EPFO: అధిక పింఛనుపై ఆశలు
ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది.
ఈపీఎఫ్ చందాదారుల ఆప్షన్కు నాలుగు నెలల గడువు
సుప్రీం ఆదేశాలతో కార్యాచరణ మొదలు
ఈపీఎస్ వాటా 12 శాతానికి పెరగనుందా?
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం (ఈపీఎస్)- 2014 సవరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేల కన్నా ఎక్కువ వేతనం పొందుతూ ఇప్పటివరకు పింఛను పథకంలో చేరని ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది. 2014 సవరణకు ముందు అధిక పింఛను పొందేందుకు ఈపీఎస్లో చేరని వారికి సుప్రీంకోర్టు మరికొంత సమయమిచ్చింది. నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడిగా ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఈపీఎఫ్ ఖాతాలో నగదును ఈపీఎస్లోకి మళ్లించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న ఈపీఎఫ్వో త్వరలోనే అందులోని మార్గదర్శకాల మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. ఈపీఎస్లో చేరేందుకు వేతనం (బేసిక్+ డీఏ)పై ప్రస్తుతమున్న 8.33 శాతం వాటాను 12 శాతానికి పెంచడంపై అధ్యయనం చేస్తోంది. యజమాని చెల్లించే 12 శాతం మొత్తాన్ని ఈపీఎస్లోకి మళ్లించేలా సవరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గడువు తేదీ లేకపోవడంతో...
ఈపీఎఫ్ చట్టంలోని పేరా 11(3) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6500గా ఉంది. అంతకు మించి పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో చేరేందుకు ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేయాలి. కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ఠ గడువు తేదీ ఏమీ చెప్పలేదు. 2014లో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచుతూ సవరణ చేసింది. దీనికి ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు.. ఆరు నెలల్లోగా అధికవేతనంపై ఈపీఎస్లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. అప్పుడు ఆప్షన్ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది.
ఆ పింఛనుదారులకు ఎలా?
గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు ఆప్షన్ ఇవ్వకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చి, ఈపీఎస్ మొత్తాన్ని ఈపీఎఫ్వోకు చెల్లించారు. ఆ మేరకు అధికవేతనంపై ఎక్కువ పింఛను పొందుతున్నారు. ఈపీఎఫ్వో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాత అధిక పింఛను చెల్లింపులను నిలిపివేశారు. తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆ పింఛనుదారులకు ప్రయోజనం వర్తింపచేయాలా? లేదా? అనే విషయమై ఈపీఎఫ్వో న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తోంది.
అధిక పింఛను ప్రయోజనమిలా...
అధిక పింఛను పొందాలనుకునేవారు ఈపీఎస్లో చేరేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. దీని ప్రకారం మూలవేతనం, డీఏ కలిపిన మొత్తంలో 8.33 శాతం ఈపీఎస్లో చెల్లించాలి. ఉదాహరణకు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గత అయిదేళ్ల సగటు నెల వేతనం రూ.25 వేలు. అధిక పింఛను ఆప్షన్ ఇవ్వకుంటే అతనికి గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలుగా పరిగణిస్తారు. దానిపై పింఛను నెలకు రూ.3292 అందుతుంది. అధిక వేతనం రూ.25 వేలపై ఈపీఎస్ చెల్లించేలా ఆప్షన్ ఇచ్చి, ఆ మేరకు ఈపీఎస్కు అదనపు చందా జమచేస్తే నెలకు రూ.8928 పింఛను అందుతుంది.
ఆప్షన్తో పింఛను పెంపు.. ఈపీఎఫ్లో జమ తగ్గింపు
అధిక వేతనంపై ఈపీఎస్ చెల్లించేలా ఉద్యోగి ఆప్షన్ ఇస్తే అతనికి వచ్చే పింఛను పెరుగుతుంది. కానీ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమయ్యే నగదు తగ్గుతుంది. ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో, మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతాయి.
* ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం (బేసిక్ + డీఏ) రూ.30 వేలు ఉందనుకుందాం. ఇందులో ఉద్యోగి వాటా రూ.3600 ఈపీఎఫ్ ఖాతాలో జమవుతాయి. యజమాని వాటా కింద రూ.3600 ఉంటాయి. ఆప్షన్ ఇవ్వకుంటే (గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా తీసుకుంటారు) ఇందులో 8.33 శాతం కింద రూ.1250 ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.2350 ఉద్యోగి ఖాతాలో జమవుతాయి. అంటే నెలకు ఉద్యోగి, యజమాని వాటా కింద ఈపీఎఫ్ ఖాతాలో రూ.5950 ఉంటాయి. పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను తగ్గుతుంది.
* ఒకవేళ ఆప్షన్ ఇస్తే.. వేతనంలో 8.33 శాతం కింద రూ.2499 ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తాయి. మిగతా రూ.1101 ఉద్యోగి ఖాతాలోకి వస్తాయి. అంటే యజమాని వాటాతో కలిసి ఈపీఎఫ్ ఖాతాలో నెలకు రూ.4701 జమవుతాయి. పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను పెరుగుతుంది. అధికవేతనంపై పింఛను పొందేందుకు ఆప్షన్ ఇచ్చేవారికి యజమాని చెల్లించే 12 శాతం పూర్తిగా ఈపీఎస్లో జమ చేసే ఆలోచన జరుగుతోంది. ఇది అమలైతే.. యజమాని వాటా మొత్తం పింఛను పథకంలోకి వెళ్తుంది. ఈపీఎఫ్ ఖాతాలో కేవలం ఉద్యోగి చందా మాత్రమే జమ అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!