Demat accounts: కొత్త డీమ్యాట్ ఖాతాలు తగ్గాయ్.. కారణాలు ఇవేనా?
Demat accounts: కరోనా సమయంలో విపరీతంగా తెరుచుకున్న డీమ్యాట్ ఖాతాలు.. ఇప్పుడిప్పుడు తగ్గుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది?
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి అనంతరం స్టాక్ మార్కెట్లో (Stock market) పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారి సంఖ్య ఎప్పుడూలేని స్థాయికి చేరింది. దీంతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య భారీ స్థాయిలో వృద్ధి చెందింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి, ఐపీఓలు క్యూ కట్టడం ఇందుకు నేపథ్యం. కానీ, పరిస్థితి ఇప్పుడు మారింది. డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఏప్రిల్ నెలలో ఈ సంఖ్య 2020 డిసెంబర్ తర్వాత తొలిసారి ఆ స్థాయికి చేరింది. ఇంతకీ ఎందుకీ పరిస్థితి?
దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో మన మార్కెట్లు (Stock market) ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. తర్వాత పుంజుకున్నాయి. కరోనాతో వర్క్ఫ్రమ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం స్టాక్ మార్కెట్ వైపు చూడడం మొదలు పెట్టారు. స్టాక్ మార్కెట్పై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం మార్కెట్లోకి ప్రవేశించారు. దీనికి తోడు కొత్త తరం టెక్ కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్లోకి రావడం విపరీతంగా యువతరాన్ని ఆకర్షించాయి. దీంతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు (Demat accounts) తెరిచే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2020 డిసెంబర్లో 10 లక్షలు ఉండగా.. 2021 అక్టోబర్లో గరిష్ఠంగా 35 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటున 29 లక్షలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల చొప్పున లక్షలు చొప్పున ఖాతాలు ఓపెన్ అయ్యాయి. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఏప్రిల్ నెలలో కనిష్ఠంగా 16 లక్షలకు చేరింది. 2020 డిసెంబర్ తర్వాత ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి.
ఎందుకిలా.?
కొత్త డీమ్యాట్ ఖాతాలు సంఖ్య తగ్గడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మునుపటిలా ఆకర్షణీయ ఐపీఓలు లేకపోవడం, మార్కెట్లో ఒడుదొడుకులు, స్మాల్, మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో రాబడులు లేకపోవడం ఇందుకు కారణమని చెప్తున్నారు. గతంలో కొత్తగా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన వారు ఐటీ సెక్టార్ షేర్లపై ఆసక్తి చూపే వారు. గత కొంతకాలంగా ఐటీ సెక్టార్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో మదుపరుల్లో ఆసక్తి సన్నగిల్లిందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు వర్క్ఫ్రమ్ హోమ్లు తగ్గుముఖం పట్టడం వల్ల ట్రేడింగ్ చేసే సమయం ఉండడం లేదు. ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారడమూ ఒక కారణం. దీంతో మార్కెట్లవైపు వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నది విశ్లేషకుల మాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?