సంక్షిప్త వార్తలు (8)
వరుసగా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.1,000 కోట్లను సమీకరించబోతోంది.
మరో రూ.1,000 కోట్ల రుణం కోసం
ఈనాడు-అమరావతి: వరుసగా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.1,000 కోట్లను సమీకరించబోతోంది. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.500 కోట్ల చొప్పున రెండు విధాలుగా రుణం అవసరమని వర్తమానం పంపింది. రూ.500 కోట్లు 12 ఏళ్ల కాలపరిమితికి, మరో రూ.500 కోట్లు 15 ఏళ్ల కాలపరిమితితో అవసరమని తెలియజేసింది. జూన్ 13న ఈ రుణం ఖరారుకానుంది.
నేడు ‘కాంట్రాక్టు లెక్చరర్ల గోడు’ సమావేశం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న ప్రతి ఒప్పంద లెక్చరర్ను రెగ్యులరైజ్ చేయాలని, కేబినెట్లో తీసుకున్న ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలించాలనే డిమాండ్తో శనివారం విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమ్మరకుంట సురేష్, కల్లూరి శ్రీనివాస్ తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం.. కాంట్రాక్టు లెక్చరర్ల గోడు’ పేరుతో ఉదయం 9గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల ప్రచారం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరపత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ‘ఒత్తిడి లేని చదువు’, ‘మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర, వంద శాతం శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల నుంచి 3.90 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. మరో పక్క ఒకటో తరగతిలో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది.
ఎసైన్డ్ సాగు భూములు ఎవరి పరిధిలో ఉన్నాయి?
2003 ముందు, తరువాత పంపిణీ చేసిన వాటి యథాస్థితిపై ఆరా
ఈనాడు, అమరావతి: ఎసైన్డ్ సాగు భూములకు యాజమాన్య హక్కులు కల్పించే చర్యల్లో భాగంగా.. ప్రస్తుత వాటి యథాస్థితి తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 1954 తర్వాత పేదలకు పంపిణీ చేసిన ఎసైన్డ్ సాగు భూములపై సుమారు 20 ఏళ్ల కాల పరిమితి విధించి యాజమాన్య హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటోంది. ప్రతి మండల పరిధిలోని ఒక్కో గ్రామంలో 2003 ముందు, తరువాత ఎసైన్డ్ సాగు భూములు పొందిన వారు ఎంతమంది? ఎంత విస్తీర్ణం మేర పంపిణీ జరిగింది? వాటిని పొందిన వారే అనుభవిస్తున్నారా? వారసుల అధీనంలో ఉన్నాయా? ఒకవేళ చేతులు మారితే ఎంతమంది ఉన్నారన్న వివరాలు తెలియజేయాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ల నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని అన్ని మండల తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. గ్రామాల ఎంపిక బాధ్యతలను తహసీలార్లకు అప్పగించారు. దీని ప్రకారం.. తమ పరిధిలో ఎంపిక చేసిన గ్రామంలో ఎసైన్డ్ సాగు భూములు పొందిన వారి వివరాల రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఓ తహసీల్దార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన నమూనాలో వివరాలను నమోదు చేసి, ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తామని వెల్లడించారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గ్రామానికో సాగు న్యాయ నేస్తం
శిక్షణ ఇచ్చి నియమించాలని లీఫ్స్ సంస్థ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై సమగ్ర శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఒక సాగు న్యాయ నేస్తం వాలంటీరును నియమిస్తామని లీఫ్స్ స్వచ్ఛంద సంస్థ(లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, భూమి చట్టాల నిపుణుడు సునీల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు లేదా కౌలుదారుడు, సాగు చేస్తున్న గ్రామంలో నివాసం ఉంటున్న వారు, చదవడం, రాయడం వచ్చి ఉండి ఇతరులకు సహాయం చేయాలనే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 30లోపు 90002 22674 నంబరుకు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సందేహాలు ఉంటే ఇదే నంబరులో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు
మంత్రి విడదల రజిని
గుంటూరు(నగరంపాలెం), న్యూస్టుడే: ఆరోగ్యశ్రీ ద్వారా ఇక నుంచి గర్భిణులకు ఉచితంగా అల్ట్రా సౌండ్, టిఫా స్కానింగ్ సేవలు అందించనున్నట్లు మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు మంగళదాస్నగర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్, టిఫా స్కానింగ్ సేవలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 2.32 లక్షల కాన్పులు జరిగాయని, దీనికోసం ప్రభుత్వం రూ.247 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఆరోగ్య ఆసరా పథకం కోసం ఇప్పటి వరకు రూ.1,075 కోట్లు ఖర్చుచేసిందని వివరించారు. గుంటూరు జీజీహెచ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.
ఏపీఆర్జేసీ అధ్యాపకులకు అందని జీతాలు
ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రెండు నెలలుగా జీతాలు అందడం లేదు. బడ్జెట్ సమస్యతో జీతాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల విద్యాలయాల సంస్థకు నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తుండటంతో ప్రతిసారి ఈ సమస్య ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో 10 జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిల్లో అందరూ కలిపి 600మంది పని చేస్తున్నారు. గత ఆరు నెలలుగా రెండు, మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు.
రూ.54.60 కోట్ల విడుదలకు ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జలవనరులు జీవనాధార అభివృద్ధి పథకం రెండో దశలో చేపట్టిన పనులకు రూ.54.60 కోట్ల బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పనులకు బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆర్థికశాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వగా, అనంతరం జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం