Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి.
దిగివస్తున్న వాహన ధరలు
ఫేమ్-2 సబ్సిడీ గడువు ముగుస్తున్న ఫలితం
ఉత్పత్తి వ్యయాలు తగ్గడమూ కలిసొస్తోంది
ఈనాడు - హైదరాబాద్
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. అదే సమయంలో పెట్రోలు స్కూటర్లు, మోటార్సైకిళ్లు రూ.1 లక్ష దరిదాపుల్లోనే లభిస్తున్నాయి. దీంతో విద్యుత్తు వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తూ వచ్చాయి. ఇపుడు విద్యుత్తు ద్విచక్ర వాహన కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఒక్కో వాహనంపై రూ.25,000 వరకు రాయితీ ఇస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 శ్రేణి స్కూటర్ల ధరను రూ.25,000 వరకు తగ్గించింది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్+ వాహనాలకు ఈ తగ్గింపు వర్తిస్తోంది. దీనివల్ల రూ.79,999 నుంచి రూ.1,29,999 షోరూమ్ ధరకు ఈ వాహనాలు లభిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ అనుబంధ విడా కూడా తమ స్కూటర్ల ధరలను తగ్గించింది. విద్యుత్తు కార్ల కంపెనీలూ ఇదే బాట పట్టడం ఆసక్తికర అంశం. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఎంజీ మోటార్స్.. తదితర సంస్థలు తమ విద్యుత్తు కార్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి.
కారణాలివీ..
విద్యుత్తు వాహనాల ధరలు దిగిరావడానికి ‘టెక్నాలజీ మార్పులు, అధిక సంఖ్యలో వాహనాలు ఉత్పత్తి చేస్తున్నందున వ్యయాలు తగ్గడం’ వంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న ఫేమ్- 2 సబ్సిడీ గడువు ఈ నెలాఖరుతో తీరిపోతోంది. కేంద్రం ప్రభుత్వం ఈ పథకం కింద రూ.7,048 కోట్లు కేటాయించింది. విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల కొనుగోలుదార్లకు రాయితీ ఇచ్చేందుకు ఈ నిధులు ఉపకరిస్తున్నాయి. గడువు లోపు ఈ సబ్సిడీ వల్ల ప్రయోజనం పొందే లక్ష్యంతో విద్యుత్తు వాహనాల తయారీ సంస్థలు కూడా ఇప్పుడు వాహనాల ధర తగ్గింపునకు సిద్ధపడుతున్నాయి. తమ వాహనాల నిల్వలను మార్చి నెలాఖరు లోగా ఖాళీ చేసేందుకు దీన్నొక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ పరిణామాలు వినియోగదార్లకు మేలు చేస్తున్నాయి. తక్కువ ధరలో విద్యుత్తు వాహనాన్ని సొంతం చేసుకునే వీలు కలుగుతోంది.
అమ్మకాల్లో అనూహ్య వృద్ధి
విద్యుత్తు వాహనాల పరిశ్రమ సమీప భవిష్యత్తులో అనూహ్య వృద్ధి సాధించబోతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022-23లో అన్ని రకాల విద్యుత్తు వాహనాల (2- 3 వీలర్స్, కార్లు, బస్సులు) అమ్మకాలు 11.79 లక్షల మేరకు నమోదయ్యాయి. 2023-24లో ఇప్పటికే 13.77 లక్షల విద్యుత్తు వాహనాల అమ్మకాలు జరిగాయి. విద్యుత్తు టూ-వీలర్లు, బస్సుల కంటే ఆటోలు, కార్ల విభాగంలో అధిక వృద్ధి కనిపిస్తోంది. విద్యుత్తు ద్విచక్ర వాహన అమ్మకాలు 2022-23లో 7.28 లక్షలైతే, 2023-24లో ఫిబ్రవరి నెలాఖరు వరకూ 7.37 లక్షల వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. ధరలు తగ్గించినందున మార్చిలో అమ్మకాలు బాగా పెరుగుతాయని, తత్ఫలితంగా 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
2027 నాటికి ఎన్నో మార్పులు
సంప్రదాయ పెట్రోలు, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నందున, ఉత్పత్తి వ్యయాలు వచ్చే కొన్నేళ్లలో బాగా తగ్గుతాయని, దానివల్ల పెట్రోలు, డీజిల్ వాహనాల ధరకే విద్యుత్తు వాహనాలు లభిస్తాయని గార్ట్నర్ అనే పరిశోధనా సేవల సంస్థ అంచనా వేసింది. దీనివల్ల 2027 నాటికి విద్యుత్తు వాహనాల ధరలు బాగా దిగివచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలో వివరించింది. ఉత్పత్తి ప్రక్రియలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు వీలు కల్పిస్తాయని పేర్కొంది. పెట్రోలు, డీజిల్ వాహనాల ఉత్పత్తి వ్యయం ఎక్కువగా, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి వ్యయం తక్కువగా మారే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేసింది.
మరమ్మతులతోనే సమస్య..
అమెరికాలో టెస్లా అందుబాటులోకి తెచ్చిన ‘గిగాక్యాస్టింగ్స్’ ప్రవేశంతో విద్యుత్తు వాహనాల ఉత్పత్తి తీరుతెన్నులు మారిపోతున్నాయి. ఎంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో లక్షల సంఖ్యలో విద్యుత్తు వాహనాలు ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఈ సాంకేతికత వల్ల లభిస్తోంది. అయితే విద్యుత్తు వాహనాల మరమ్మతులు ఖరీదైన వ్యవహారంగా మారడం సమస్యగా ఉందని గార్ట్నర్ పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్తు వాహనానికి ప్రమాదం జరిగితే, మరమ్మతు చేయడానికి అధికంగా ఖర్చవుతుందని తెలిపింది. వాహన కొనుగోలు ధరతో పాటు మరమ్మతు ఖర్చు తక్కువగా ఉంటే విద్యుత్తు వాహనాలకు అధిక ఆదరణ లభిస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం