Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు.
32% కేటాయించిన దేశీయులు
నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడి
దిల్లీ: సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. తమ సంపదలో 32 శాతాన్ని దేశ, విదేశాల్లోని స్థిరాస్తులు/నివాసాలపైనే ఖర్చుపెడుతున్నారు.‘ది వెల్త్ రిపోర్ట్ 2024’ పేరిట విడుదల చేసిన నివేదికలో స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..
- దేశంలోని అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్ఎన్డబ్ల్యూఐ) అంటే 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.250 కోట్లు) అంత కంటే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. తమ సంపదలో 32 శాతాన్ని నివాస స్థిరాస్తిపైనే పెడుతున్నారు.
- సగటున ఒక్కో సంపన్నుడు 2.57 ఇళ్లు కలిగి ఉన్నారు. 2023లో తమ అదనపు ఇళ్లను 28% మంది అద్దెకిచ్చారు.
- 2024లో 12% మంది కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. గతేడాదీ ఇంతే మంది కొత్త ఇంటిని తీసుకున్నారు. అంతర్జాతీయంగా 2024లో 22% మంది మరో ఇంటిని సొంతం చేసుకున్నారు.
- అగ్రగామి 10 విలాస నివాస మార్కెట్లలో ముంబయి కూడా ఉంది. ఈ జాబితాలో మనీలా(26% వృద్ధి) అగ్రగామిగా ఉండగా.. దుబాయ్(16%) రెండో స్థానానికి దిగి వచ్చింది. బహమాస్(15%), అల్గేర్వ్(12.3%), కేప్ టౌన్(12.3%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- 2022లో దిల్లీ 77వ ర్యాంకులో ఉండగా.. 4.2% వృద్ధితో 37వ స్థానానికి చేరింది. 2.2% వృద్ధితో బెంగళూరు కూడా 63వ స్థానం నుంచి 59కి చేరింది.
- 100 నివాస మార్కెట్లలో 80 సానుకూల వృద్ధిని కనబరచాయి.
- అమెరికా(3.6%)తో పోలిస్తే ఆసియా పసిఫిక్(3.8%) బలంగా కనిపిస్తోంది.
విలాస వస్తువులపైనా..
సంపన్నులంటే గుర్తుకొచ్చేదే విలాస వస్తువులు. వీరు తమ వద్ద పెట్టుబడి పెట్టదగ్గ సంపదలో 17 శాతాన్ని విలాస (లగ్జరీ) వస్తువులపై వెచ్చిస్తున్నారు. వాచీలు, కళాఖండాలు, ఆభరణాలపై ఖర్చు చేస్తున్నారని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. క్లాసిక్ కార్లు, లగ్జరీ హ్యాండ్బాగ్లు, వైన్, అరుదుగా లభించే విస్కీ, ఫర్నీచర్, వజ్రాలు, నాణేలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ధోరణిని పరిశీలించినప్పుడు విలాస వాచీలు తొలిస్థానంలో ఉండగా.. క్లాసిక్ కార్లు రెండో స్థానంలో ఉన్నాయి.
2023లో కళాఖండాల్లో పెట్టుబడులు 11% ప్రతిఫలాన్ని ఇవ్వగా.. 10 ఏళ్ల కాలానికి అరుదుగా లభించే విస్కీ దాదాపు 280% ప్రతిఫలాన్ని ఇచ్చిందని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ పేర్కొంది.
అయిదేళ్లలో 50% పెరగనున్న సంపన్నులు
- గతేడాదిలో 13,263 మంది
- అంతర్జాతీయంగా 6.26 లక్షల పైమాటే
భారత్లో సంపన్నుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 6% పెరిగి 13,263కు చేరింది. అయిదేళ్లలో అంటే 2028 కల్లా వీరి సంఖ్య 50.1% పెరిగి 19,908కు చేరుతుందని నైట్ఫ్రాంక్ అంటోంది. 2024లోనూ తమ సంపద పెరుగుతుందని 90% మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు భావిస్తున్నారు. సంపద వృద్ధి 10% కంటే ఎక్కువే ఉంటుందని 63% మంది అంచనా వేస్తున్నారు.
- అంతర్జాతీయంగా చూస్తే వచ్చే అయిదేళ్లలో 28.1% వృద్ధితో 8,02,891 మంది సంపన్నులు అవుతారని ఆ సంస్థ పేర్కొంది. 2023లో 4.2% వృద్ధితో వీరి సంఖ్య 6,26,619కి పెరిగింది.
- సంపన్నుల సంఖ్య వృద్ధి విషయంలో తుర్కియే(9.7%) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అమెరికా(7.9%), భారత్(6.1%), దక్షిణకొరియా(5.6%), స్విట్జర్లాండ్(5.2%) ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి