Smart TV: స్మార్ట్ టీవీకి పండగే
దసరా -దీపావళి పండగ సీజన్లో సాధారణంగానే టీవీల అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి.
ఈసారి అత్యధిక అమ్మకాలు ఇవే
కలిసొస్తున్న బ్రాడ్బ్యాండ్- ఓటీటీ పథకాలు
పోటాపోటీగా బ్రాండ్ల రాయితీలు
ఈనాడు వాణిజ్య విభాగం
దసరా -దీపావళి పండగ సీజన్లో సాధారణంగానే టీవీల అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి. ఈసారి క్రికెట్ ప్రపంచకప్ పోటీలూ ఇప్పుడే నిర్వహిస్తుండటంతో టీవీల కొనుగోళ్లు మరింత జోరుగా సాగుతున్నాయని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఎల్ఈడీల్లో స్మార్ట్మోడళ్ల విక్రయాలే అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఆన్లైన్లో ప్రత్యేకంగా కొన్ని బ్రాండ్లు భారీ రాయితీలు ఆఫర్ చేస్తుండగా, మరికొన్ని దిగ్గజ బ్రాండ్లు సంప్రదాయ విక్రయశాలలతో పాటు ఆన్లైన్లోనూ రాయితీలిస్తున్నాయి. టెలికాం నెట్వర్క్ సంస్థలు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ పథకాలను ఆవిష్కరించడం, ఓటీటీ ప్లాట్ఫామ్లపై అతి తక్కువ సమయంలోనే కొత్త సినిమాలు ప్రసారమవుతుండటం వల్ల స్మార్ట్టీవీల కొనుగోలుకు గ్రామీణులూ మొగ్గుచూపుతున్నారు.
గత కొన్నేళ్లుగా టీవీ అమ్మకాల వృద్ధిలో స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది మాత్రం స్వాతంత్య్ర దినోత్సవంతో మొదలుకుని ఓనమ్, వినాయక చవితి, రాబోయే దసరా-దీపావళితో పాటు నూతన సంవత్సర వేడుకల వరకు టీవీల అమ్మకాలు బాగుంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. 4కే రిజొల్యూషన్తో స్మార్ట్టీవీలో చిత్ర స్పష్టతను ఆస్వాదించేందుకు హోమ్ బ్రాడ్బ్యాండ్ పథకాలు ఉపయోగ పడుతున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ప్రారంభించిన 5జీ సేవలతో పాటు వైర్లెస్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సేవలతో నెట్ వేగం 30-1000 ఎంబీపీఎస్ వరకు లభిస్తున్నందున, స్మార్ట్టీవీలపై ప్రజలు మొగ్గుచూపుతున్నారని షియామీ ఇండియా అధిపతి బి.మురళీకృష్ణన్ తెలిపారు. తెలుగులోనూ ఓటీటీ ప్లాట్ఫామ్ల జోరు పెరగడం స్మార్ట్ టీవీలకు గిరాకీ పెంచుతోంది.
రూ.50,000లోపే 65 అంగుళాల టీవీలూ
ఇంటర్నెట్ వేగం పెరగడం వల్ల, 4కే స్పష్టతతో-55 అంగుళాలు, అంతకుమించిన పెద్ద తెరలపై ప్రసారాలు వీక్షించడం అధికమవుతోంది. ఇప్పుడు 32 అంగుళాల స్మార్ట్ టీవీలను రూ.10,000 కంటే తక్కువకే ఏసర్, షియామీ, వీడబ్ల్యూ, టీసీఎల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎల్జీ కూడా రూ.12,000 శ్రేణి నుంచీ ఆన్లైన్ మోడళ్లు అందిస్తోంది. థామ్సన్ బ్రాండ్ అయితే 43 అంగుళాల క్యూఎల్ఈడీ టీవీని రూ.20,999కి, 55 అంగుళాల టీవీని రూ.30,999, 65 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీని రూ.47,999కే అందిస్తోంది.
91 శాతం ఇవే: దేశీయంగా ఏడాదికి 1.10 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. ఇందులో 91 శాతం స్మార్ట్ మోడళ్లే ఉంటున్నాయి. ఇందులోనూ షియామీ, శామ్సంగ్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయని అంచనా. ఇవి రెండూ ఆన్లైన్తో పాటు సంప్రదాయ విక్రయశాలల్లోనూ తమ ఉత్పత్తులను అమ్ముతున్నాయి. 5 అంతర్జాతీయ బ్రాండ్లు థామ్సన్, కొడాక్, బ్లాపన్ట్, వైట్ వెస్టింగ్హౌస్, వెస్టింగ్హౌస్ టీవీలను దేశీయంగా తయారు చేసి కేవలం ఆన్లైన్లోనే విక్రయిస్తున్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ కూడా రెండేళ్లలో స్మార్ట్టీవీ విపణిలో 8% వాటా సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 7 లక్షల స్మార్ట్టీవీలు తయారు చేస్తున్నామని, ఉత్తర ప్రదేశ్లో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే ఏడాదికి 20 లక్షల టీవీలు తయారు చేయగలమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.2000 కోట్లకు చేరుతుందనే అంచనాను ఆయన వ్యక్తం చేశారు. 2022-23లో 4.50 లక్షల స్మార్ట్ీవీల విక్రయంపై రూ.700 కోట్ల టర్నోవర్ సాధించామన్నారు. ప్రస్తుత పండగ సీజన్లోనే 4 లక్షల టీవీలు అమ్మగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమ టీవీలన్నీ ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!