పేజీల కొద్దీ నివేదికలో ఎండగట్టినా ధర్మానకు చీమ కుట్టినట్టయినా లేదా? ఇవీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలనుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. ‘ఎన్వోసీలపై నిర్ణయం తీసుకునేది మంత్రి కాదు. రెవెన్యూ మంత్రికి జిల్లా స్థాయిలో కార్యకలాపాలతో సంబంధం ఉండదు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల స్థాయిలోనే ఆ నిర్ణయాలు జరుగుతాయి. అయినా మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే ఎలా? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నందుకే నాలాంటి వాళ్ల పీక నొక్కాలని కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. నా నోరు మూసేందుకే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. నాది 40 ఏళ్ల రాజకీయ జీవితం. నా వ్యక్తిత్వంపై మచ్చ వేయడం వారి తరం కాదు. మీరు రాసినా, ఫొటోలు వేసినా బెదిరిపోయే వ్యక్తిని కాను. విశాఖలో ఒక్క భూమి విషయంలో నా ప్రమేయాన్ని నిరూపించినా ఆ భూములు రాసిస్తాను’
- విశాఖ భూకుంభకోణంలో ధర్మాన పాత్రపై సిట్ నివేదిక బయటకు వచ్చాక వివిధ సందర్భాల్లో ఆయన స్పందన ఇదీ! కానీ ఆ భూములు అక్రమ మార్గాల్లో తన భార్య, కుమారుడి పేరు మీదకు, తమ్ముడు, సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లోకి బదిలీ కాలేదని ధర్మాన ఎప్పుడూ చెప్పలేదు. సిట్ నివేదికలో పేర్కొన్న అంశాల్ని ఖండించనూ లేదు. మసిపూసి మారేడుకాయ చేస్తోంది ఎవరు ధర్మాన గారూ? విశాఖ భూకుంభకోణాల్లో ప్రధాన సూత్రధారి మీరేనని, ఎంతో చాకచక్యంగా పావులు కదిపి ఆ భూముల్ని హస్తగతం చేసుకున్నారని సిట్ సాక్ష్యాధారాలతో సోదాహరణంగా నిగ్గు తేలిస్తే.. ఇంకా ఏం నిరూపించాలి? ఎవరు నిరూపించాలి? తప్పు జరిగిందని అంగీకరించి, నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాల్సిందిపోయి ఎదురుదాడేంటి?
బుకాయిస్తే.. తప్పులు ఒప్పులైపోతాయా?
విశాఖ భూకుంభకోణంపై దర్యాప్తు చేసింది ఏ మంత్రుల బృందమో కాదు. వారంతా రాజకీయ నాయకులు కాబట్టి లేనిపోని బురదజల్లుతున్నారని తప్పించుకోవడానికి. అప్పట్లో గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్, విశాఖ సంయుక్త కలెక్టర్ జి.సృజన, డిప్యూటీ కలెక్టర్ విజయసారథి... పలు సబ్ కమిటీలు వేసుకుని, కొన్ని నెలలపాటు శ్రమించి, కొన్ని వేల దస్త్రాల్ని, పత్రాల్ని క్షుణ్నంగా శోధించి.. వేల పేజీల నివేదిక రూపొందించారు. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ, రాష్ట్ర విభజన తర్వాత గానీ భూకుంభకోణాలపై అంత సాధికారికంగా, ఆధారసహితంగా, దోషులెవరో, వారి పాత్ర ఏమిటో సూటిగా, స్పష్టంగా చెప్పిన నివేదిక ఇదే కావచ్చు. విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో ధర్మాన కుటుంబం 71.29 ఎకరాల భూకుంభకోణానికి పాల్పడిందని, రెవెన్యూ మంత్రిగా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సిట్ ఆధారాలతో నిరూపించింది. విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన ఎసైన్డ్ భూములకు నిరభ్యంతర పత్రాల కోసం వచ్చిన దరఖాస్తుల్ని ధర్మాన స్వయంగా ఎండార్స్ చేసి జిల్లా అధికారులకు పంపించారని, ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఆ భూములకు ఎన్వోసీలు వచ్చాయని, సామాన్యులకు అలా ఎన్వోసీలు దక్కే ఆస్కారమే లేదని సిట్ పేర్కొంది. మధురవాడలో మాజీ సైనికోద్యోగి మాదాబత్తుల అప్పారావు పేరిట ఉన్న ఐదు ఎకరాల డీ ఫాం భూమిని.. ధర్మాన స్వయంగా చెప్పడం వల్లే తాను కొన్నానని, తర్వాత ధర్మాన కుటుంబసభ్యుల పేరు మీద బదలాయించానని గుబ్బల గోపాలకృష్ణ అనే వ్యక్తి సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. దానిలో తాను ఒక రూపాయీ పెట్టలేదని, తనకూ రూపాయీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ గోపాలకృష్ణ ధర్మానకు అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబ కంపెనీలో డైరెక్టరూ అయిన ఐబీ కుమార్కు స్వయంగా మామ. సొంత మనుషులు, అప్పట్లో ధర్మాన ప్రలోభపెట్టడం వల్లో, ఒత్తిడి తేవడం వల్లో కుట్రలో భాగస్వాములైనవారే ఏం జరిగిందో అంత స్పష్టంగా చెబితే.. ఇంకా బుకాయింపులు, హూంకరింపులతో ఎవరిని నమ్మించి మోసగించాలనుకుంటున్నారో ధర్మానకే తెలియాలి.
విశాఖలో భూఅక్రమాలపై చోద్యం చూస్తోంది అందుకేనా?
విశాఖలో వైఎస్ ప్రభుత్వ హయాంకంటే ఎక్కువగా ఇప్పుడు భూకుంభకోణాలు జరుగుతున్నాయి. భూయజమానులకు ఒక శాతం వాటా ఇచ్చి తాను 99 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్న.. ప్రజాప్రతినిధిగా ఉన్న బిల్డర్ ఒకరు, విశాఖ నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే దసపల్లా భూముల్ని వాటి యజమానులు అంటున్నవారికి 30 శాతం ఇచ్చి.. తాము 70 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్న అధికార పార్టీ నేతల బినామీలు మరికొందరు, చర్చి భూములకే ఎసరు పెట్టిన ప్రజాప్రతినిధి ఒకరు, అనకాపల్లి జిల్లా బయ్యవరంలో ప్రభుత్వ, ఎసైన్డ్ భూముల్ని కొట్టేసిన అధికార పార్టీ ప్రబుద్ధులు మరికొందరు. విశాఖలో ఇన్ని భూఅక్రమాలు జరుగుతున్నా, రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. వాటిని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి ధర్మాన చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం పట్టించుకోవడం లేదు. వాటిపై సమీక్ష లేదు. విచారణకు ఆదేశాల్లేవు. దసపల్లా భూముల్ని ఇప్పుడు 22 (ఎ) నుంచి తీసేసి... ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ మంత్రిగా ఆ భూముల్ని కాపాడాల్సిన ధర్మాన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. విశాఖ భూఅక్రమాలపై చర్యలకు ఉపక్రమిస్తే తన భూదందాల చిట్టా బయటకు తీస్తారన్న భయమో, ఉన్న పదవీ ఊడిపోతుందన్న ఆందోళనో తెలియదు గానీ ఆయన మాత్రం... సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా కనీసం అక్కడేం జరుగుతోందని కూడా ఆరా తీయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కిరణ్ చేసింది.. జగన్ ఎందుకు చేయరు?
విశాఖలో ఏకంగా 71.29 ఎకరాల భూముల్ని ధర్మాన చాకచక్యంగా కొట్టేశారని సిట్ అంత వివరంగా నివేదిక ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు గుంభనంగా ఉంటున్నారు? ధర్మానపై చర్యలు తీసుకోవడానికి, ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు? వాన్పిక్, లేపాక్షి, పెన్నా సిమెంట్స్కు భూకేటాయింపుల కేసుల్లో సహనిందితుడైన ధర్మానను కేబినెట్ నుంచి బయటకు పంపించడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నామని, తద్వారా ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల విలువైన సంపదను అందజేశానని ఊదరగొడుతున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ధర్మాన అక్రమంగా హస్తగతం చేసుకున్న భూముల జోలికి ఎందుకు వెళ్లలేదు? ఆ కుంభకోణం గురించి సాయిరెడ్డి నోరు ఎందుకు పెగలడం లేదు? ఇలాంటి ప్రశ్నలే అనేకం తలెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, గనులశాఖ మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులని సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది. అప్పటికి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో ధర్మాన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, సబిత హోంమంత్రిగా ఉన్నారు. వారిద్దరితో కిరణ్ రాజీనామా చేయించారు. అదే వైఎస్ కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడే ధర్మాన విశాఖలో భూకుంభకోణానికి పాల్పడ్డారని, దానిలో మంత్రి కుటుంబానికే వ్యక్తిగత లబ్ధి చేకూరిందని సిట్ తేల్చింది. అయినా ఆయనతో ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయించకపోవడంలోని ఔచిత్యమేంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం