60 రోజుల్లో మంత్రివర్గ నిర్ణయాలు అమలు
ఉద్యోగులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60రోజుల్లోగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా చేస్తామని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించే ప్రభుత్వం తమదని వెల్లడించారు.
ఉద్యోగుల జీవన ప్రమాణాలు నిలబెట్టేలా జీపీఎస్ తీసుకొచ్చాం
సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ఉద్యోగులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60రోజుల్లోగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా చేస్తామని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించే ప్రభుత్వం తమదని వెల్లడించారు. కొత్తగా గ్యారెంటీ పింఛను స్కీం(జీపీఎస్) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిటీ ఏర్పాటు సహా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపేందుకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్ను ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘‘పెన్షన్ సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. విశ్రాంత ఉద్యోగుల జీవన ప్రమాణాలను నిలబెట్టేలా జీపీఎస్ను రూపొందించాం. బేసిక్ జీతంలో 50శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50వేలు పెన్షన్ వస్తుంది. 62ఏళ్లకు పదవీవిరమణ పొందితే 82ఏళ్లలోనూ అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని డీఆర్ ఇచ్చేలా జీపీఎస్లో పొందుపరిచాం. సీపీఎస్లో లేనివి జీపీఎస్లో ఉన్నాయి. రెండేళ్లపాటు జీపీఎస్పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది’’ అని తెలిపారు.
కోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకొని..
‘‘సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేశాం. ఉద్యోగులకు గరిష్ఠంగా మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లు వీరికి జీతాలు సమయానికి రావడం లేదు. పదవీవిరమణ తర్వాత ప్రయోజనాల్లోనూ వ్యత్యాసం ఉంది. వారికి మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులోనూ ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా.. మీ మోహంలో చిరునవ్వు ఉండేటట్లు చేస్తాం’’ అని పేర్కొన్నారు.
ఏపీ ఎన్జీఓ, ఐకాస ఎప్పుడూ అండగా ఉంటుంది
- బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు ఏపీ ఎన్జీఓ
కేంద్రం సహకరించకపోయినా.. ఏ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా పథకాలకు నిధులు ఇచ్చే బటన్ నొక్కుడు ఆగకుండా జరుగుతోంది. అది భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి. ఉద్యోగులు ఎప్పుడూ మన ప్రభుత్వానికి అండగా ఉంటారు. నిన్నటి నుంచి చూస్తున్నాం పాలాభిషేకాలు చేస్తున్నారు. మమ్మల్ని రమ్మంటుంటే మీరే చేయండని చెబుతున్నాం. ఏపీ ఎన్జీఓ, ఏపీ ఐకాస మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.
అడక్కుండానే పీఆర్సీ వేస్తామన్నారు
- శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎన్జీఓ
గతంలో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నా.. ఇప్పుడు మాతో పడని వారు సైతం ఉద్యమం ఎందుకు సిగ్గుపోతుందని అనేలా పరిస్థితి తీసుకువచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులు 10వేల మంది మిమ్మల్ని నిద్రలోనూ మర్చిపోరు. పీఆర్సీ కావాలంటే రోడ్డుపైకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అడక్కుండానే ఊహించని విధంగా సకాలంలో పీఆర్సీ వేస్తామన్నారు.
రుణపడి ఉంటాం
- రత్నాకర్ బాబు, అధ్యక్షుడు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం
క్రమబద్ధీకరణతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కాంట్రాక్టు ఉద్యోగులుగా జీవితం అంతమైపోతుందేమో అనుకున్నాం. తరతరాలకు రుణ పడి ఉంటాం.
హామీ మేరకు చేయకపోయినా ప్రత్యామ్నాయం తెచ్చారు
-వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం
సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ పాదయాత్రలో చెప్పినట్లు చేయకపోయినా ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు. పాత పెన్షన్ పథకం వారితో సమానంగా ప్రయోజనం కలిగేలా జీపీఎస్ తెచ్చారు. పూర్తిగా విధివిధానాలు బయటకు రాకపోవడంతో ఉద్యోగుల్లో అనుమానాలున్నాయి. ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు ప్రతి జిల్లా కేంద్రంలో 50ఎకరాలు ఇవ్వాలని సీఎంను కోరాం. గత పీఆర్సీలో మేము ఆశించింది జరగలేదు.
99శాతం హామీలు అమలు చేశాం
పేర్ని నాని, మాజీ మంత్రి
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. సీపీఎస్ను రద్దు చేసి, జీపీఎస్ను ప్రభుత్వం తీసుకువచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం