సరైన విలువలోనే భారత మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తున్న వేళ, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.
మార్కెట్ విలువ, జీడీపీ నిష్పత్తి భేష్
వారెన్ బఫెట్ నమ్మే సూత్రమిదే
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తున్న వేళ, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. ఎమ్ఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో దేశ వెయిటేజీ పెరగడానికి తోడు, ఎప్పటి నుంచో ఇందులో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉన్న చైనాను వెనక్కి నెట్టడం మరో విశేషం. భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడంతో.. స్టాక్ మార్కెట్ సెంటిమెంటు సానుకూలంగా మారడం హేతుబద్ధమేనని విశ్లేషకులు అంటున్నారు.
సందేహాలు ఎందుకంటే..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు అంతర్జాతీయ సంస్థలు తగ్గించాయి. అయినా కూడా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది మన దేశంలోనే. 2022-23లో జీడీపీ వృద్ధి 7 శాతం నమోదు కావొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇతర సంస్థల అంచనాలు దీని కంటే తక్కువగా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా సరికొత్త గరిష్ఠాలకు దూసుకెళ్తున్న స్టాక్మార్కెట్లను చూస్తే, ఆర్థిక వ్యవస్థలోని వాస్తవ మందగమనాన్ని స్టాక్ మార్కెట్లు గుర్తించడం లేదా అనిపించొచ్చు.
ఇది కీలకం: ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ మార్కెట్ల విషయంలో నమ్మే ఒక అంశాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్ విలువకు, వాస్తవ జీడీపీకి నిష్పత్తిని పరిశీలిస్తే.. 100 శాతం వద్ద ఉన్న ఏ మార్కెట్ అయినా.. సరైన విలువలోనే ఉన్నట్లు లెక్క. 100 శాతం లోపు ఉంటే, కొనుగోళ్లకు అవకాశాలున్నట్లే. భారత్ విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్ విలువ, 2022-23 వాస్తవ జీడీపీ అంచనాల నిష్పత్తిని చూస్తే 100.13 శాతంగా ఉంది. ఈ నిష్పత్తి విషయంలో చైనా, జర్మనీ కంటే చాలా ఎత్తులో భారత్ ఉండగా..మన కంటే అమెరికా, జపాన్ మెరుగ్గా కనిపిస్తున్నాయి.
* అయితే.. ఎగుమతులు బాగా క్షీణించినా.. విదేశీ మూలధనం తరలిపోయినా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా.. పరిస్థితుల్లో కొంత మార్పులు రావొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!