Axis Bank-Citibank: యాక్సిస్ బ్యాంక్ -సిటీ బ్యాంక్ డీల్ పూర్తి.. కస్టమర్ల పరిస్థితేంటి?
Axis Bank-Citibank deal: సిటీ బ్యాంక్ తన భారత వ్యాపారం కొనుగోలును యాక్సిస్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇకపై సిటీ బ్యాంక్ కార్యకలాపాలన్నీ యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నాయి. మరి ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులుంటాయ్?
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిటీ గ్రూప్నకు చెందిన సిటీ బ్యాంక్ (Citibank) తన భారత్ కన్జ్యూమర్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్కు (Axis Bank) విక్రయించింది. గతేడాది మార్చిలో ఈ డీల్ను ప్రకటించగా... సరిగ్గా ఏడాది తర్వాత ఈ డీల్ పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి (మార్చి 1 నుంచి) సిటీ బ్యాంక్ తాలుకా హోమ్లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు, సేవింగ్స్ ఖాతాలు వంటి వ్యాపారాలన్నీ యాక్సిస్ బ్యాంక్ నియంత్రణలోకి రానున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు యాక్సిస్ బ్యాంక్కు ఈ డీల్ ఉపయోగపడుతుంది. అసలేంటీ డీల్? యాక్సిస్ పరిధిలోకి ఏమేం రానున్నాయి? కస్టమర్ల విషయంలో వచ్చే మార్పులేంటి?
1902లో కోల్కతా కేంద్రంగా సిటీ గ్రూప్ భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. 1985లో కన్జూమర్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. వందేళ్లకు పైగా సేవలను అందించిన ఈ సంస్థ.. గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా తన భారత్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించింది. భారత్ సహా 13 దేశాల్లో కార్యకలాపాలను మూసివేయనున్నట్లు 2021లోనే ప్రకటించింది. రిటైల్ బ్యాంకింగ్ నుంచి తప్పుకొని పూర్తిగా వెల్త్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ డీల్..
సిటీ గ్రూప్ నిర్ణయం మేరకు భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకొచ్చింది. వినియోగదారుల వ్యాపారం సహా కవరింగ్ లోన్స్, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్, రిటైల్ బ్యాంక్ వ్యాపారాన్ని దాదాపు రూ.11,600 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీంతో సిటీ బ్యాంక్ చెందిన 3,500 మంది ఉద్యోగులు యాక్సిస్ పరిధిలోకి రానున్నారు. అలాగే 18 నగరాల్లో ఉన్న సిటీ గ్రూప్నకు చెందిన ఏడు కార్యాలయాలు, 21 బ్రాంచ్లు, 499 ఏటీఎంలు యాక్సిస్ బ్యాంక్ చేతికి దక్కనున్నాయి. 30 లక్షల యూజర్లతో పాటు సుమారు 25 లక్షల సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నారు. యాక్సిస్కు వ్యాపారాన్ని విక్రయించిన అనంతరం కూడా సిటీ ఉత్పత్తులు/ సేవలను, బ్రాంచులను, ఏటీఎంలను, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సిటీ మొబైల్ యాప్ను యథావిధిగా వినియోగించుకోవచ్చని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు తెలియజేసింది. మార్చి 1 నుంచి యాజమాన్యాన్ని యాక్సిస్కు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ మార్పులు..
- సిటీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నంబర్లు, చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లలో ఎలాంటి మార్పూ ఉండదు. ఎప్పటిలానే కొనసాగుతాయి.
- సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, సిటీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటిలానే పనిచేస్తాయి. క్రెడిట్, డెబిట్ కార్డు రివార్డు పాయింట్లు సైతం ఎప్పటిలానే ఉంటాయి.
- సిటీ ఇండియా ద్వారా ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే ఆ సేవలను ఇకపై యాక్సిస్ అందిస్తుంది.
- సిటీ బ్యాంక్ వినియోగదారులు ఇకపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. సిటీ బ్యాంక్ ఏటీఎంల్లో ఉన్న ఉచిత లావాదేవీ పరిమితులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంల్లోనూ కొనసాగుతాయి. పరిమితి దాటిన తర్వాత ఛార్జీలు వర్తిస్తాయి.
- సిటీబ్యాంక్ ఎన్నారై డిపాజిట్లపై పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొత్త డిపాజిట్లకు మాత్రం యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
- ఎవరైనా సిటీ బ్యాంక్ హోమ్లోన్ తీసుకున్నా (ప్రైమ్ లెండింగ్ రేట్, బేస్ రేట్, మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్) ఎలాంటి మార్పూ ఉండదు. ఏదైనా అప్డేట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ తెలియజేస్తుంది.
- సిటీ గోల్డ్ పేరిట గ్లోబల్ బ్యాంకింగ్ ప్రివిలేజెస్ మాత్రం ఇకపై కొనసాగవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు