ఏయ్‌.. నోరు మూసుకో!.. గోడు చెప్పుకొంటున్న రైతుపై మంత్రి కారుమూరి అసహసం

ఇటీవల ఓ రైతుపై దుర్భాషలాడిన పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన తీరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Updated : 09 May 2023 08:10 IST

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఇటీవల ఓ రైతుపై దుర్భాషలాడిన పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన తీరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఏలూరు జిల్లా ఉంగుటూరు, నాచుగుంటలో సోమవారం ఆయన పర్యటించారు. నాచుగుంటలో రైతులు తమ సమస్యలను మంత్రి వద్ద ఏకరవు పెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన మంత్రి ఓ రైతును ‘ఏయ్‌..నోరు మూసుకో’ అంటూ మండిపడ్డారు. మరో సందర్భంలో రైతులు ఆయనకు సమస్యలు చెబుతుండగా వీడియో చిత్రీకరిస్తున్న విలేకరులను ఆపాలంటూ చేతితో సైగ చేశారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు నాచుగుంటలో పర్యటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని