సీఐడీ కస్టడీకి చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది.
రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించాలి
విచారణ సమయంలో వైద్య సదుపాయం కల్పించాలి
వీడియోలు, ఫొటోలు విడుదల చేయొద్దు
ఆదేశాలు జారీచేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం
ఈనాడు - అమరావతి
తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని సూచించింది. శని, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయాధికారి ఈ మేరకు తీర్పు వెలువరించారు. చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్కవర్లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొన్నారు. ‘‘విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని విచారణ కనిపించే దూరం వరకూ అనుమతించాలి. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామమివ్వాలి. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలి’’ అని తన ఆదేశాల్లో తెలిపారు. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి
సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించినప్పుడు సాక్షి కెమెరామన్, వీడియోగ్రాఫర్ చిత్రీకరించి వాటిని బయటకు విడుదల చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పత్రికల క్లిప్పింగ్లను న్యాయస్థానానికి సమర్పించారు. విచారణ వీడియోలు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయొద్దని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందినీ శత్పతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సమయంలో పాటించేలా సీఐడీని ఆదేశించాలని దమ్మాలపాటి విన్నవించగా... సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఐడీ విచారణ జరిగేటప్పుడు చంద్రబాబు తరఫున హాజరయ్యేందుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను న్యాయస్థానానికి సమర్పించారు. వీలును బట్టి వారిలో ఎవరో ఒకరు హాజరవుతారని న్యాయస్థానానికి చెప్పగా.. కోర్టు దానికి సమ్మతించింది. సీఐడీ తరఫున విచారణ జరిపే అధికారులు, మధ్యవర్తుల పేర్లను ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించారు.
హైకోర్టు తీర్పు తర్వాత..
తొలుత శుక్రవారం ఉదయం 11.15 గంటల సమయంలో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. అయితే క్వాష్ పిటిషన్పై మధ్యాహ్నం 1.30కి హైకోర్టు నిర్ణయం వెల్లడించనుందని దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ నిర్ణయం వెలువడ్డాకే కస్టడీ పిటిషన్పై ఆదేశాలు జారీ చేస్తానంటూ న్యాయాధికారి హిమబిందు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేశారు. హైకోర్టు తీర్పు తర్వాత.. సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలిచ్చారు.
బెయిల్ పిటిషన్, పీటీ వారంట్ల పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, ఇన్నర్ రింగ్రోడ్డు కేసు, ఫైబర్గ్రిడ్ కేసుల్లో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారంట్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై విచారణను శనివారం చేపట్టాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరగా.. సోమవారం చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద కోరారు. సోమవారమే బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి... ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చంద్రబాబును విచారించేందుకు 12 మందితో బృందం
న్యాయస్థానానికి వివరాలు సమర్పించిన సీఐడీ తరఫు న్యాయవాదులు
ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇచ్చినందున ఆయన్ను విచారించేందుకు 12 మందితో కూడిన బృందాన్ని సీఐడీ సిద్ధం చేసింది. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితోపాటు ఒక వీడియోగ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరఫు న్యాయవాదులు శుక్రవారం ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం.ధనుంజయుడు, వి.విజయ్భాస్కర్, ఎ.లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్లు ఎన్.ఎల్.వి.మోహన్కుమార్, వై.రవికుమార్, ఐ.శ్రీనివాసన్, సీహెచ్.సాంబశివరావు, ఏఎస్సై పి.రంగనాయకులు, కానిస్టేబుల్ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. -
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రామాణిక విద్యకు ఛార్జి మెమోలే పరిష్కారమా?
ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసి, ఛార్జిమెమో ఇవ్వడం ద్వారా విద్యారంగంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు
తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ (ట్విటర్)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. -
ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు మూడో బహుమతి
దేశ రాజధాని దిల్లీ ప్రగతిమైదాన్లో ఈనెల 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపారమేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ఫెయిర్- ఐఐటీఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన పెవిలియన్కు మూడో బహుమతి దక్కింది. -
కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప!
విద్యుత్ పంపిణీ సంస్థలకూ (డిస్కంలు) జగన్ ‘షాక్’ తప్పలేదు. ఈ ఏడాది జులై నాటికి వాటి నెత్తిన ప్రభుత్వం రూ.19 వేల కోట్ల కొత్త అప్పులు పెట్టింది. ఇప్పటికే డిస్కంలు నెలవారీ నిర్వహణ ఖర్చులకూ సతమతమవుతున్నాయి. -
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో అంచనాలకు మించి తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారుల అంచనా. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
స్మార్ట్మీటర్ల ఏర్పాటు.. మోదీ మెప్పుకోసమే
‘స్మార్ట్మీటర్ల ఏర్పాటును భాజపా పాలిత రాష్ట్రాలు సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోదీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్మీటర్లను బిగించడానికి సన్నాహాలు చేస్తోంది’ -
రాజధానిలో యథేచ్ఛగా రహదారుల విధ్వంసం
రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద రోడ్డు తవ్వుకుపోయిన దొంగలు.. -
పుడమితల్లికి సేవ.. లాభాల సాగుకు తోవ
ఏ పంటైనా సరే.. విత్తు దగ్గర నుంచి కోత వరకు కనీసం 60- 180 రోజుల సమయం పడుతుంది. అదే ప్రతివారం ఏదో ఒక పంట కోతకు వచ్చి ఆదాయం చేతికందితే ఎలా ఉంటుంది. అదే చేసి చూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నారాయణప్ప. -
పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. -
వచ్చామా.. చూశామా.. వెళ్లామా..!
ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన హడావుడిగా సాగింది. కొన్ని చోట్ల ఆయన పదేసి నిమిషాలపాటు మాత్రమే పరిశీలించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
పెద్దిరెడ్డి ఇలాకాలో భూసేకరణపై రైతుల మండిపాటు
విద్యుత్తు బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్కు తమ భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. -
వెలిగొండ గుండె మండుతోంది!
వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జలాశయంలో నీటిని నిలుపుతాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్యాకేజీ అందిస్తాం. -
డి-ఫార్మసీ(పాలిటెక్నిక్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. -
ఇటొస్తే.. ఇరుక్కున్నట్లే..!
గుంతల రహదారులు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రహదారుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
-
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?