కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు.
ఏఐలో 50,000 మందికి శిక్షణ ఇస్తున్నాం
2024-25పై ఆశావహంగానే ఉన్నాం
3-5% ఆదాయ వృద్ధి అంచనా
హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్
దిల్లీ: జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ విభాగంలో 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. క్లౌడ్, జెన్ఏఐ ప్రాజెక్టులు పెరుగుతున్నా, ఆర్థిక సేవల విభాగంలో మాత్రం ఇబ్బందులు ఎదురుకావొచ్చని ఆయన తెలిపారు. వివిధ అంశాలపై ఆయనేమన్నారంటే..
పరిస్థితులను బట్టే నియామకాలు: మంచి ఆదాయ వృద్ధి రేటు(5.4%) కారణంగా మార్చి త్రైమాసికంలో 2700 మంది ఉద్యోగులు జతయ్యారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయి. ఇప్పటికైతే కనీసం 10,000 మంది తాజా ఉత్తీర్ణుల(ఫ్రెషర్లు)ను తీసుకోవాలని భావిస్తున్నాం. ఆపైన ఎంత మందిని నియమించుకుంటామన్నది పరిస్థితులే నిర్ణయిస్తాయి. జెన్ ఏఐ అవకాశాల కోసం కంపెనీ సిద్ధంగా ఉంది. 2000 మందికి పైగా ఏఐ డెవలపర్లనూ తీసుకున్నాం.
ఆర్థిక సేవల విభాగంపై ఒత్తిడి: కంపెనీల ఐటీ వ్యయాలు 2023-24 తరహాలోనే 2024-25లోనూ స్తబ్దుగానే కొనసాగొచ్చు. మాకు లభించిన ఆర్డర్లు బాగున్నందున, వృద్ధికి కచ్చితంగా సహాయపడతాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.15,702 కోట్ల నికర లాభం (5.7% వృద్ధి), రూ.1,09,913 కోట్ల ఆదాయం (8.3% వృద్ధి) నమోదు చేసింది. 2024-25లో ఆదాయ వృద్ధి 3-5% ఉండొచ్చని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర కంపెనీలో పోలిస్తే ఇదే అత్యధిక ఆదాయ వృద్ధి అంచనాగా భావించొచ్చు. జెన్ఏఐ ఆధారిత సైబర్ భద్రత, డేటా, క్లౌడ్ ఇమిగ్రేషన్, ప్రైవేటు ఏఐ స్టాక్ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ, టెలికాం, మీడియా విభాగాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఆర్థిక సేవల్లో మాత్రం కొంత సమస్యలు కనిపిస్తున్నాయి.
కొనుగోళ్లకు సిద్ధం: బలమైన వార్షిక ఆదాయాలు, క్లయింట్లను అందించగల సెమీకండక్టర్, ఆటోమోటివ్ ప్లాట్ఫారాలను కొనుగోలు చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కొన్ని త్రైమాసికాల కిందట ఆటోమోటివ్ రంగంలో కొనుగోలు చేశాం. ఇక సెమీకండక్టర్, ఇతరత్రా విభాగాల్లో చిన్న పాటి కొనుగోళ్లపై దృష్టి సారిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం