Vijaysai Reddy: సీబీఐ కేసున్నా.. విజయసాయిని విచారించొచ్చు
జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ కేసుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విచారణకు సంబంధంలేదని ఆ సంస్థ మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
ప్రత్యామ్నాయాలు ఉండగా నేరుగా పిటిషన్ చెల్లదు
తెలంగాణ హైకోర్టుకు ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంఘం నివేదన
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన ఎంపీ వి.విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ కేసుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విచారణకు సంబంధంలేదని ఆ సంస్థ మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా విజయసాయిరెడ్డి ప్రవర్తన, చర్యలకు సంబంధించిన శాఖాపరమైన విచారణ మాత్రమేనని, సీబీఐ కేసు పెండింగ్లో ఉన్నంత మాత్రాన దాని ప్రభావం ఈ విచారణపై ఉండదని పేర్కొంది. అందు(వల్ల సీబీఐ కేసు తేలేదాకా ఐసీఏఐ విచారణను కొనసాగించరాదన్న వాదన సరికాదని పేర్కొంది. వై.ఎస్.జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని, జగన్ కంపెనీలకు దురుద్దేశపూరితంగా సహకరించారని, ఇది సీఏగా ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేనని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐసీఏఐ సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరుకావాలంటూ గత ఏడాది అక్టోబరు 23న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారణ చేపట్టారు. ఐసీఏఐ తరఫు సీనియర్ న్యాయవాది ఎం.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ జగతి పబ్లికేషన్స్ ప్రమోటర్ డైరెక్టర్గా, షేర్ హోల్డర్గా చేపట్టిన చర్యలతో ఐసీఏఐకి సంబంధం లేదన్న వాదన సరికాదన్నారు. ఐసీఏఐ సంస్థకు మచ్చ తెచ్చే ఏ వ్యవహారంపై అయినా చర్యలు తీసుకునే అధికారం ఐసీఏఐకి ఉందని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు.
చెన్నై కేంద్రంగానే కార్యకలాపాలు
ఐసీఏఐ రిజిస్టర్డ్ కార్యాలయం చెన్నైలో ఉందని అందువల్ల ఏదైనా అభ్యంతరాలుంటే చెన్నై హైకోర్టులో తేల్చుకోవాల్సి ఉందంటూ సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. చెన్నై సంస్థ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిందని, సాయిరెడ్డి కూడా చెన్నై కేంద్రంగానే సమాధానం ఇచ్చారన్నారు. ఐసీఏఐ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉందని, అందువల్ల దిల్లీ లేదంటే చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని, అధికరణ 226 కింద ఈ హైకోర్టులో పిటిషన్ వేయడానికి వీల్లేదన్నారు. ఈ కోర్టుకు పరిధి లేనందున ప్రాథమిక దశలోనే పిటిషన్ను కొట్టివేయాల్సి ఉందన్నారు. విజయసాయిరెడ్డిపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఆయన వివరణ ఇచ్చాక తదుపరి చర్యలుంటాయని తెలిపారు. వివరణతో సంతృప్తి చెందకపోతే వృత్తిపరంగా ఏదైనా దుష్ప్రవర్తనకు సాయిరెడ్డి పాల్పడి ఉన్నట్లైతే తదుపరి విచారణ ఉంటుందన్నారు. ఒకవేళ ఆరోపణలు రుజువైన పక్షంలో చర్యలు తీసుకునేముందు కూడా ఐసీఏఐ షోకాజ్ నోటీసు జారీ చేస్తుందన్నారు. ఈ అన్ని దశల్లోనూ అక్కడే అప్పీలు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా అప్పీలెట్ అథారిటీ ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించరాదంటూ కోల్కతా, మద్రాస్ హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి