అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి.
గతంతో పోలిస్తే పరిమిత ప్రభావమే
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. అది ఒక విధంగా నిజమే. అక్కడి మార్కెట్ల తీరును బట్టి, మరుసటి రోజు మన మార్కెట్లు కదలాడిన రోజులు ఎన్నో. అయితే ఇటీవలి కాలంలో ఆ ప్రభావం పరిమితంగా ఉంటోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో 3 సార్లు రేట్ల కోతను చేపడతామనే సంకేతాలిచ్చింది. తదుపరి అక్కడి మార్కెట్లు కొంత పెరిగాయి. అక్కడి రేట్ల కోత ప్రభావం మన మార్కెట్లపై ఎలా ఉండొచ్చనే అంశంపై విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కడ వడ్డీరేట్ల ప్రభావం ఇలా..
- ఫెడ్ కీలక రేట్ల ఆధారంగానే అమెరికాలోని బ్యాంకులు తమ నగదు నిల్వలను సర్దుబాటు చేసుకుంటాయి. రోజూ ఉదయం తమ వద్ద ఉన్న నగదు నిల్వలను చూసుకుని.. తమ అవసరాలను అంచనా వేస్తాయి. తక్కువ నిధులు ఉన్నాయనిపిస్తే.. ఇతర బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని.. తర్వాతి రోజు వడ్డీతో చెల్లిస్తాయి.
- పెద్ద కంపెనీలు కూడా తమ వృద్ధి ప్రణాళికల కోసం/రోజువారీ కార్యకలాపాల కోసం తీసుకునే రుణ వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. వడ్డీ రేట్లు తగ్గితే, ‘అంతకుముందు అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తీర్చేయడానికి కొత్త రుణాలు తీసుకునే వెసులుబాటు కంపెనీలకు కలుగుతుంది. దీంతో కంపెనీల లాభాల మార్జిన్ పెరుగుతుంది. తద్వారా ఆదాయాలూ మెరుగవుతాయి. వడ్డీ భారం తగ్గినప్పుడు, సహజంగానే వినియోగదార్ల వ్యయాలూ పెరుగుతాయి. తద్వారా కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇదో చక్రంలాగా మారి కార్పొరేట్ ఫలితాలపై సానుకూల ప్రభావం పడుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లో షేర్లు పరుగులు తీసే అవకాశం ఉంటుంది.
మన దేశంలో ప్రభావం ఇలా
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినపుడు, అక్కడి బాండ్లపై అధిక ప్రతిఫలం లభిస్తుంది కనుక, మనలాంటి వర్థమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులను అక్కడి పెట్టుబడిదార్లు తరలించే వీలుంది. బాండ్లతో పోలిస్తే, మన మార్కెట్లలోనే మంచి ప్రతిఫలాలు వస్తున్నాయనుకుంటే మాత్రం పెట్టుబడులను ఉపసంహరించరు. గత ఏడాదంతా జరిగింది అదే. ఆ సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినా, మన స్టాక్ మార్కెట్లోకి భారీ స్థాయిలో విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది వడ్డీరేట్లను ఫెడ్ తగ్గిస్తే..అమెరికాలో వడ్డీరేట్లలో కోత విధిస్తే, బాండ్లపై ప్రతిఫలం తగ్గుతుంది. అందువల్ల అధిక ప్రతిఫలం ఏ దేశంలో లభిస్తుందో చూసి, అక్కడకు తమ పెట్టుబడులను మదుపర్లు మళ్లిస్తుంటారు. రేట్ల కోత సమయానికి మన ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుంటే, ఇక్కడకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని అనుకోవాలి. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం మరీ బలమైన బులిష్ ధోరణి ఏమీ కనిపించకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే రేట్ల కోత ప్రకటనల ప్రభావం వల్ల మన మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు ముందుగానే వచ్చాయనే వాదనా ఉంది. అయినా కూడా భారీ లాభాలు రాకున్నా, మన మార్కెట్లకు ఎంతో కొంత సానుకూలమే అవుతుందని, ముందుకే వెళ్లొచ్చని అంటున్నారు. జూన్, జులైలోగా అమెరికాలో కీలక రేట్లలో కోత జరగకపోతే మాత్రం స్వల్పకాలంలో మన మార్కెట్లు నిరుత్సాహానికి గురికావచ్చని అంటున్నారు.
మన మదుపర్లు ఏం చేయాలి?
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు జూన్ వరకు సమయం ఉన్నందున, మదుపర్లు ఎంపిక చేసిన స్క్రిప్ల ఆధారంగానే అడుగులు వేయడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రుతు పవనాలపై అంచనాలు, పరపతి విధాన ధోరణిలో మార్పులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. స్వల్పకాలానికైతే చాలా తక్కువ శ్రేణిలోనే మార్కెట్లు చలించొచ్చని.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం మేలని చెబుతున్నారు.
పసిడి దారెటు?
అమెరికా వడ్డీ రేట్లకు, పసిడి ధరలకు లంకె ఉంటుంది. రేట్లు తగ్గినపుడు సహజంగానే బాండ్లలోని పెట్టుబడులు కాస్తా రక్షణాత్మకంగా భావించే పసిడిలోకి మళ్లుతుంటాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కూడా పసిడి ధర పెరిగేందుకు దోహదం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ఔన్సు (31.10 గ్రాముల) ధర 2250 డాలర్లను అధిగమిస్తే.. 2400 డాలర్లకు చేరొచ్చనే అంచనాలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!