అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి.
గతంతో పోలిస్తే పరిమిత ప్రభావమే
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. అది ఒక విధంగా నిజమే. అక్కడి మార్కెట్ల తీరును బట్టి, మరుసటి రోజు మన మార్కెట్లు కదలాడిన రోజులు ఎన్నో. అయితే ఇటీవలి కాలంలో ఆ ప్రభావం పరిమితంగా ఉంటోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో 3 సార్లు రేట్ల కోతను చేపడతామనే సంకేతాలిచ్చింది. తదుపరి అక్కడి మార్కెట్లు కొంత పెరిగాయి. అక్కడి రేట్ల కోత ప్రభావం మన మార్కెట్లపై ఎలా ఉండొచ్చనే అంశంపై విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కడ వడ్డీరేట్ల ప్రభావం ఇలా..
- ఫెడ్ కీలక రేట్ల ఆధారంగానే అమెరికాలోని బ్యాంకులు తమ నగదు నిల్వలను సర్దుబాటు చేసుకుంటాయి. రోజూ ఉదయం తమ వద్ద ఉన్న నగదు నిల్వలను చూసుకుని.. తమ అవసరాలను అంచనా వేస్తాయి. తక్కువ నిధులు ఉన్నాయనిపిస్తే.. ఇతర బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని.. తర్వాతి రోజు వడ్డీతో చెల్లిస్తాయి.
- పెద్ద కంపెనీలు కూడా తమ వృద్ధి ప్రణాళికల కోసం/రోజువారీ కార్యకలాపాల కోసం తీసుకునే రుణ వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. వడ్డీ రేట్లు తగ్గితే, ‘అంతకుముందు అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తీర్చేయడానికి కొత్త రుణాలు తీసుకునే వెసులుబాటు కంపెనీలకు కలుగుతుంది. దీంతో కంపెనీల లాభాల మార్జిన్ పెరుగుతుంది. తద్వారా ఆదాయాలూ మెరుగవుతాయి. వడ్డీ భారం తగ్గినప్పుడు, సహజంగానే వినియోగదార్ల వ్యయాలూ పెరుగుతాయి. తద్వారా కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇదో చక్రంలాగా మారి కార్పొరేట్ ఫలితాలపై సానుకూల ప్రభావం పడుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లో షేర్లు పరుగులు తీసే అవకాశం ఉంటుంది.
మన దేశంలో ప్రభావం ఇలా
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినపుడు, అక్కడి బాండ్లపై అధిక ప్రతిఫలం లభిస్తుంది కనుక, మనలాంటి వర్థమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులను అక్కడి పెట్టుబడిదార్లు తరలించే వీలుంది. బాండ్లతో పోలిస్తే, మన మార్కెట్లలోనే మంచి ప్రతిఫలాలు వస్తున్నాయనుకుంటే మాత్రం పెట్టుబడులను ఉపసంహరించరు. గత ఏడాదంతా జరిగింది అదే. ఆ సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినా, మన స్టాక్ మార్కెట్లోకి భారీ స్థాయిలో విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది వడ్డీరేట్లను ఫెడ్ తగ్గిస్తే..అమెరికాలో వడ్డీరేట్లలో కోత విధిస్తే, బాండ్లపై ప్రతిఫలం తగ్గుతుంది. అందువల్ల అధిక ప్రతిఫలం ఏ దేశంలో లభిస్తుందో చూసి, అక్కడకు తమ పెట్టుబడులను మదుపర్లు మళ్లిస్తుంటారు. రేట్ల కోత సమయానికి మన ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుంటే, ఇక్కడకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని అనుకోవాలి. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం మరీ బలమైన బులిష్ ధోరణి ఏమీ కనిపించకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే రేట్ల కోత ప్రకటనల ప్రభావం వల్ల మన మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు ముందుగానే వచ్చాయనే వాదనా ఉంది. అయినా కూడా భారీ లాభాలు రాకున్నా, మన మార్కెట్లకు ఎంతో కొంత సానుకూలమే అవుతుందని, ముందుకే వెళ్లొచ్చని అంటున్నారు. జూన్, జులైలోగా అమెరికాలో కీలక రేట్లలో కోత జరగకపోతే మాత్రం స్వల్పకాలంలో మన మార్కెట్లు నిరుత్సాహానికి గురికావచ్చని అంటున్నారు.
మన మదుపర్లు ఏం చేయాలి?
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు జూన్ వరకు సమయం ఉన్నందున, మదుపర్లు ఎంపిక చేసిన స్క్రిప్ల ఆధారంగానే అడుగులు వేయడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రుతు పవనాలపై అంచనాలు, పరపతి విధాన ధోరణిలో మార్పులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. స్వల్పకాలానికైతే చాలా తక్కువ శ్రేణిలోనే మార్కెట్లు చలించొచ్చని.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం మేలని చెబుతున్నారు.
పసిడి దారెటు?
అమెరికా వడ్డీ రేట్లకు, పసిడి ధరలకు లంకె ఉంటుంది. రేట్లు తగ్గినపుడు సహజంగానే బాండ్లలోని పెట్టుబడులు కాస్తా రక్షణాత్మకంగా భావించే పసిడిలోకి మళ్లుతుంటాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కూడా పసిడి ధర పెరిగేందుకు దోహదం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ఔన్సు (31.10 గ్రాముల) ధర 2250 డాలర్లను అధిగమిస్తే.. 2400 డాలర్లకు చేరొచ్చనే అంచనాలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే