పైసలూ పోయే.. పరువూ పోయే!
ప్రభుత్వం మనదే కదా అనే ధీమాతో వారు కాంట్రాక్టు పనుల్లోకి దిగారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని ఉన్నదంతా పెట్టారు. అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. చివరికి నమ్మి నట్టేట మునిగారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. అప్పుల కుప్పయింది.
ప్రభుత్వ పనులకు సొంతంగా ఉన్నదంతా ఖర్చు
బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయిన వైకాపా నేతలు
వారికి చెల్లించాల్సిన బకాయిలు రూ.520 కోట్లు
మనదే ప్రభుత్వమని నమ్మి నట్టేట మునిగారు
ఇదీ క్షేత్ర స్థాయి నాయకుల దీనావస్థ
ఈనాడు - అమరావతి, యంత్రాంగం
ప్రభుత్వం మనదే కదా అనే ధీమాతో వారు కాంట్రాక్టు పనుల్లోకి దిగారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని ఉన్నదంతా పెట్టారు. అప్పులు చేసి మరీ ఖర్చు చేశారు. చివరికి నమ్మి నట్టేట మునిగారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. అప్పుల కుప్పయింది. కుటుంబ పరువు కాపాడుకునేందుకు సొంత ఆస్తులను, ఇళ్లను తెగనమ్ముకుంటున్నారు. అయినా అప్పులు పూర్తిగా తీరక, రోడ్డున పడుతున్నారు. వీరిలో చాలామంది ఇంకొన్నాళ్లు చూస్తామని... ఎలాగోలా బిల్లులొస్తే ఈ రాజకీయాలు, ఈ పార్టీకో నమస్కారం పెట్టి వెళ్లిపోదామని అనుకుంటున్నారు.
వైకాపా సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఇతర నేతలు వారి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల భవనాలను నిర్మించారు. చేసిన పనులకు సంబంధించి వారికి రూ.520 కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పనులు చేసేందుకు అప్పులు తెచ్చామని, వాటికి వడ్డీలు పెరుగుతున్నాయని నేతలు అల్లాడుతున్నారు. బాధితుల్లో కొందరు అధికారిక, అనధికారిక సమావేశాల్లో నిలదీస్తున్నారు. మరికొందరు నాయకులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలామంది బయటకు చెబితే అసలుకే మోసం అవుతుందేమోనన్న భయంతో మింగలేని, కక్కలేని స్థితిలో తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు.
పొలం, నగలు విక్రయించి.. ఇల్లు తాకట్టు
ప్రకాశం జిల్లా చినకంభం వైకాపా సర్పంచి షేక్ మహ్మద్ రసూల్. ప్రస్తుతం ఆయన సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కుమారుడు షేక్ హుస్సేన్ బాషా కంభంలోనే టీకొట్టు నడుపుతున్నారు. కోడలు షేక్ హబీబా తెదేపా ప్రభుత్వ హయాంలో చినకంభంలో వైకాపా సర్పంచిగా గెలిచారు. ఆమె ఆధ్వర్యంలో పంచాయతీలో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.1.20 కోట్ల వరకు బిల్లులు వచ్చాయి. మరో రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక రసూల్ సర్పంచిగా ఎన్నికయ్యారు. గోవిందాపురంలో పైపులైను, ఎస్సీ కాలనీలో ఇంటింటికీ కుళాయిలు, ఉప్పువాగుపై వంతెన, సిమెంటు రోడ్డు, వాటర్ట్యాంకును నిర్మించారు. వీటికి సంబంధించి రూ.53 లక్షలు, ఆయన కోడలి సమయంలో రూ.30 లక్షలు కలిపి మొత్తంగా రూ.83 లక్షల బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ‘అప్పులు తీర్చేందుకు ఎకరా పొలాన్ని రూ.20 లక్షలకి, రెండు ట్రాక్టర్లను రూ.10 లక్షలకు, భార్య, కుమార్తెల బంగారు నగలు, కమ్మలతోసహా అమ్మేశా. మా సోదరుడు రూ.10 లక్షలు, గ్రామస్థులు కొందరు రూ.20 లక్షలు సర్దుబాటు చేశారు. ఇంకా రూ.20 లక్షలకుపైగా అప్పులున్నాయి. పొట్టకూటి కోసం భార్యాపిల్లలు కూలీకి వెళుతున్నారు’ అని రసూల్ కన్నీటి పర్యంతం అయ్యారు.
నగరిలో మంత్రి పేచీ..!
నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం పత్తిపుత్తూరులో గ్రామ సచివాలయం, ఆర్బీకే, బీఎంసీ నిర్మాణాలకు సంబంధించి తమకు రూ.25 లక్షలు రావాల్సి ఉందని జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి చెబుతున్నారు. వాటికి ఎంబుక్ రికార్డు చేయకుండా మంత్రి రోజా, ఆమె సోదరులు అడ్డుకుంటున్నారని ఆయన వాపోతున్నారు.
