వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది.
స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో భారత్కు గట్టి పోటీ
వేగంగా స్పందిస్తేనే ఫలితాలు
వాటిపై నెగ్గాలంటే పన్నులు తగ్గాల్సిందే
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్నా.. ఉద్యోగాలు సృష్టించాలన్నా.. స్మార్ట్ఫోన్ల తయారీ చాలా కీలకం. అందుకే భారత్ను ఒక దిగ్గజ స్మార్ట్ఫోన్ ఎగుమతుల కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. యాపిల్, ఫాక్స్కాన్, శాంసంగ్లకు ఆహ్వానం పలుకుతోంది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ భారత్కు కంపెనీలు వచ్చి ఇక్కడ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే విషయంలో కాస్త వెనకాడుతున్నాయి. చైనా నుంచి తమ ప్లాంట్లను ఇక్కడకు తరలించడానికి ఆలోచిస్తున్నాయి. మరో వైపు తక్కువ పన్నులతో వియత్నాం, మెక్సికో, థాయ్ల్యాండ్లు ఆయా కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మన దగ్గర పోటీకి సరితూగని పన్నులను ప్రస్తావిస్తూ.. ఆర్థిక శాఖకు ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సిద్ధం చేసిన ఒక లేఖ వెళ్లింది. కీలక తయారీ గమ్యస్థానాలతో పోలిస్తే మన వద్ద ఉన్న అధిక టారిఫ్ల కారణంగా తయారీ వ్యయాలు భారీగా ఉన్నాయని అందులో ఉన్నట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్’ పేర్కొంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో చైనా నుంచి కంపెనీలు బయటకు వెళ్లాలని అనుకుంటున్నాయి. అవి వియత్నాం, మెక్సికో, థాయ్ల్యాండ్లకు వెళ్లేలోగా మనం తగిన చర్యలు తీసుకోవాలని అందులో ఆయన కోరారు.
తయారీ ఇక్కడే కానీ..
భారత్లో తయారయ్యే ఫోన్లలో చాలా వరకు విడిభాగాలను స్థానికంగానే తయారు చేస్తున్నారు. అయితే హై ఎండ్ విడిభాగాలను చైనా నుంచి కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. స్థానిక తయారీదార్ల ప్రయోజనార్థం పెంచిన దిగుమతి పన్నులు కాస్తా ఈ కంపెనీల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి. చైనా, వియత్నాంలు తమ ఎగుమతులను పెంచుకోవడం కోసం తక్కువ పన్నులను ఎలా తీసుకొచ్చాయో ఆ లేఖలో ప్రస్తావించారు. గతేడాది భారత స్మార్ట్ఫోన్ తయారీలో ఎగుమతుల వాటా 25 శాతంగానే ఉండగా.. చైనా 63% (270 బి.డాలర్లు), వియత్నాం 95% (40 బి. డాలర్లు)తో ముందున్నాయని చంద్రశేఖర్ వివరించారు.
యాపిల్, ఫాక్స్కాన్, షియోమీ ఉత్పత్తి పెంచినా
స్మార్ట్ఫోన్ దిగ్గజాలైన యాపిల్, ఫాక్స్కాన్, షియోమీలు ఇటీవలి కాలంలో భారత్లో ఉత్పత్తిని పెంచినా కూడా.. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ తయారీలో మన వాటా కేవలం 4 శాతంగానే ఉంది. 2029 కల్లా మన ఈ వాటాను 25 శాతానికి పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ కవర్ల వంటి విడిభాగాలపై 15% నుంచి 10 శాతానికి తగ్గించినా.. మిగతా పన్ను కోత విజ్ఞప్తులపై ఆర్థిక శాఖ అంగీకరించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తు చేశారు.
పన్నుల భారం ఇదీ..
భారత్ ప్రస్తుతం ఛార్జర్లు, కొన్ని సర్క్యూట్ బోర్డులు, పూర్తి అసెంబ్లింగ్ అయిన ఫోన్లపై 20% పన్నును విధిస్తోంది. ఈ ఏడాదిలో ఈ పన్నును 15 శాతానికి తగ్గించాలని ఐటీ శాఖ కోరుతోంది. వియత్నాం, చైనాలయితే తమ ‘ప్రాధాన్యతా దేశాల’పై లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్టీఏ) ఉన్న దేశాలపై 10 శాతానికి మించి విధించడం లేదని గుర్తు చేశారు. పన్నుల విషయంలో చైనా, వియత్నాంల తరహాలో ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోందని అన్నారు.
కంపెనీలు కోరుతున్నదీ అదే..
కెమేరాలు, యూఎస్బీ కేబుళ్లలో వాడే మరిన్ని విడిభాగాలపై పన్ను తగ్గించాలని ఇటీవలే షియోమీ కేంద్రాన్ని కోరింది. చైనా, వియత్నాం వంటి పోటీ దేశాల టారిఫ్లను పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా మొబైల్ ఫోన్ల తయారీ, అందులో 50% ఎగుమతి చేయాలని భారత్ పెట్టుకున్న లక్ష్యాన్ని చేరాలంటే కచ్చితంగా కొత్త వ్యూహం అవసరమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!