Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు.
32% కేటాయించిన దేశీయులు
నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడి
దిల్లీ: సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. తమ సంపదలో 32 శాతాన్ని దేశ, విదేశాల్లోని స్థిరాస్తులు/నివాసాలపైనే ఖర్చుపెడుతున్నారు.‘ది వెల్త్ రిపోర్ట్ 2024’ పేరిట విడుదల చేసిన నివేదికలో స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..
- దేశంలోని అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్ఎన్డబ్ల్యూఐ) అంటే 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.250 కోట్లు) అంత కంటే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. తమ సంపదలో 32 శాతాన్ని నివాస స్థిరాస్తిపైనే పెడుతున్నారు.
- సగటున ఒక్కో సంపన్నుడు 2.57 ఇళ్లు కలిగి ఉన్నారు. 2023లో తమ అదనపు ఇళ్లను 28% మంది అద్దెకిచ్చారు.
- 2024లో 12% మంది కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. గతేడాదీ ఇంతే మంది కొత్త ఇంటిని తీసుకున్నారు. అంతర్జాతీయంగా 2024లో 22% మంది మరో ఇంటిని సొంతం చేసుకున్నారు.
- అగ్రగామి 10 విలాస నివాస మార్కెట్లలో ముంబయి కూడా ఉంది. ఈ జాబితాలో మనీలా(26% వృద్ధి) అగ్రగామిగా ఉండగా.. దుబాయ్(16%) రెండో స్థానానికి దిగి వచ్చింది. బహమాస్(15%), అల్గేర్వ్(12.3%), కేప్ టౌన్(12.3%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- 2022లో దిల్లీ 77వ ర్యాంకులో ఉండగా.. 4.2% వృద్ధితో 37వ స్థానానికి చేరింది. 2.2% వృద్ధితో బెంగళూరు కూడా 63వ స్థానం నుంచి 59కి చేరింది.
- 100 నివాస మార్కెట్లలో 80 సానుకూల వృద్ధిని కనబరచాయి.
- అమెరికా(3.6%)తో పోలిస్తే ఆసియా పసిఫిక్(3.8%) బలంగా కనిపిస్తోంది.
విలాస వస్తువులపైనా..
సంపన్నులంటే గుర్తుకొచ్చేదే విలాస వస్తువులు. వీరు తమ వద్ద పెట్టుబడి పెట్టదగ్గ సంపదలో 17 శాతాన్ని విలాస (లగ్జరీ) వస్తువులపై వెచ్చిస్తున్నారు. వాచీలు, కళాఖండాలు, ఆభరణాలపై ఖర్చు చేస్తున్నారని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. క్లాసిక్ కార్లు, లగ్జరీ హ్యాండ్బాగ్లు, వైన్, అరుదుగా లభించే విస్కీ, ఫర్నీచర్, వజ్రాలు, నాణేలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ధోరణిని పరిశీలించినప్పుడు విలాస వాచీలు తొలిస్థానంలో ఉండగా.. క్లాసిక్ కార్లు రెండో స్థానంలో ఉన్నాయి.
2023లో కళాఖండాల్లో పెట్టుబడులు 11% ప్రతిఫలాన్ని ఇవ్వగా.. 10 ఏళ్ల కాలానికి అరుదుగా లభించే విస్కీ దాదాపు 280% ప్రతిఫలాన్ని ఇచ్చిందని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ పేర్కొంది.
అయిదేళ్లలో 50% పెరగనున్న సంపన్నులు
- గతేడాదిలో 13,263 మంది
- అంతర్జాతీయంగా 6.26 లక్షల పైమాటే
భారత్లో సంపన్నుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 6% పెరిగి 13,263కు చేరింది. అయిదేళ్లలో అంటే 2028 కల్లా వీరి సంఖ్య 50.1% పెరిగి 19,908కు చేరుతుందని నైట్ఫ్రాంక్ అంటోంది. 2024లోనూ తమ సంపద పెరుగుతుందని 90% మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు భావిస్తున్నారు. సంపద వృద్ధి 10% కంటే ఎక్కువే ఉంటుందని 63% మంది అంచనా వేస్తున్నారు.
- అంతర్జాతీయంగా చూస్తే వచ్చే అయిదేళ్లలో 28.1% వృద్ధితో 8,02,891 మంది సంపన్నులు అవుతారని ఆ సంస్థ పేర్కొంది. 2023లో 4.2% వృద్ధితో వీరి సంఖ్య 6,26,619కి పెరిగింది.
- సంపన్నుల సంఖ్య వృద్ధి విషయంలో తుర్కియే(9.7%) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అమెరికా(7.9%), భారత్(6.1%), దక్షిణకొరియా(5.6%), స్విట్జర్లాండ్(5.2%) ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.