ఇదో భాస్కరుడి అప్పుల గాథ
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట వైకాపా సర్పంచి పైడి భాస్కరరావుది మరో అప్పులగాథ. ‘రూ.10.6 లక్షలతో పాలశీతలీకరణ కేంద్ర భవనం, రూ.21.8 లక్షలతో రైతు భరోసా కేంద్రాన్ని 2021 అక్టోబరులోనే పూర్తి చేశా. ఇంకా రూ.7లక్షలు రావాల్సి ఉంది. 2021 సెప్టెంబరులో ఉపాధి హామీ కింద రూ.13 లక్షలతో కంకర రోడ్లు నిర్మించా. రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.7 లక్షలతో వీధి కాలువలను నిర్మించా. ఒక్క పైసా తిరిగి రాలేదు’ అని భాస్కరరావు వాపోయారు.
రూ.45 లక్షలు రావాలి
‘మా పంచాయతీ పరిధిలో ఏడాది క్రితం రూ.10 లక్షలతో సీసీ రోడ్లు వేయించగా రూ.3లక్షలే వచ్చాయి. రూ.6 లక్షలతో షెడ్డు నిర్మించగా రూ.1.5 లక్షలు వచ్చాయి. డ్రైనేజీకి సంబంధించి రూ.20 లక్షలు, ఆర్బీకే, ఆరోగ్య కేంద్రం తదితర పనులవి కలిపి మొత్తంగా రూ.45 లక్షలు రావాల్సి ఉంది’ అని గిద్దలూరు నియోజకవర్గంలోని ఒక పంచాయతీ సర్పంచి భర్త వాపోతున్నారు.
అయిదు ఎకరాలు అమ్మేసుకుని...
మైలవరం నియోజకవర్గంలో ఒక ఉప సర్పంచి ఆర్బీకే భవనాలను నిర్మించారు. రూ.2 కోట్ల మేర బిల్లులు రాకపోవంతో అప్పులు తీర్చేందుకు అయిదు ఎకరాలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది. మునగపాక మండల వైకాపా నాయకుడు ఒకరు రూ.2 కోట్ల విలువైన పనులు చేశారు. బిల్లుల పెండింగ్తో 30 సెంట్ల వ్యవసాయ భూమిని అమ్ముకున్నారు.
తిరగ్గా... తిరగ్గా సగం వచ్చాయి
మచిలీపట్నం నగరపాలక సంస్థ మాజీ కౌన్సిలర్ ప్రభుత్వ భవనాలు, రోడ్లు ఇతర పనులకు రూ.3 కోట్లు ఖర్చు చేశారు. రెండున్నరేళ్లయినా బిల్లులు రాలేదు. వైకాపా నియోజకర్గ, ఇతర సమావేశాల్లోనూ తరచూ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఇటీవల రూ.కోటిన్నర మంజూరయ్యాయి.
ధైర్యం చేసి ప్రశ్నించినా...
* తెనాలిలో డిసెంబరులో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని పనులు చేసినా బిల్లులు రావడం లేదని 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
* అచ్యుతాపురం మండలం మల్లవరం సర్పంచి పిన్నమరాజు వాసు మండల సర్వసభ్య సమావేశంలో రైతు భరోసా, సచివాలయం, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలకు సంబంధించి బిల్లులు రాలేదని ఆందోళన చేశారు.
* తిరువూరు నియోజకవర్గంలో వైకాపా జిల్లా పరిశీలకులు మర్రి రాజశేఖర్, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి నిర్వహించిన పార్టీ సమీక్షలో... తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని వారిని పలువురు నిలదీశారు.
బయటపడలేకపోతున్నారు ఇలా...
* చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక మండల వైకాపా సమన్వయకర్త తన స్వగ్రామంలో వేసిన రోడ్లకు ఇంకా రూ.1.5 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తమను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి విడదల రజిని పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన్ను సమన్వయకర్తగా తొలగించారు.
* పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 20 సచివాలయాలు, 20 ఆర్బీకేలు, 14 వెల్నెస్ సెంటర్లను 22 మంది గుత్తేదారులు నిర్మిస్తున్నారు. వారికి గత ఏడాది మార్చి నుంచి రూ.2కోట్ల వరకు బిల్లులు జమకావడం లేదు.
* కావలి మండలంలోని ముగ్గురు కాంట్రాక్టర్లకు జగనన్న కాలనీలు, జల్జీవన్ మిషన్(జేజేఎం) పనులకు సంబంధించి రూ.60 లక్షల బకాయిలు ఉన్నాయి. కోవూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో ఆరుగురికి రూ.కోటి, నెల్లూరు గ్రామీణ పరిధిలో ఆరుగురురికి రూ.2కోట్ల బిల్లులు ఆగిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం