మీ ఇంటికే వస్తాం.. వంట చేస్తాం
ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది.
ఈనాడు - హైదరాబాద్
ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది. కానీ, రకరకాల వంటలు చేయడం అంటే కొంత ఇబ్బందే. బయట నుంచి తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. ప్యాకేజింగ్, రవాణా సమయంలో అవి సహజ రుచిని కోల్పోతాయి. పైగా ఖరీదూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నీ తీర్చేలా చిన్న, చిన్న వేడుకల కోసం ఎవరైనా ఇంటికే వచ్చి వంట చేసిస్తే బాగుంటుంది కదా.. అనే ఆలోచనతో వచ్చిన అంకురమే ‘బుక్మైచెఫ్’. హోటళ్లలో లభించే అనేక రుచులను ఇంటిలోనే ఆస్వాదించాలనుకునే వారి కోసమే మా ఈ ప్రయత్నం అంటున్నారు సంస్థ సహ వ్యవస్థాపకులు శంకర్ కృష్ణమూర్తి. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు..
‘ఎంతో అనుభవం ఉన్న వంట నిపుణులు మన దగ్గర ఉన్నారు. వీరిని ఒక వేదికపైకి తీసుకురావడం, అవసరం ఉన్న వారికి వీరి సేవలను అందించడం లక్ష్యంగా దీన్ని ప్రారంభించాం. కొవిడ్ లాక్డౌన్ ముగిసిన తర్వాత మా అబ్బాయి పుట్టిన రోజును కొంతమంది సమక్షంలో నిర్వహించాలని అనుకున్నాం. కానీ, తక్కువ మందికి భోజనం సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నేను హోటల్ రంగంలోనే ఉండటంతో, నాకు తెలిసిన కొంతమంది చెఫ్లను పిలిచి, అప్పటికప్పుడు రుచికరమైన వంటలు చేయించాను. అక్కడికి వచ్చిన వారందరికీ ఇది నచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ప్రమోద్ జయవరపు, వరుణ్ రెడ్డిలు వ్యవస్థాపకులుగా నేను సహ వ్యవస్థాపకుడిగా ‘బుక్మైచెఫ్’ను ప్రారంభించాం.
ఏం చేస్తామంటే...
ఎక్కడికైనా వెళ్లినపుడు అక్కడి ఆహార పదార్థాలు మనకు నచ్చుతాయి. కానీ, వాటిని ఇంట్లో తయారు చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. 10, 20 మందిని భోజనానికి పిలిచినపుడూ క్యాటరింగ్ లాంటివి కుదరవు. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేలా సేవలను అందిస్తున్నాం. అవసరం ఉన్నవారు మా యాప్ ద్వారా వంట నిపుణులను ఎంచుకోవచ్చు. కనీసం ఇద్దరి కోసమూ వంట చేయించుకునే వీలుంది. దేశ, విదేశీ ఆహార పదార్థాలు ఏవి కావాలన్నా మీ ఇంటి దగ్గర మీ కళ్లముందే సిద్ధం చేసి మా చెఫ్లు అందిస్తారు. అందులో వాడుతున్న వస్తువులు ఏమిటి అన్నదీ తెలుస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలకు చెఫ్లు ప్రత్యేకంగా ఉంటారు. వీరి కోసమూ ప్రత్యేక సేవలను ప్రారంభించాం. మా ప్లాట్ఫాంలో చెఫ్లను చేర్చుకునేటప్పుడే అనుభవం, వారి నైపుణ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం.
మీ ఇష్టానుసారంగా..
మీకు ఏ ఆహార పదార్థాలు కావాలి అనేది జాబితా నుంచి ఎంపిక చేసుకోవచ్చు. దీని ఆధారంగానే ఎంత రుసుము వసూలు చేయాలన్నది నిర్ణయిస్తాం. వ్యక్తుల సంఖ్యను బట్టి నిర్ణీత రుసుము ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పదార్థానికీ ప్రత్యేకంగా కొంత చెల్లించాలి. వస్తువులను సొంతంగా తెచ్చుకోవచ్చు. మమ్మల్ని అడిగినా సమకూరుస్తాం. చెఫ్లతో పాటు అవసరమైతే వడ్డించేవారు, శుభ్రం చేసేవారినీ పంపిస్తాం.
విస్తరణ ప్రణాళికల్లో..
సొంత పెట్టుబడితో సంస్థను ప్రారంభించాం. ఇప్పటి వరకూ రూ.2 కోట్ల మేరకు పెట్టుబడులను విక్రం రెడ్డి (యూవీ క్రియేషన్స్ ఫండ్), రోనిత్ రెడ్డి (గంగా కావేరీ వెంచర్స్) నుంచి సమీకరించాం. ప్రస్తుతం మా దగ్గర 40 మందికి పైగా చెఫ్లు ఉన్నారు. ముంబయి, దిల్లీతో పాటు ఇతర నగరాలకూ విస్తరించబోతున్నాం. ఈ ఏడాది చివరి నాటికి 400 మందిని మా యాప్లోకి తీసుకొస్తాం. దీంతోపాటు యాప్ను మరింత అభివృద్ధి చేయబోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్