EPFO: అధిక పింఛనుపై ఆశలు
ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది.
ఈపీఎఫ్ చందాదారుల ఆప్షన్కు నాలుగు నెలల గడువు
సుప్రీం ఆదేశాలతో కార్యాచరణ మొదలు
ఈపీఎస్ వాటా 12 శాతానికి పెరగనుందా?
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది. 2014 సవరణకు ముందు అధిక పింఛను పొందేందుకు ఈపీఎస్లో చేరని వారికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఈపీఎఫ్ ఖాతాలో నగదును ఈపీఎస్లోకి మళ్లించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న ఈపీఎఫ్వో త్వరలోనే అందులోని మార్గదర్శకాల మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. ఈపీఎస్లో చేరేందుకు వేతనం (బేసిక్+ డీఏ)పై ప్రస్తుతమున్న 8.33 శాతం వాటాను 12 శాతానికి పెంచడంపై అధ్యయనం చేస్తోంది. యజమాని చెల్లించే 12 శాతం మొత్తాన్ని ఈపీఎస్లోకి మళ్లించేలా సవరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గడువు తేదీ లేకపోవడంతో...
ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. అంతకు మించి పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేయాలి. కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ఠ గడువు తేదీ ఏమీ చెప్పలేదు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. దీనికి ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధికవేతనంపై ఈపీఎస్లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. అప్పుడు ఆప్షన్ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది.
ఆ పింఛనుదారులకు ఎలా?
గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు ఆప్షన్ ఇవ్వకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చి, ఈపీఎస్ మొత్తాన్ని ఈపీఎఫ్వోకు చెల్లించారు. ఆ మేరకు అధికవేతనంపై ఎక్కువ పింఛను పొందుతున్నారు. ఈపీఎఫ్వో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాత అధిక పింఛను చెల్లింపులను నిలిపివేశారు. తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆ పింఛనుదారులకు ప్రయోజనం వర్తింపచేయాలా? లేదా? అనే విషయమై ఈపీఎఫ్వో న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.
అధిక పింఛను ప్రయోజనమిలా...
అధిక పింఛను పొందాలనుకునేవారు ఈపీఎస్లో చేరేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. దీని ప్రకారం మూలవేతనం, డీఏ కలిపిన మొత్తంలో 8.33 శాతం ఈపీఎస్లో చెల్లించాలి. ఉదాహరణకు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గత అయిదేళ్ల సగటు నెల వేతనం రూ.25 వేలు. అధిక పింఛను ఆప్షన్ ఇవ్వకుంటే అతనికి గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలుగా పరిగణిస్తారు. దానిపై పింఛను నెలకు రూ.3292 అందుతుంది. అధిక వేతనం రూ.25 వేలపై ఈపీఎస్ చెల్లించేలా ఆప్షన్ ఇచ్చి, ఆ మేరకు ఈపీఎస్కు అదనపు చందా జమచేస్తే నెలకు రూ.8928 పింఛను అందుతుంది.
ఆప్షన్తో పింఛను పెంపు.. ఈపీఎఫ్లో జమ తగ్గింపు
అధిక వేతనంపై ఈపీఎస్ చెల్లించేలా ఉద్యోగి ఆప్షన్ ఇస్తే అతనికి వచ్చే పింఛను పెరుగుతుంది. కానీ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమయ్యే నగదు తగ్గుతుంది. ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతాయి.
* ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం (బేసిక్ + డీఏ) రూ.30 వేలు ఉందనుకుందాం. ఇందులో ఉద్యోగి వాటా రూ.3600 ఈపీఎఫ్ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.3600 ఉంటాయి. ఆప్షన్ ఇవ్వకుంటే (గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా తీసుకుంటారు) ఇందులో 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.2350 ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద ఈపీఎఫ్ ఖాతాలో రూ.5950 ఉంటాయి. పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను తగ్గుతుంది.
* ఒకవేళ ఆప్షన్ ఇస్తే.. వేతనంలో 8.33 శాతం కింద రూ.2499 ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.1101 ఉద్యోగి ఖాతాలోకి వస్తాయి. అంటే యజమాని వాటాతో కలిసి ఈపీఎఫ్ ఖాతాలో నెలకు రూ.4701 జమవుతాయి. పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను పెరుగుతుంది. అధికవేతనంపై పింఛను పొందేందుకు ఆప్షన్ ఇచ్చేవారికి యజమాని చెల్లించే 12 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేసే ఆలోచన జరుగుతోంది. ఇది అమలైతే.. యజమాని వాటా మొత్తం పింఛను పథకంలోకి వెళ్తుంది. ఈపీఎఫ్ ఖాతాలో కేవలం ఉద్యోగి చందా మాత్రమే జమ అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?