దుష్టపాలనకు ఇక ముగింపే
‘ఐదేళ్ల వైకాపా పాలన విద్వేషం, విధ్వంసం, అరాచకం, అవినీతితో సాగింది. విసిగి వేసారిన రాష్ట్ర ఓటర్లు దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. రెండు చోట్లా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయం.
అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్
ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసానికి శ్రీకారం
వైకాపాతో కుమ్మక్కు కాదు.. అది ఫ్లోర్ మేనేజ్మెంట్
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది..
మా మూడు పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే
‘ఈనాడు’తో ముఖాముఖిలో పురందేశ్వరి
రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
‘ఐదేళ్ల వైకాపా పాలన విద్వేషం, విధ్వంసం, అరాచకం, అవినీతితో సాగింది. విసిగి వేసారిన రాష్ట్ర ఓటర్లు దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. రెండు చోట్లా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయం. కేంద్రం నుంచి కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండదండలుంటాయి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ‘నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు, బస్సు ఛార్జీలు పెరిగి పేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరిని కొత్త ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది’ అని వెల్లడించారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ‘ఈనాడు ప్రతినిధి’కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
విధ్వంసంతోనే పాలనకు శ్రీకారం విధ్వంసంతోనే రాష్ట్ర పాలనకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వమైనా పేదల అభివృద్ధిపై ఆలోచిస్తుంది. ఆ పనులకే ప్రాధాన్యమిస్తుంది. సీఎం జగన్ మాత్రం ప్రజావేదిక కూల్చివేతతో తన ధ్వంసరచనను ప్రారంభించారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాలను ఎత్తుకెళ్లారు. అంతర్వేదిలో రథం తగులబెట్టారు. పిఠాపురంలో ఆలయాలు ధ్వంసం చేసినప్పటికీ ఎక్కడా సరైన చర్యలు లేవు.
ఫ్యాన్ ఓవర్స్పీడే సమస్యలకు కారణం
వైకాపా దుర్మార్గ పాలనను చూసి ఒక్క పరిశ్రమా రాష్ట్రానికి రాలేదు. పెట్టుబడిదారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లిపోయారు.
పరిశ్రమలు రాక యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఇంట్లో ఉండే ఫ్యాన్కు ఒకటి నుంచి ఐదు నంబర్ల వరకు పెట్టగలుగుతాం. రాష్ట్రంలో పొరపాటున ఫ్యాన్కు 151 స్పీడు (అసెంబ్లీ స్థానాల గురించి ప్రస్తావిస్తూ) పెట్టడంతో ఇంటి పైకప్పు కూలి ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు! రైతులకు అండ లేదు.. మహిళలకు భద్రత లేదు. చెత్త సేకరణకూ పన్ను విధించిన చెత్త ప్రభుత్వమిది. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులపై వెళుతుంటే హాయిగా ఉంటుంది. రాష్ట్ర రహదారులపైకి మళ్లగానే అడుగు లోతు గుంతలతో గమ్యం చేరతామా? అనే భయం పుడుతుంది. అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇసుక, మద్యం, మైనింగ్ తదితర రంగాల్లో ఎక్కడాలేని దోపిడీకి వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు తెరతీశారు. ఇసుక తవ్వకాల వల్ల రాజమహేంద్రవరంలోని గామన్ వంతెన కూలిపోయే ప్రమాదమేర్పడింది. పలుచోట్ల పర్యావరణమూ దెబ్బతింటోంది. నాణ్యత లేని మద్యంతో పేదల ఆరోగ్యం దెబ్బతింటోంది.
మూడు పార్టీల మూలసిద్ధాంతం ఒక్కటే..
తెలుగుదేశం, జనసేన, భాజపా మూల సిద్ధాంతాలు ఒక్కటే. అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యం. వికసిత భారత్ భాజపా ధ్యేయం. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా జనసేనాని పవన్కల్యాణ్ తన గళం వినిపిస్తారు.
కేంద్రంపై తప్పు నెట్టేందుకు ప్రయత్నం
కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన హామీల్లో 93% వరకు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం నిర్మాణం వంటి విషయాల్లో జాప్యమవుతోంది. ఏపీలో కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే వైకాపా ప్రభుత్వం తామే ఏర్పాటు చేసుకుంటామని అడ్డుపడింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధం. విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు 52 ఎకరాలు అవసరమని ప్రతిపాదిస్తే ముంపు భూములు ఎవరైనా ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ముంపు భూములు నిర్మాణానికి అనుకూలంగా లేవని పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్లే రైల్వేజోన్ పట్టాలెక్కలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ వైకాపా మంత్రులు అవగాహన లేకుండా తప్పును కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ కాకుండా ఆదాయం పెంచే మార్గాలను ఆలోచిస్తున్నాం.
వైకాపాతో కుమ్మక్కు కాలేదు
ముఖ్యమైన బిల్లుల ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలతో వ్యవహరించే తీరు (ఫ్లోర్ మేనేజ్మెంట్)పై అపోహలు ఆపాదించవద్దు. వైకాపాతో మా పార్టీ ఎప్పుడూ కుమ్మక్కు కాలేదు. ఆర్టికల్ 371 వంటి బిల్లుల ఆమోదం విషయంలో ఫ్లోర్ మేనేజ్మెంట్ విధానంలో వ్యవహరించినంత మాత్రాన పార్టీలతో సఖ్యంగా ఉన్నట్టు అర్థం చేసుకుంటే ఎలా? ఇదే నిజమైతే.. మేము వైకాపా పాలనను ఎప్పుడూ ఎలా విమర్శిస్తాం? విమర్శించడం ఆపమని మా పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. మిత్రధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నాం. వైకాపా అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడటంతోపాటు పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం.
రాష్ట్ర ప్రగతిపై ఎన్డీయేకు స్పష్టత
వైకాపా ప్రలోభాలకు ఓటర్లు లొంగరన్న నమ్మకం మాకుంది. వారంతా రాష్ట్ర పాలనను చూసి విసిగిపోయారు. పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్డీయే అధిక స్థానాలు దక్కించుకుంటుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై మాకు స్పష్టత ఉంది. ఓటింగ్ శాతం నమోదుతో సంబంధం లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. డిజైన్ లోపం, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆగిన పోలవరాన్ని పూర్తిచేసేందుకు సహకరిస్తాం. రాష్ట్రంపై అప్పుల భారాన్ని తగ్గిస్తాం. ఆదాయ మార్గాలను పెంచుతాం.
రాజధానిలేని రాష్ట్రం.. జగన్కే అపకీర్తి
అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణిలో మూడు రాజధానులని ప్రకటించి ప్రాంతాలవారీగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించిన ఘనత జగన్రెడ్డికే సొంతం. రాజధాని అమరావతి అభివృద్ధికి తొలి నుంచి కేంద్రం కట్టుబడి ఉంది. నిధులనూ మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. భూములను త్యాగం చేసిన రైతుల ఉసురు పోసుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఎన్డీయే ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగానే సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అనంతపురం నుంచి అమరావతి వరకు రోడ్డు అనుసంధానం, విజయవాడలో అవుటర్ రింగ్రోడ్డు నిర్మాణానికి నిధులనూ కేటాయించింది. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద, భవానీపురం ఫ్లైఓవర్ నిర్మాణాలనూ కేంద్రం చేపట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్