ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
కంపెనీలకు అనుకోని చిక్కులు, పెరిగిన ఖర్చులు
సరకు రవాణాలో తీవ్ర జాప్యం
త్రైమాసిక ఫలితాలపై ప్రభావం!
ఈనాడు - హైదరాబాద్
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ వాణిజ్యం సమస్యాత్మకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఉంది. దీనికి తోడు సోమాలియా, తదితర దేశాలకు చెందిన సముద్ర దొంగల తాకిడి పెరిగింది. ఇప్పుడు అదనంగా యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ అంతర్జాతీయ సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దీంతో సరుకుతో వెళ్తున్న నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. సకాలంలో గమ్యస్ధానాలకు చేరటం లేదు. ఎక్కడపడితే అక్కడ నౌకలు ఆగిపోతున్నాయి.
ఆదాయాలు ఆశించినంత పెరగలేదు
సరుకుతో వెళ్లిన నౌకలు తిరిగి రావటానికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టం కావటం లేదు. దీనివల్ల సరకు రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితి స్థానిక కంపెనీల ఆదాయాలు, లాభాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో ఆదాయాలు నమోదు చేయలేకపోయాయి. దీనికి ఎర్ర సముద్రంలోని పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యంపై దాని ప్రభావం... ప్రధాన కారణాలని ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్న కంపెనీలకు ఆదాయాలు ఆశించిన విధంగా పెరగకపోవటం గమనార్హం.
ఏ కంపెనీలపై ప్రభావం అంటే..
స్పెషాలిటీ పైపులు, ట్యూబుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయాలు ఈ మూడో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా పెరగలేదు. ఈ సంస్థ ఆదాయాల్లో 85 శాతం వరకూ ఎగుమతులే ఉండటం గమనార్హం. ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ సరకు రవాణా సమస్యాత్మకంగా మారినట్లు, అందువల్ల ఆదాయ అంచనాలను అందుకోలేకపోయినట్లు ఈ సంస్థ యాజమాన్యం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత మదుపరులకు వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని, అయినప్పటికీ తగిన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఖర్చులు కూడా పెరిగినట్లు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంది. నౌకల రాకపోకలు నిలిచిపోతున్నాయని, దీనివల్ల ఇతర దేశాలకు సరకు పంపించటం కష్టంగా మారిందని సంస్థ సీఈఓ పరస్ కుమార్ జైన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ‘కాన్ఫరెన్స్ కాల్’లో మదుపరులకు వివరించారు. అంతేగాక అటు వినియోగదార్లకు, ఇటు తమకు ఖర్చులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఐరోపా దేశాల నుంచి ఈ సంస్థ కొన్ని ముడిపదార్థాలు కూడా తెచ్చుకుంటుంది. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో తమపై రవాణా ఛార్జీల భారం అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు, దానికి తగ్గట్లుగా తాము సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎగుమతులు, దిగుమతులు అధికంగా ఉన్న పలు ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అవసరమని ఆ వర్గాలు కోరుతున్నాయి.
రంగంలోకి వాణిజ్య శాఖ..
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. వాణిజ్య శాఖ ఉన్నతాధికార వర్గాలు వివిధ ఇతర మంత్రిత్వ శాఖలతో, వర్తక సంఘాలతో సంప్రదింపులు చేపట్టాయి. ముఖ్యంగా భారీగా పెరిగిన ఫ్రైట్ (సరకు రవాణా ఛార్జీలు), బీమా ఖర్చుల వల్ల పరిశ్రమలపై ఏమేరకు భారం పడుతోంది, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా... అనే కోణంలో వాణిజ్య శాఖ వర్గాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశం నుంచి వ్యాపార సంస్థలు, ఐరోపా దేశాలకు దాదాపు 80 శాతం ఎగుమతులు ఎర్ర సముద్రం ద్వారా నిర్వహిస్తున్న విషయం గమనార్హం. అందువల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందేమోనని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి