సంక్షిప్త వార్తలు(8)
వైఎస్సార్ పింఛను కానుక కింద అందించే పింఛన్లను ఏప్రిల్ 3 నుంచి పంపిణీ చేయనున్నట్లు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు.
3 నుంచి పింఛన్ల పంపిణీ
ఈనాడు డిజిటల్, అమరావతి: వైఎస్సార్ పింఛను కానుక కింద అందించే పింఛన్లను ఏప్రిల్ 3 నుంచి పంపిణీ చేయనున్నట్లు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం, 2న ఆదివారం అయినందున బ్యాంకులు పని చేయవని, అందుకే 3నుంచి పింఛను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
దళిత ఉద్యోగులకు ఇబ్బందులొస్తే మాట్లాడతాం
ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం
ఈనాడు డిజిటల్, అమరావతి: దళిత ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ పేర్కొన్నారు. సంఘ ప్రతినిధులతో కలిసి ఆయన విజయవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారి అర్హత లేని ఓ వ్యక్తిని అచ్చెన్న దగ్గర నియమించారు. దాని మీదే ఆయన ఫిర్యాదు చేశారు. ఇదే హత్యకు దారి తీసిందని అనుకుంటున్నాం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ ఫలితాలు వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను హైకోర్టు పరిపాలన విభాగం బుధవారం ప్రకటించింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు హైకోర్టు వెబ్సైట్లో ఉంచింది. నాన్టెక్నికల్ పోస్టులైన జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డు అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారిజాబితాను వెల్లడించింది. టెక్నికల్ పోస్టులైన స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్టు, డ్రైవర్ పోస్టుల నైపుణ్య పరీక్షకు 1:3 నిష్పత్తిలో ఎంపికైనవారి వివరాలను ప్రకటించింది. నైపుణ్య పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామంది. దిగువ కోర్టుల్లో మొత్తం 3,432 ఉద్యోగాలను హైకోర్టు భర్తీ చేస్తోంది.
రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు రూ.10 కోట్లు విడుదల
ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలోని ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాల ప్రాంగణాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద రాష్ట్ర ఆహార ప్రయోగశాలగా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా రూ.10.16 కోట్లను భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ విడుదల చేసింది.
పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు సాధికార సమితి వినతి
ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు సాధికార సమితి ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి, కన్వీనర్లు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, అక్కినేని భవానీ ప్రసాద్లు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రిని వారు కలిసి 27 పేజీల సవివర వినతిపత్రం సమర్పించారు. కేంద్ర మంత్రితో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు సమావేశానంతరం వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్ తెలిపారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ఆడిట్, పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత దీనికి పరిష్కారం చూపుతామని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. డ్యాంను 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారన్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఆర్ అండ్ ఆర్ను రెండు విభాగాలుగా విభజించి అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు జీవీఆర్ శాస్త్రి తెలిపారు. పోలవరం సాధికార సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతానని చెప్పినట్లు పేర్కొన్నారు.
దళితులపై దాడులు వాస్తవమే కానీ...: మంత్రి మేరుగు
వినుకొండ, న్యూస్టుడే: ‘మా ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగాయి.. కాదనడం లేదు.. కానీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు.. నిందితులను అరెస్టు చేయించి జైలులో పెట్టించిన చరిత్ర మా ప్రభుత్వానిది...’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో ఆయనతో కలిసి బుధవారం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పాలనలో దళితులను వేధించిన కేసులు ఎన్నో ఉన్నా వాటిని ఆయన పట్టించుకున్న దాఖలాల్లేవు. అదే వైకాపా పాలనలో జరిగిన సంఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిజమైన వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు 40 మంది టచ్లో ఉన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిన మాటల్లో నిజం లేదన్నారు.
టోల్ రుసుముల పెంపు ఉపసంహరించుకోవాలి
ఏపీ లారీ యజమానుల సంఘం
ఈనాడు, అమరావతి: రవాణా రంగం సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలనుకున్న టోల్ రుసుముల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలని, అయిదేళ్లకోసారే వీటి పెంపుపై సమీక్ష జరిపేలా చూడాలని ఏపీ లారీ యజమానుల సంఘం కోరింది. లారీ యజమానులకు డీజిల్ తర్వాత ఎక్కువ ఖర్చయ్యేది టోల్ రుసుములకేనని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ లాజిస్టిక్ విధానంలో కేంద్రం.. రవాణా ఖర్చును 15 నుంచి 9 శాతానికి తగ్గించాలని చెప్పిందన్నారు. డీజిల్ రేటు, టోల్ రుసుములు తగ్గించకుండా రవాణా ఖర్చు ఎలా తగ్గించగలరో చెప్పాలని కోరారు.
31న 10 నిమిషాలు వాహనాలు నిలిపేసి టోల్ఫీజులపై నిరసన
ఈనాడు, అమరావతి: టోల్ రుసుముల పెంపును నిరసిస్తూ ఈ నెల 31న మధ్యాహ్నం 12 నుంచి 12.10 గంటల వరకు పది నిమిషాలపాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి నిరసన తెలపాలని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ మేరకు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) దేశవ్యాప్తంగా వాహన యజమానులకు ఇచ్చిన పిలుపునకు సంపూర్ణ మద్దతిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, వ్యక్తిగత వాహనదారులు, ఇతర వాహనాల యజమానులు ఈ నిరసనలో పాల్గొనాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం