AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది.
అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ అంచనాలు
ఈనాడు - హైదరాబాద్
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మనం కొద్దిగా సమాచారం (ఫీడ్) అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్ (వీడియోలు/సమాచారం)ను అందించే సామర్థ్యం ఏఐ సాంకేతికత కలిగిన స్మార్ట్ఫోన్లకు ఉంటుందని మైక్రోసాఫ్ట్, గూగుల్, శామ్సంగ్ పేర్కొంటున్నాయి.
- గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్ఫోన్లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమేరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది.
- వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి తర్జుమా (ట్రాన్స్లేషన్) చేయడం వంటివి వాస్తవ సమయంలో చోటు చేసుకుంటాయి.
- మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేసుకుంటాయి.
గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మోడల్లో
తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లోని ఏఐ ప్రత్యేకతలు చూస్తే.. స్నాప్డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది.
సర్కిల్ టు సెర్చ్: మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, ఆమె/అతను ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సున్నా (సర్కిల్) కొట్టి సెర్చ్ చేస్తే.. ఆ వస్తువు/దుస్తులను తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు కూడా మనకు సెకన్లలో సెల్ఫోన్ తెరపై ప్రత్యక్షమవుతాయి.
ఏఐ లైవ్ ట్రాన్స్లేట్: మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఆ మాటలను మనకు తెలుగులోనే ఈ ఫోన్ వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి వినిపిస్తుంది. వాస్తవ సమయంలోనే ఇది జరుగుతుంది కనుక.. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు భాషా సమస్యను నివారించుకోవచ్చు. ఇదే పద్ధతిలో సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్)లనూ తర్జుమా చేసి ఇతర భాషల వారికి చూపుతుంది.
కోరుకున్న విధంగా పొజిషన్ మార్చొచ్చు: గదిలో నిలబెట్టి ఒక వ్యక్తిని ఫొటో తీసినా, కావాల్సిన పొజిషన్లో.. వేరే ప్రాంతాల్లో/ఆకాశంలో ఉన్నట్లు.. ఊహలకు అనుగుణంగా ఫొటోలు రూపొందించుకోవచ్చు.
గ్రాఫిక్స్, నోట్ అసిస్ట్: గేమింగ్లో గ్రాఫిక్స్ను ఆకర్షణీయంగా మారుస్తుంది. అంతేకాదు ఏమైనా బృంద చర్చలో పాల్గొన్నప్పుడు, మనం కనుక పాయింట్స్ నోట్ చేసుకుంటే, వాటితో సమగ్ర నోట్ను (సమ్మరీ) నోట్ అసిస్ట్ సిద్ధం చేస్తుంది.
లైఫ్ షాట్: గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్లోని లైఫ్ షాట్ను ఆన్చేసి పెడితే.. మన ఫోన్లోని కెమేరా దృష్టిలో పడిన అంశాలను వేర్వేరుగా చిత్రీకరించి, వీడియోలు.. భిన్న కంటెంట్ రూపంలో మనకు చూపుతుంది.
ఈ సేవలన్నీ ఉచితమేనా
ప్రస్తుతం ఖరీదైన మోడళ్లలోనే ఏఐ సేవలను దిగ్గజ కంపెనీలు అందిస్తున్నాయి. ఎందుకంటే చిప్/ప్రాసెసర్ తయారీ కంపెనీలు కూడా వీటిని అభివృద్ధి చేసేందుకు అధిక పెట్టుబడులు పెట్టడమే కాకుండా, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కనుక, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే అంశాన్నీ కొట్టిపారేయలేమని పరిశ్రమ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే..
చాట్జీపీటీ వంటి థర్డ్పార్టీ యాప్ల ద్వారానే ఆకర్షణీయ ఫీచర్లను స్మార్ట్ఫోన్ కంపెనీలు అందించగలుగుతాయి. క్రమంగా స్థానిక పరిస్థితులకు అనువైన ఫీచర్లు పెరిగే కొద్దీ రుసుములూ నిర్ణయించే వీలుంది.
ఖరీదైన మోడళ్ల అమ్మకాలు పెరుగుతున్న క్రమంలోనే..: దేశీయ విపణిలో చూస్తే 2022, 2023 సంవత్సరాల్లో మొత్తం సెల్ఫోన్ల అమ్మకాలు, అంతకుముందు ఏడాది కంటే 10 శాతం క్షీణించాయి. అయితే రూ.50,000 కు మించి ఖరీదైన మోడళ్ల విక్రయాలు మాత్రం 75 శాతం వృద్ధిని సాధించాయి. అంటే సామాన్యులు ఫోన్ మార్చడంలో ఆచితూచి వ్యవహరిస్తుంటే, సంపాదనా శక్తి కలిగిన యువత, సంపన్నులు మాత్రం కొత్త ఫీచర్లు కలిగిన అధునాతన ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి వల్లే కంపెనీలు కూడా ధైర్యం చేసి, ఖరీదైన స్మార్ట్ఫోన్లలో అధునాతన ఏఐ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇది క్రమంగా తదుపరి ధరల శ్రేణి ఫోన్లకూ మేలు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే