Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి.
దిగివస్తున్న వాహన ధరలు
ఫేమ్-2 సబ్సిడీ గడువు ముగుస్తున్న ఫలితం
ఉత్పత్తి వ్యయాలు తగ్గడమూ కలిసొస్తోంది
ఈనాడు - హైదరాబాద్
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. అదే సమయంలో పెట్రోలు స్కూటర్లు, మోటార్సైకిళ్లు రూ.1 లక్ష దరిదాపుల్లోనే లభిస్తున్నాయి. దీంతో విద్యుత్తు వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తూ వచ్చాయి. ఇపుడు విద్యుత్తు ద్విచక్ర వాహన కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఒక్కో వాహనంపై రూ.25,000 వరకు రాయితీ ఇస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 శ్రేణి స్కూటర్ల ధరను రూ.25,000 వరకు తగ్గించింది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్+ వాహనాలకు ఈ తగ్గింపు వర్తిస్తోంది. దీనివల్ల రూ.79,999 నుంచి రూ.1,29,999 షోరూమ్ ధరకు ఈ వాహనాలు లభిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ అనుబంధ విడా కూడా తమ స్కూటర్ల ధరలను తగ్గించింది. విద్యుత్తు కార్ల కంపెనీలూ ఇదే బాట పట్టడం ఆసక్తికర అంశం. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఎంజీ మోటార్స్.. తదితర సంస్థలు తమ విద్యుత్తు కార్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి.
కారణాలివీ..
విద్యుత్తు వాహనాల ధరలు దిగిరావడానికి ‘టెక్నాలజీ మార్పులు, అధిక సంఖ్యలో వాహనాలు ఉత్పత్తి చేస్తున్నందున వ్యయాలు తగ్గడం’ వంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న ఫేమ్- 2 సబ్సిడీ గడువు ఈ నెలాఖరుతో తీరిపోతోంది. కేంద్రం ప్రభుత్వం ఈ పథకం కింద రూ.7,048 కోట్లు కేటాయించింది. విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల కొనుగోలుదార్లకు రాయితీ ఇచ్చేందుకు ఈ నిధులు ఉపకరిస్తున్నాయి. గడువు లోపు ఈ సబ్సిడీ వల్ల ప్రయోజనం పొందే లక్ష్యంతో విద్యుత్తు వాహనాల తయారీ సంస్థలు కూడా ఇప్పుడు వాహనాల ధర తగ్గింపునకు సిద్ధపడుతున్నాయి. తమ వాహనాల నిల్వలను మార్చి నెలాఖరు లోగా ఖాళీ చేసేందుకు దీన్నొక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ పరిణామాలు వినియోగదార్లకు మేలు చేస్తున్నాయి. తక్కువ ధరలో విద్యుత్తు వాహనాన్ని సొంతం చేసుకునే వీలు కలుగుతోంది.
అమ్మకాల్లో అనూహ్య వృద్ధి
విద్యుత్తు వాహనాల పరిశ్రమ సమీప భవిష్యత్తులో అనూహ్య వృద్ధి సాధించబోతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022-23లో అన్ని రకాల విద్యుత్తు వాహనాల (2- 3 వీలర్స్, కార్లు, బస్సులు) అమ్మకాలు 11.79 లక్షల మేరకు నమోదయ్యాయి. 2023-24లో ఇప్పటికే 13.77 లక్షల విద్యుత్తు వాహనాల అమ్మకాలు జరిగాయి. విద్యుత్తు టూ-వీలర్లు, బస్సుల కంటే ఆటోలు, కార్ల విభాగంలో అధిక వృద్ధి కనిపిస్తోంది. విద్యుత్తు ద్విచక్ర వాహన అమ్మకాలు 2022-23లో 7.28 లక్షలైతే, 2023-24లో ఫిబ్రవరి నెలాఖరు వరకూ 7.37 లక్షల వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. ధరలు తగ్గించినందున మార్చిలో అమ్మకాలు బాగా పెరుగుతాయని, తత్ఫలితంగా 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
2027 నాటికి ఎన్నో మార్పులు
సంప్రదాయ పెట్రోలు, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నందున, ఉత్పత్తి వ్యయాలు వచ్చే కొన్నేళ్లలో బాగా తగ్గుతాయని, దానివల్ల పెట్రోలు, డీజిల్ వాహనాల ధరకే విద్యుత్తు వాహనాలు లభిస్తాయని గార్ట్నర్ అనే పరిశోధనా సేవల సంస్థ అంచనా వేసింది. దీనివల్ల 2027 నాటికి విద్యుత్తు వాహనాల ధరలు బాగా దిగివచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలో వివరించింది. ఉత్పత్తి ప్రక్రియలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు వీలు కల్పిస్తాయని పేర్కొంది. పెట్రోలు, డీజిల్ వాహనాల ఉత్పత్తి వ్యయం ఎక్కువగా, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి వ్యయం తక్కువగా మారే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేసింది.
మరమ్మతులతోనే సమస్య..
అమెరికాలో టెస్లా అందుబాటులోకి తెచ్చిన ‘గిగాక్యాస్టింగ్స్’ ప్రవేశంతో విద్యుత్తు వాహనాల ఉత్పత్తి తీరుతెన్నులు మారిపోతున్నాయి. ఎంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో లక్షల సంఖ్యలో విద్యుత్తు వాహనాలు ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఈ సాంకేతికత వల్ల లభిస్తోంది. అయితే విద్యుత్తు వాహనాల మరమ్మతులు ఖరీదైన వ్యవహారంగా మారడం సమస్యగా ఉందని గార్ట్నర్ పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్తు వాహనానికి ప్రమాదం జరిగితే, మరమ్మతు చేయడానికి అధికంగా ఖర్చవుతుందని తెలిపింది. వాహన కొనుగోలు ధరతో పాటు మరమ్మతు ఖర్చు తక్కువగా ఉంటే విద్యుత్తు వాహనాలకు అధిక ఆదరణ లభిస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి