NV Ramana: రాజ్యాంగానికి విధేయులుగా ఉండండి... వ్యక్తులకు కాదు
‘‘ఎవరైనా రాజ్యాంగం, చట్టాలకు విధేయంగా ఉండాలి తప్పితే వ్యక్తులకు కాదు. మీరు నిజాయితీగా నిలబడితే, మీ ధైర్యసాహసాలు, సిద్ధాంతాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి.
రాజకీయ నేతలు మారతారు.. కానీ మీరు శాశ్వతం
సీబీఐ అధికారులకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సూచన
డీపీ కోహ్లీ స్మారకోపన్యాసంలో కీలక వ్యాఖ్యలు
దర్యాప్తు సంస్థలను ఒకే స్వతంత్రవ్యవస్థ కిందికి తీసుకురావాలన్న సీజేఐ
ఈనాడు, దిల్లీ: ‘‘ఎవరైనా రాజ్యాంగం, చట్టాలకు విధేయంగా ఉండాలి తప్పితే వ్యక్తులకు కాదు. మీరు నిజాయితీగా నిలబడితే, మీ ధైర్యసాహసాలు, సిద్ధాంతాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. రాజకీయ కార్యనిర్వాహకులు కాలంతో మారిపోతుంటారు. కానీ వ్యవస్థగా మీరు శాశ్వతంగా ఉంటారు. అందువల్ల అభేద్యంగా, స్వతంత్రంగా ఉండండి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో జరిగిన 19వ డీపీ కోహ్లి స్మారకోపన్యాసంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. సంస్థాగతంగా రావాల్సిన మార్పులపై దిశానిర్దేశం చేశారు. సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను ఒకే వ్యవస్థ కిందికి తీసుకొస్తూ కొత్త చట్టం తీసుకురావాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థ తరహాలోనే ఇది స్వతంత్రంగా, స్వయంప్రతిపత్తితో పనిచేసేలా చూడాలన్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడండి
‘‘మనలాంటి సమ్మిళిత సమాజానికి ప్రజాస్వామ్యమే అత్యుత్తమైందని నిరూపితమైంది. భారతీయులుగా మనం స్వేచ్ఛను ప్రేమిస్తాం. దాన్ని లాగేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చైతన్యవంతమైన మన పౌరసమాజం నియంతలనుంచి అధికారాన్ని వెనక్కు లాక్కోవడానికి ఏమాత్రం వెనుకంజవేయదు. అందువల్ల పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రజాస్వామ్య విలువలను కాపాడటం అత్యంత ముఖ్యం. నిరంకుశపోకడలు పెరిగిపోవడానికి అనుమతివ్వకూడదు. తప్పనిసరిగా రాజ్యాంగంలో రూపొందించిన ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి పనిచేయాలి. పోలీసు, దర్యాప్తు సంస్థలకు చట్టబద్ధత ఉండొచ్చు. అయితే వ్యవస్థలుగా అవి సామాజిక చట్టబద్థతను పెంపొందించుకోవాల్సి ఉంది.
ఒకప్పుడు సీబీఐపై ఎంతో నమ్మకం
తొలినాళ్లలో సీబీఐ పట్ల ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. నిష్పాక్షికత, స్వతంత్రతకు అది చిహ్నం అన్న ఉద్దేశంతో కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయవ్యవస్థ ముందుకు కేసుల ప్రవాహంలా వచ్చేవి. కాలం గడిచేకొద్దీ మిగిలిన సంస్థల్లానే సీబీఐ మారిపోయింది. దాని విశ్వసనీయత పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కష్టకాలంలో ప్రజలు పోలీసులను ఆశ్రయించడానికి సంకోచించడం బాధాకరం. అవినీతి, నిష్పాక్షికత లోపించడం, రాజకీయవర్గాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలాంటి విమర్శల కారణంగా పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతింది.
రాజకీయ వ్యవస్థతో సాన్నిహిత్యం వీడండి
ప్రభుత్వాలు మారిన తర్వాత తమను వేధిస్తున్నారంటూ తరచూ అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న సందర్భాలున్నాయి. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉన్న వారికి దగ్గరకావాలని ప్రయత్నిస్తారో అప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలనూ ఎదుర్కోకతప్పదు. ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిందల్లా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవడమే. అది జరగాలంటే తొలుత రాజకీయ వ్యవస్థతో సాన్నిహిత్యాన్ని తెగదెంపులుచేసుకోవాలి. నిజాయితీపరులైన అధికారులు కొందరున్నా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావొచ్చు. అందువల్ల ప్రవాహంలోపడి కొట్టుకుపోవడమా? లేదంటే పదుగురికి ఆదర్శంగా నిలవడమా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. భారతీయ న్యాయవ్యవస్థపై వివిధ అంశాలు ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ దానిపై విశ్వాసం ఉంచుతున్నారు. అందుకు కారణం దానికి స్వయంప్రతిపత్తి, రాజ్యాంగం, చట్టాలపట్ల ఉన్న నిబద్ధతే. అందువల్ల ఒక స్వతంత్ర ఛత్రచాయ వ్యవస్థను ఏర్పాటుచేసి దాని పరిధిలోకి సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ, ఈడీలాంటివన్నింటినీ తీసుకురావాలి. వాటి విధులు, అధికారాలు, పరిధిని స్పష్టంగా నిర్దేశిస్తూ చట్టం చేయాలి. ఇలాంటి స్వతంత్ర, నిష్పాక్షిక వ్యవస్థకు నేతృత్వం వహించే వారిని కూడా సీబీఐ డైరెక్టర్ తరహాలోనే ప్రత్యేక కమిటీ ద్వారా నియమించాలి. ఇలాంటి ఒకే ఛత్రచాయ వ్యవస్థవల్ల బహుళ అధికార ప్రక్రియలకు ముగింపు పలకడానికి వీలవుతుంది’’ అని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు