Axis Bank-Citibank: యాక్సిస్ బ్యాంక్ -సిటీ బ్యాంక్ డీల్ పూర్తి.. కస్టమర్ల పరిస్థితేంటి?
Axis Bank-Citibank deal: సిటీ బ్యాంక్ తన భారత వ్యాపారం కొనుగోలును యాక్సిస్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇకపై సిటీ బ్యాంక్ కార్యకలాపాలన్నీ యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నాయి. మరి ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులుంటాయ్?
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిటీ గ్రూప్నకు చెందిన సిటీ బ్యాంక్ (Citibank) తన భారత్ కన్జ్యూమర్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్కు (Axis Bank) విక్రయించింది. గతేడాది మార్చిలో ఈ డీల్ను ప్రకటించగా... సరిగ్గా ఏడాది తర్వాత ఈ డీల్ పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి (మార్చి 1 నుంచి) సిటీ బ్యాంక్ తాలుకా హోమ్లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు, సేవింగ్స్ ఖాతాలు వంటి వ్యాపారాలన్నీ యాక్సిస్ బ్యాంక్ నియంత్రణలోకి రానున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు యాక్సిస్ బ్యాంక్కు ఈ డీల్ ఉపయోగపడుతుంది. అసలేంటీ డీల్? యాక్సిస్ పరిధిలోకి ఏమేం రానున్నాయి? కస్టమర్ల విషయంలో వచ్చే మార్పులేంటి?
1902లో కోల్కతా కేంద్రంగా సిటీ గ్రూప్ భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. 1985లో కన్జూమర్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. వందేళ్లకు పైగా సేవలను అందించిన ఈ సంస్థ.. గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా తన భారత్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించింది. భారత్ సహా 13 దేశాల్లో కార్యకలాపాలను మూసివేయనున్నట్లు 2021లోనే ప్రకటించింది. రిటైల్ బ్యాంకింగ్ నుంచి తప్పుకొని పూర్తిగా వెల్త్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ డీల్..
సిటీ గ్రూప్ నిర్ణయం మేరకు భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకొచ్చింది. వినియోగదారుల వ్యాపారం సహా కవరింగ్ లోన్స్, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్, రిటైల్ బ్యాంక్ వ్యాపారాన్ని దాదాపు రూ.11,600 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీంతో సిటీ బ్యాంక్ చెందిన 3,500 మంది ఉద్యోగులు యాక్సిస్ పరిధిలోకి రానున్నారు. అలాగే 18 నగరాల్లో ఉన్న సిటీ గ్రూప్నకు చెందిన ఏడు కార్యాలయాలు, 21 బ్రాంచ్లు, 499 ఏటీఎంలు యాక్సిస్ బ్యాంక్ చేతికి దక్కనున్నాయి. 30 లక్షల యూజర్లతో పాటు సుమారు 25 లక్షల సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నారు. యాక్సిస్కు వ్యాపారాన్ని విక్రయించిన అనంతరం కూడా సిటీ ఉత్పత్తులు/ సేవలను, బ్రాంచులను, ఏటీఎంలను, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సిటీ మొబైల్ యాప్ను యథావిధిగా వినియోగించుకోవచ్చని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు తెలియజేసింది. మార్చి 1 నుంచి యాజమాన్యాన్ని యాక్సిస్కు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ మార్పులు..
- సిటీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నంబర్లు, చెక్బుక్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లలో ఎలాంటి మార్పూ ఉండదు. ఎప్పటిలానే కొనసాగుతాయి.
- సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, సిటీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటిలానే పనిచేస్తాయి. క్రెడిట్, డెబిట్ కార్డు రివార్డు పాయింట్లు సైతం ఎప్పటిలానే ఉంటాయి.
- సిటీ ఇండియా ద్వారా ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే ఆ సేవలను ఇకపై యాక్సిస్ అందిస్తుంది.
- సిటీ బ్యాంక్ వినియోగదారులు ఇకపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. సిటీ బ్యాంక్ ఏటీఎంల్లో ఉన్న ఉచిత లావాదేవీ పరిమితులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంల్లోనూ కొనసాగుతాయి. పరిమితి దాటిన తర్వాత ఛార్జీలు వర్తిస్తాయి.
- సిటీబ్యాంక్ ఎన్నారై డిపాజిట్లపై పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొత్త డిపాజిట్లకు మాత్రం యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
- ఎవరైనా సిటీ బ్యాంక్ హోమ్లోన్ తీసుకున్నా (ప్రైమ్ లెండింగ్ రేట్, బేస్ రేట్, మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్) ఎలాంటి మార్పూ ఉండదు. ఏదైనా అప్డేట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ తెలియజేస్తుంది.
- సిటీ గోల్డ్ పేరిట గ్లోబల్ బ్యాంకింగ్ ప్రివిలేజెస్ మాత్రం ఇకపై కొనసాగవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె